Kakinada District Police



Kakinada District Police

// మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు //

మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో కాకినాడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు గారు దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడని, ఆయన ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగనిరతి నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మన్యం ప్రజల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం భారత స్వాతంత్ర్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ గారు, అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) శ్రీ ఎస్ శ్రీనివాసరావు గారు, ఎస్బి డిఎస్పీ శ్రీ కెవివి సత్యనారాయణ గారు, ఏ ఆర్ డిఎస్పీ శ్రీ వి జి శ్రీహరి రావు గారు, ఇతర పోలీసు అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని మన్యం వీరుడికి ఘనంగా నివాళులు అర్పించారు.


-జిల్లా పోలీసు కార్యాలయం, కాకినాడ

20 hours ago (edited) | [YT] | 4

Kakinada District Police

// CEIR పోర్టల్ ద్వారా భారీగా మొబైల్ ఫోన్ల రికవరీ – బాధితులకు 602 మొబైల్ ఫోన్లను అందజేసిన కాకినాడ జిల్లా పోలీసులు //
// రూ.1,20,40,000 విలువైన 602 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేత //
కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి ప్రత్యేక చొరవతో, CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించే కార్యక్రమాన్ని జిల్లా పోలీసులు విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
ఈ రోజు నిర్వహించిన 12వ విడత మొబైల్ రికవరీ మేళాలో భాగంగా రూ.1,20,40,000 విలువైన 602 మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి చేతుల మీదుగా అందజేశారు.
CEIR పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, జిల్లా ఐటీ కోర్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, IMEI ట్రాకింగ్, GPS ఆధారిత ట్రేసింగ్, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ నిఘా, డేటా విశ్లేషణ వంటి పద్ధతులను వినియోగించి ఈ మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుంది.
ఇప్పటివరకు నిర్వహించిన 12 విడతల్లో మొత్తం 4,603 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వాటి మొత్తం విలువ రూ.7,68,67,000గా ఉంది. మొబైల్ రికవరీ విషయంలో రాష్ట్ర స్థాయిలో కాకినాడ జిల్లా విశేష ఫలితాలు సాధిస్తోందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారితో పాటు అడిషనల్ ఎస్పీ (పరిపాలన) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, అడిషనల్ ఎస్పీ (ఏఆర్) శ్రీ ఎస్. శ్రీనివాసరావు, కాకినాడ ఎస్‌డీపీఓ శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐపీఎస్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీ కె.వి.వి. సత్యనారాయణ, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ శ్రీ డి. దుర్గా శేఖర్ రెడ్డి, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎ. సన్నాసిరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీ వి. శ్రీనివాస్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

21 hours ago | [YT] | 5

Kakinada District Police

// కాకినాడ జిల్లా పోలీస్ గ్రౌండ్స్‌లో పునర్నిర్మించిన టెన్నిస్ కోర్టు ప్రారంభం //

కాకినాడ జిల్లా పోలీస్ గ్రౌండ్స్‌లో పునర్నిర్మించిన టెన్నిస్ కోర్టును ఈరోజు జాయింట్ కలెక్టర్ శ్రీ అపూర్వ భరత్, ఐఎఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు మరియు ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ.. క్రీడలు పోలీసు సిబ్బంది శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉత్సాహాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, అడిషనల్ ఎస్పీ (ఏఆర్) శ్రీ ఎస్. శ్రీనివాసరావు, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐపిఎస్, డీఎస్పీ (ఏఆర్) శ్రీ వి.జి. శ్రీహరి రావు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
-జిల్లా పోలీసు కార్యాలయం, కాకినాడ.

1 day ago | [YT] | 7

Kakinada District Police

// పదవీ విరమణ పొందిన ఆరుగురు పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్, ఐపిఎస్ గారు //

అలుపెరుగని జీవన పోరాటంలో పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం శ్రమించి విశిష్ట సేవలు అందించి, నేడు పదవీ విరమణ పొందిన ఆరుగురు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.
ఈరోజు, డిటిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీ కె రవికుమార్, 2 టౌన్ ఎస్సై శ్రీ జి దుర్గాప్రసాద్, కాకినాడ సిసిఎస్ ఎస్సై శ్రీ బి. వెంకటేశ్వర్లు, డిసిఆర్బి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ జి వెంకటేశ్వర రావు, అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ జి సత్యనారాయణ మరియు ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీ సయ్యద్ మస్తాన్ అలీ పదవీ విరమణ పొందారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, ఎస్బీ డీఎస్పీ శ్రీ కె.వి.వి. సత్యనారాయణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీ ఎం. నరసింహమూర్తి, శ్రీ కె. వెంకటరావు, సీసీ శ్రీ ఎస్ రాంబాబు, జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ పి. సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.
- జిల్లా పోలీస్ కార్యాలయం, కాకినాడ

4 days ago | [YT] | 12

Kakinada District Police

// అంతరజిల్లా ఇంటి నేరాల ముఠా అరెస్ట్ //

// 10 కేసులు ఛేదింపు, రూ.57 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసిన కాకినాడ జిల్లా పోలీసులు //


కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ పాటిల్ దేవ్ రాజ్ మనీష్, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో, కాకినాడ రూరల్ సి.ఐ. శ్రీ డి. చైతన్య కృష్ణ, ఇంద్రపాలెం ఎస్‌.ఐ. ఎం. వీరబాబు, క్రైమ్ ఎస్‌.ఐ. బి. వెంకటేశ్వర్లు నేతృత్వంలో పోలీసులు కాకినాడ, తూర్పుగోదావరి, అనకాపల్లి జిల్లాల్లో జరిగిన 10 రాత్రి ఇంటి చోరీ కేసులను ఛేదించి, నలుగురు అంతరజిల్లా నేరస్తులను అరెస్ట్ చేసి, ఒక CCLను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన నిందితులు:
1. ధర్మాడి దుర్గాప్రసాద్ (32) – జగన్నాధపురం, కాకినాడ
2. గొర్రిపూడి వెంకటరమణ (43) – భలభద్రపురం, అనపర్తి మండలం
3. పాసి శేఖర్ (24) – కుతుకులూరు, అనపర్తి మండలం
4. గేదెల మహేష్ (30) – కాకర్లమూడి, తాడేపల్లిగూడెం
మరియు ఒక CCLను దివి. 29.06.2026 వ తేదీ సాయంత్రం 04.00 గంటలకు కాకినాడ రూరల్ తూరంగి శివాలయం వద్ద అదుపులోకి తీసుకోగా, చుక్క ప్రశాంత్ పరారీలో ఉన్నాడు.
కేసు ముఖ్యాంశాలు:
10 ఇంటి చోరీ కేసులు ఛేదింపు.
4 మంది నిందితులు అరెస్ట్, ఒక CCL అదుపులో.
380.7 గ్రాముల బంగారం, 2.854 కిలోల వెండి, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం. మొత్తం రూ.57 లక్షల విలువైన సొత్తు రికవరీ.
నిందితులు రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో విశేష కృషి చేసిన కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ పాటిల్ దేవ్ రాజ్ మనీష్, ఐపీఎస్, కాకినాడ రూరల్ సి.ఐ. కృష్ణ చైతన్య, ఇంద్రపాలెం ఎస్‌.ఐ. ఎం. వీరబాబు, క్రైమ్ ఎస్‌.ఐ. బి. వెంకటేశ్వర్లు మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

4 days ago | [YT] | 6

Kakinada District Police

// ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే అరెస్టులు తప్పవు - కాకినాడ జిల్లా ఎస్పీ //
// ఆటో డ్రైవర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్, ఐపిఎస్., //
కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు సుమారు 300 మంది ఆటో డ్రైవర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, ఆటోల్లో అనుమతించిన పరిమితికి మించి విద్యార్థులు లేదా ప్రయాణికులను ఎక్కించడం చట్టవిరుద్ధమే కాకుండా ప్రాణాంతకమని స్పష్టం చేశారు. గతంలో అధిక సంఖ్యలో విద్యార్థులను ఆటోలో తీసుకెళ్లడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందిన ఘటనను గుర్తుచేస్తూ, అలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించే ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే అరెస్టు కూడా చేస్తామని హెచ్చరించారు.
అదేవిధంగా, విద్యార్థుల తల్లిదండ్రులు తక్కువ ఖర్చు కోసం అధిక సంఖ్యలో పిల్లలను ఒకే ఆటోలో పంపించకుండా, అవసరమైతే అదనపు చార్జీ చెల్లించి అయినా భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే వాహనాల్లోనే తమ పిల్లలను పాఠశాలకు పంపించాలని సూచించారు.
పిల్లల ప్రాణ భద్రత అందరి బాధ్యత అని, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించడం ద్వారా మాత్రమే ప్రమాదాలను నివారించగలమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు, తల్లిదండ్రులు పరస్పర సహకారంతో విద్యార్థుల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ అడిషనల్ ఎస్పి (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ గారు, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐపిఎస్ గారు, ఎస్బి డిఎస్పీ శ్రీ కెవివి సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు శ్రీ ఎన్ రమేష్, శ్రీ డి రామారావు, ఇతర పోలీసు అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

4 days ago | [YT] | 6

Kakinada District Police

// ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల స్వీకరణ – సత్వర పరిష్కారానికి జిల్లా ఎస్పీ శ్రీ జి.బిందు మాధవ్, ఐపీఎస్., గారి ఆదేశాలు //


కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు (సోమవారం) నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ జి.బిందు మాధవ్, ఐపీఎస్ గారు మొత్తం 45 ఫిర్యాదులను స్వీకరించారు .
వాటిలో భూ తగాదాలు 13, కుటుంబ కలహాలు 13 మరియు ఇతర విభాగాలకు చెందినవి 19 గా గుర్తించబడ్డాయి.
ఈ సందర్భంగా ఎస్పీ గారు సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులను ఆదేశిస్తూ, “ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి వాస్తవాలు నిర్ధారించగానే, తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, 7 రోజుల లోపు విచారణ పూర్తిచేసి, తగిన పరిష్కారం చూపాలని, వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను విన్న ఎస్పీ గారు ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని, ప్రజా సమస్యలను న్యాయపరంగా పరిష్కరించడంలో కాకినాడ జిల్లా పోలీసులు పూర్తి నిబద్ధతతో పని చేస్తున్నారని తెలిపారు.

-జిల్లా పోలీస్ కార్యాలయం, కాకినాడ

5 days ago | [YT] | 5

Kakinada District Police

// స్పా / సెలూన్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన కాకినాడ జిల్లా పోలీసులు //


కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, కాకినాడ ఎస్‌డీపీఓ శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐపిఎస్ గారి పర్యవేక్షణలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పా / సెలూన్ కేంద్రాల్లో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. నాగ దుర్గారావు తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా స్పా / సెలూన్ కేంద్రాల నిర్వహణ విధానం, సంబంధిత లైసెన్సులు, ఉద్యోగుల వివరాలు, సందర్శకుల రిజిస్టర్లు, సీసీటీవీ వ్యవస్థతో పాటు ఇతర చట్టబద్ధ నిబంధనల అమలును పరిశీలించారు. అలాగే, స్పా / సెలూన్ కేంద్రాల ముసుగులో ఎలాంటి చట్టవిరుద్ధ లేదా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదని యాజమాన్యాలకు కఠిన హెచ్చరికలు జారీ చేసి, ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా లేదా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పక్షంలో సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు కూడా తమ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు, అలాగే మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే 1972 టోల్-ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.

6 days ago | [YT] | 4

Kakinada District Police

// క్రైమ్ రివ్యూ మీటింగ్ లో నేరాల నియంత్రణపై పలు కీలక సూచనలు చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్., //

కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి అధ్యక్షతన ఈరోజు జిల్లా నేర సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ప్రాపర్టీ నేరాలు, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, పెండింగ్ కేసుల స్థితిగతులను సమగ్రంగా సమీక్షించిన ఎస్పీ గారు.. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిర్దిష్ట కాలపరిమితిలో చార్జ్ షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల కేసుల్లో ప్రత్యేక దృష్టి సారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు 'పల్లె నిద్ర', మహిళా భద్రత కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని సూచించారు. వారెంట్లు, సమన్ల అమలును వేగవంతం చేయడంతో పాటు హిస్టరీ షీటర్లపై కఠిన నిఘా ఉంచాలని, వాహన తనిఖీలు, నైట్ పెట్రోలింగ్, కార్డన్ అండ్ సెర్చ్ ద్వారా అక్రమ కార్యకలాపాలను, డ్రగ్స్-మత్తు పదార్థాల రవాణాను అరికట్టాలని పేర్కొన్నారు. అలాగే సైబర్ నేరాలపై అవగాహన పెంచాలని, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను, వదంతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని స్పష్టం చేసిన ఎస్పీ గారు, ముగింపులో కేసుల పరిష్కారంలో విశేష కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సమావేశానికి అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, కాకినాడ ఏఎస్పీ శ్రీ పాటిల్ దేవ్ రాజ్ మనీష్, ఐపీఎస్, పెద్దాపురం డిఎస్పీ శ్రీ ఎ బి జి తిలక్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, కార్యాలయ సిబ్బంది హాజరయ్యారు.

1 week ago | [YT] | 10

Kakinada District Police

"నషా ముక్త్ భారత్ అభియాన్"లో భాగంగా మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా అధికార యంత్రాంగం


కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు మరియు జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, ఐఏఎస్ గారు, కాకినాడ జిల్లా ఈగల్ విభాగం ఇన్‌స్పెక్టర్ గారు మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన "నషా ముక్త్ భారత్ అభియాన్" కార్యక్రమంలో భాగంగా ఈరోజు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఈగల్ బృందం సభ్యులు, పలు కళాశాలల విద్యార్థులు, వైద్యులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. ర్యాలీ కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం నుండి ప్రారంభమై భానుగుడి సెంటర్ వరకు కొనసాగింది. అనంతరం భానుగుడి సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "డ్రగ్స్ వద్దు బ్రో" వంటి నినాదాలతో విద్యార్థులు నగర ప్రజల్లో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, "నషా ముక్త్ భారత్ అభియాన్" లో భాగంగా ఈగల్ బృందం ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువతను మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా చైతన్యవంతులను చేయడం కోసం ప్రతి పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థులకు జిల్లా పోలీసు సిబ్బంది మరియు ఈగల్ సిబ్బంది ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.
నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని, గంజాయి సహా ఎలాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని సూచించారు. మత్తు పదార్థాలకు బానిసైన వారిని గుర్తించి, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించి, తగిన వైద్య చికిత్సతో పాటు మానసిక సలహాలు అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, ఎవరైనా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు తెలిసినట్లయితే 1972 టోల్ ఫ్రీ నంబరుకు సమాచారం అందించాలని కోరారు. మత్తు పదార్థాలను సరఫరా చేసే వారిపై మాదక ద్రవ్యాలు మరియు మానసిక ప్రభావిత పదార్థాల నిరోధక చట్టం (ఎన్‌డీపీఎస్ చట్టం) కింద చర్యలు తీసుకుంటున్నామని, ఆ చట్టంలో శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయని తెలిపారు. గంజాయికి సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే ఈగల్ 1972 టోల్ ఫ్రీ నంబరుకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
అలాగే విద్యార్థులు తమ ఇళ్ల వద్ద, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని జిల్లా అధికారులు కోరారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, జీవితాన్ని "మత్తు నుంచి మహత్తులోకి" మార్చుకోవాలని జిల్లా ఎస్పీ గారు పిలుపునిచ్చారు. చివరగా ఈగల్ ఇన్స్పెక్టర్ గారు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ అందరితో చేయించారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ అదనపు ఎస్పీ (పరిపాలన) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ ఎస్. శ్రీనివాసరావు, కాకినాడ ఏఎస్పీ శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐపీఎస్, పెద్దాపురం డీఎస్పీ శ్రీ ఎ.బి.జి. తిలక్, డీఎస్పీ (ఏఆర్) శ్రీ వి.జి. శ్రీహరి రావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీమతి ఎం. కృష్ణ కుమారి, ఈగల్ బృందం ఇన్‌స్పెక్టర్ శ్రీ జి. వెంకటేశ్వరరావు తదితర అధికారులు, సిబ్బంది, సుమారు 1300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

1 week ago | [YT] | 8