Hello Friends, This is Our Channel Laxmi Telugu Tech, *Welcome to Laxmi Telugu Tech*. We are uploading content related to Sri Venkateswara Swamy Temple Tirumala, Here i provide various types the Temple news about , mainly Tirumala tirupati Updates.
*ముఖ్యంగా మన ఛానెల్లో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం తిరుమల కు సంబంధించిన ప్రతి సమాచారం అందించబడుతుంది.
* ప్రధానంగా టి.టి.డి తాజా సమాచారం, శ్రీవారి దర్శనం కోసం సలహాలు ౼ సూచనలు, దర్శనం, వసతి, శ్రీవారి సేవా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, అన్నప్రసాదం, అలిపిరి, శ్రీవారి మెట్టు, తిరుమలలో చూడవలసిన ముక్యమైన ప్రదేశాలు, పుష్కరణి, తిరుమలలో తోటలు, ఉచిత బస్సు సౌకర్యాలు, ఘాట్ రోడ్డు, కాలిబాట వివరాలు, తిరుమల టూర్ ప్యాకేజ్లు, TTD నుంచి వచ్చే అన్ని అప్డేట్స్ శ్రీవారి భక్తులకు వీడియో రూపంలో మన ఛానల్ లో అందించబడుతుంది.*
*టి.టి.డి. లేటెస్ట్ సమాచారం కోసం మన చానల్ని subscribe చేసుకోగలరు, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి షేర్ చేయండి.*
🙏ఓం నమోవేంకటేశాయ🙏
Thanks for Watching videos.
visit again and again THANK YOU
--Munilakshmi Volunteer--
Laxmi Telugu Tech
పుణ్యధ్వజారోహణానికి సిద్ధమైన నారాయణవనం
శాస్త్రోక్త అంకురార్పణతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
తిరుపతి, 2026 మే 27: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించి వైభవంగా శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా రాత్రి 7.30 గంటల నుండి 9.30 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల మధ్య ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.
మే 28న ధ్వజారోహణం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మిథున లగ్నంలో ఉదయం 7.30 గంటల నుండి 9.00 గంటల వరకు ధ్వజారోహణ మహోత్సవం ఆగమోక్తంగా జరుగనుంది.
బ్రహ్మోత్సవాల కోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ పరిసరాలను రంగవల్లులతో సుందరంగా అలంకరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది
7 hours ago | [YT] | 45
View 2 replies
Laxmi Telugu Tech
వైభవోపేతంగా శ్రీ గోవిందరాజస్వామివారి గరుడసేవ
గరుడవాహనంపై దివ్యమంగళ రూపంలో భక్తులను కటాక్షించిన గోవిందుడు
గోవింద నామస్మరణలతో మారుమోగిన తిరుపతి మాడవీధులు
తిరుపతి, 2026 మే 27: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన బుధవారం రాత్రి నిర్వహించిన విశేష గరుడవాహనసేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు.
సర్వాభరణ భూషితుడై, దివ్య కాంతులు వెదజల్లుతూ గరుత్మంతునిపై వెలసిన శ్రీ గోవిందుడు భక్తులకు కనువిందు చేశారు. “గోవిందా… గోవిందా…” నామస్మరణలతో తిరుపతి మాడవీధులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయాయి.
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడవాహనసేవకు విశిష్టమైన స్థానం ఉంది. గరుడవాహనంపై దర్శనమిచ్చే స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా వర్ణించారు. గరుత్మంతుని రెక్కలు వేదాల నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని కొనియాడారు.
గరుడుని సేవాభావం, మాతృభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి ఆదర్శప్రాయమని పండితులు పేర్కొన్నారు. జ్ఞానవైరాగ్యాలను కోరుకునే భక్తులు జ్ఞాన, వైరాగ్యరూపమైన రెక్కలతో విహరించే గరుడుని దర్శించి అభీష్టసిద్ధిని పొందుతారని విశ్వసిస్తారు. అందుకే గరుడసేవకు ఎనలేని మహిమ, విశిష్టత ఏర్పడ్డాయి.
భక్తి సంగీతాలతో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత, హరికథ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాలతో తిరుపతి మాడవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
8 గొడుగులు విరాళం
తమిళనాడు రాష్ట్రం తిరువండ్రవూరుకు చెందిన శ్రీ భాష్య కార్ల కైంకర్య ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ దినేష్ కుమార్ 8 గొడుగులను టిటిడి ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరికి అందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, విజివో శ్రీ గిరిధర్, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎవ్వో శ్రీ శ్రీనివాసరావు, అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది
8 hours ago | [YT] | 38
View 0 replies
Laxmi Telugu Tech
👉 t.me/DailyLootOffersHub
👉 shorturl.at/ZpkqE
🙏 అందరికి నమస్కారం 🙏
నేను ప్రతిరోజూ మనం ఉపయోగించే రోజువారీ వస్తువులు, మొబైల్స్ & కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ & కిచెన్, గ్రోసరీస్, ఆభరణాలు, లైటింగ్ ఇంకా మరెన్నో ప్రొడక్ట్స్ Amazon, Flipkart, Myntra, Ajio, and Shopsy లాంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్లో ఆఫర్లో దొరికినప్పుడు, వాటిని మన Daily Loot Offers Hub అనే Telegram మరియు WhatsApp ఛానల్స్లో షేర్ చేస్తుంటాను.
👉 ఇప్పటికే మన ఛానల్స్ని సపోర్ట్ చేస్తున్న మీరందరూ, మా కొత్త Daily Loot Offers Hub Telegram & WhatsApp ఛానల్స్ లో కూడా తప్పక జాయిన్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
➡️ Join అయ్యి ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లు & బెస్ట్ డీల్స్ తెలుసుకోండి.
👉 🔗 Telegram Channel: t.me/DailyLootOffersHub
👉 🔗 WhatsApp Channel: whatsapp.com/channel/0029Vb6uojc4SpkP5bJXdj3w
📌 మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ఏదైనా ప్రొడక్ట్ కొనాలని అనుకుంటే, మా ఛానల్లో ఇచ్చిన లింక్ ద్వారా వెళ్ళి సెర్చ్ చేసి కొనండి.
➡️ దీనివల్ల మీకు అదనంగా ఒక్క రూపాయి ఖర్చు కాదు – మీకు మామూలు ధరే ఉంటుంది.
➡️ కానీ ఆ లింక్ ద్వారా కొనుగోలు చేస్తే నాకు కొద్దిపాటి కమిషన్ వస్తుంది, అది మీ చిన్న సహాయం, నాకు పెద్ద మద్దతు అవుతుంది.
మా ఛానెల్ లింక్ను మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి షేర్ చేయండి.
మీ ఒక్క షేర్ మాకు పెద్ద సపోర్ట్ 💙
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
💖 మీ మద్దతే మా బలం – ధన్యవాదాలు!
👉 🔗 Website: dailylootoffers.com/
11 hours ago | [YT] | 76
View 1 reply
Laxmi Telugu Tech
టీటీడీకి విరాళాలు
తిరుమల, 2026 మే 27: చెన్నైకు చెందిన శ్రీ గోపాల కృష్ణ, శ్రీ పురుషోత్తం అనే భక్తులు బుధవారం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి సుమారు నాలుగున్నర కేజీల బరువు గల వెండి నక్షత్ర హారతులను విరాళంగా అందించారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు నక్షత్ర హారతులను అందజేశారు.
అదేవిధంగా మంగళవారం మైసూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు రూ.1.10కోట్లు విలువైన ఐదు బంగారు పతకాలను విరాళంగా అందించారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
11 hours ago | [YT] | 58
View 1 reply
Laxmi Telugu Tech
శ్రీ గోవిందరాజస్వామి వారికి శ్రీవారి అమూల్య నగల కానుక
గరుడసేవ రోజున అన్నగారికి శ్రీనివాసుడి భక్తి సమర్పణ
రూ.71 లక్షల విలువైన దివ్యాభరణాలు గోవిందుడికి కానుక
తిరుపతి, 2026 మే 27: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించనున్న గరుడసేవ మహోత్సవం అపూర్వ ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకోనుంది. ఈ పవిత్ర సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి తరఫున తన అన్నగారైన శ్రీ గోవిందరాజస్వామివారికి సుమారు రూ.71 లక్షల విలువైన నాలుగు దివ్య ఆభరణాలను టిటిడి భక్తి పూర్వకంగా సమర్పించింది.
ఈ దివ్య కానుకల్లో సాధారణ రాళ్లు కలిగిన బంగారు గుండు పతకం, ఒక జత సాధారణ రాళ్లు గల బంగారు పతకాలు, బంగారు కాసుల మాల ఉన్నాయి. ఈ అమూల్య ఆభరణాలతో అలంకరింపబడిన శ్రీ గోవిందరాజస్వామివారు గరుడవాహనంపై భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
స్థానిక శ్రీ ఎదురు ఆంజనేయస్వామి ఆలయం నుండి శ్రీవారి ఆభరణాలను తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ ఎం.లోకనాథం ఆధ్వర్యంలో మంగళవాయిద్యాలు, వేదఘోషలు, గోవింద నామస్మరణల మధ్య ఘనంగా ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు.
అంతకుముందు తిరుమల నుండి అలిపిరి, కోమలమ్మ సత్రం మీదుగా బంగారు నగలు ఊరేగింపుగా శ్రీ ఎదురు ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకువచ్చారు. ప్రత్యేక పూజలు అనంతరం శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకువచ్చి ఆలయ అధికారులకు అప్పగించారు.
ఇదే సందర్భంగా స్వామివారికి నూతన వస్త్రాలు, తిరువడిని కూడా శోభాయాత్రగా ఆలయానికి తీసుకువచ్చారు. ఏనుగులు, గుర్రాలు, రంగురంగుల నృత్య బృందాలు, కోలాట కళాకారుల ప్రదర్శనలు గరుడసేవ వైభవాన్ని మరింత ఇనుమడింపజేశాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, విజివో శ్రీ గిరిధర్, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, తిరుమల ఆలయ బొక్కసం సూపరింటెండెంట్ శ్రీ వి.ఆర్.గురురాజస్వామి, ఏవీఎవ్వోలు శ్రీ శ్రీనివాసరావు, శ్రీ రాజశేఖర్, శ్రీ ఎం.ఎస్.కృష్ణన్, అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది
11 hours ago | [YT] | 33
View 0 replies
Laxmi Telugu Tech
మోహినీ రూపంలో మురిపించిన శ్రీ గోవిందరాజస్వామి
సమ్మోహన అవతారంలో భక్తులకు అభయప్రదానం చేసిన గోవిందుడు
తిరుపతి, 2026 మే 27: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన బుధవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు పల్లకిపై మోహినీ అవతారంలో విహరించి భక్తులను కటాక్షించారు. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం భక్తి పారవశ్యంతో సాగింది. గోవింద నామస్మరణలతో మారుమోగిన మాడవీధుల్లో భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్నారు.
అమృతాన్ని ప్రసాదించిన మోహినీ అవతారం
సురులను రక్షించి ధర్మాన్ని స్థాపించిన శ్రీహరి
మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో అత్యంత రమణీయంగా వర్ణించబడింది. అమృతం కోసం సురాసురులు క్షీరసాగర మథనం చేయగా, అమృత విభజనలో కలహం చెలరేగింది. అప్పుడు శ్రీమహావిష్ణువు మోహినీ రూపంలో అవతరించి అసురులను సమ్మోహితులను చేసి దేవతలకు అమృతాన్ని అందించాడు.
ధర్మరక్షణ కోసం దివ్య మాయారూపంలో అవతరించిన శ్రీహరి, ఈ మోహినీ అవతారంతో భక్తులకు లోకక్షేమ సందేశాన్ని అందించారు.
స్నపన తిరుమంజనంలో ఆధ్యాత్మిక వైభవం
ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేసి విశేష పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎస్వో శ్రీ ఆర్. శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయరావు, శ్రీ రంజిత్, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది
11 hours ago | [YT] | 61
View 1 reply
Laxmi Telugu Tech
🙏 Om Namo Venkatesaya 🙏
26-05-2026
Total pilgrims - 89,403
Tonsures : 44,234
Hundi kanukalu : 4.0 CR
Laddu sale… 4.14 Lac
Annaprasadams… 2.55 Lac
Medical treatment… 3,631
Waiting Compartments….Outside line at Silathoranam.
Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).. 24 H
(SSD)Time slot Sarvadarshan... 4 to 6 H
Rs 300 Special Darshan Approx. Time... 3 to 5 H
Tq.
------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది, అంటే అది SSDటోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 15 గంటలు అని.
ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 18 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.
----
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g
t.me/LaxmiTeluguTech
youtube.com/@TtdLatestUpdates
21 hours ago | [YT] | 239
View 5 replies
Laxmi Telugu Tech
సర్వలోకాల పాలకుడై భక్తులను కటాక్షించిన శ్రీ గోవిందుడు
సర్వభూపాల వాహనంపై దివ్య దర్శనమిచ్చిన గోవిందరాజస్వామి
తిరుపతి, 2026 మే 26: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారు సర్వభూపాల వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహనసేవ భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది. గోవింద నామస్మరణలతో మారుమోగిన మాడవీధుల్లో భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్నారు.
ధర్మపాలనకు దివ్య సందేశమిచ్చే సర్వభూపాల వాహనం
భగవద్భక్తితో పాలిస్తే ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతారనే బోధ
“సర్వభూపాల” అంటే సమస్త రాజులు, దిక్పాలకులు అని అర్థం. సర్వలోకాల అధిపతిగా శ్రీహరి అందరి హృదయాల్లో కొలువై ఉంటాడని ఈ వాహనసేవ సూచిస్తుంది. స్వామివారిని తమ భుజస్కంధాలపై మోసే దిక్పాలకులు భగవత్సేవలో నిమగ్నమై ప్రజలను ధర్మబద్ధంగా పాలిస్తారని ఈ వాహనసేవ ద్వారా ఆధ్యాత్మిక సందేశం అందుతుంది.
భక్తి సంగీతాలతో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత, హరికథ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాలతో తిరుపతి మాడవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
మే 27న మోహినీ అవతారోత్సవం – రాత్రికి గరుడసేవ
బుధవారం ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం (మోహినీ అవతారోత్సవం) వైభవంగా జరుగనుంది. అనంతరం రాత్రి గరుడవాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారు విహరించి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎస్వో శ్రీ ఆర్. శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయరావు, శ్రీ రంజిత్, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది
1 day ago | [YT] | 121
View 3 replies
Laxmi Telugu Tech
మే 27న నారాయణవనం ఆలయ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
మే 28 నుండి జూన్ 05 వరకు శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు
శ్రీ పద్మావతి–శ్రీనివాసుల పవిత్ర కల్యాణానికి నిలువెత్తు సాక్ష్యం నారాయణవనం
కళ్యాణ కటాక్షంతో భక్తుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శ్రీనివాసుడు
కుటుంబ సౌఖ్యం ప్రసాదించే శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి
2500 ఏళ్ల తిరగలిలో సజీవంగా నిలిచిన దివ్య కళ్యాణ ఘట్టం
తిరుపతి, 2026 మే 26: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మే 28 నుండి జూన్ 05వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో మే 27వ తేదీ రాత్రి 07.30 గం.లకు అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా స్వామి వారిని ఉదయం 06 గం.లకు సుప్రభాతంతో మేల్కొలిపి పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆలయ ప్రాముఖ్యత
శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి దివ్య దర్శనం దంపతుల జీవితాల్లో సుఖశాంతులు, పరస్పర అవగాహన, కుటుంబ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల అచంచల విశ్వాసం. వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులు, కొత్తగా వివాహమైన దంపతులు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారు స్వామివారి కళ్యాణ కటాక్షం కోసం ఈ క్షేత్రాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు.
“శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి”గా ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం భక్తుల హృదయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. దాంపత్య జీవితంలో ఆనందం, అనురాగం, ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం భక్తులు స్వామివారిని ప్రార్థిస్తుంటారు. శ్రీనివాసుని కళ్యాణ మహిమ జీవితాలను మంగళమయం చేస్తుందనే విశ్వాసంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు నారాయణవనానికి తరలివచ్చి స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుతున్నారు.
స్థల పురాణం :
పురాణ ప్రాశస్త్యం ప్రకారం ఆకాశరాజు పరిపాలించిన రాజధానిగా నారాయణవనం వెలుగొందింది. ఇదే పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారితో దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకున్నాడని స్థల పురాణం వివరిస్తోంది. ఆ దివ్య వివాహ ఘట్టానికి చిరస్మరణగా పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయాన్ని నిర్మించారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం కల్యాణ మహిమను ప్రసరించే పవిత్ర దివ్యక్షేత్రంగా యుగయుగాలుగా భక్తుల ఆరాధనలను అందుకుంటోంది.
గర్భాలయం :
దాదాపు 5.5 ఎకరాల విస్తీర్ణంలో రెండు ప్రాకారాలతో విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. తొలి ప్రాకారంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారు దివ్య మంగళవిగ్రహంతో భక్తులకు దర్శనమిస్తుండగా, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ ఆండాళ్ అమ్మవారు, ఉప సన్నిధులు ఆలయ మహిమను మరింత పెంపొందిస్తున్నాయి.
గోపురాలు :
ఆలయంలోకి ప్రవేశించగానే భక్తులకు దివ్య దర్శనమిచ్చే ఏడు అంతస్తుల మహోన్నత రాజగోపురం విజయనగర శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తోంది. సుమారు 150 అడుగుల ఎత్తుతో ఆకాశాన్ని తాకేలా నిర్మితమైన ఈ ప్రధాన గోపురాన్ని విజయనగర సామ్రాజ్య మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. మూడు అంతస్తులతో కళాత్మకంగా నిర్మించిన మధ్య గోపురాన్ని శ్రీ వీర నరసింహదేవరాయలు నిర్మించగా, దాని శిల్పసౌందర్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పుష్పవాటికలతో అలరారే రెండవ ప్రాకారమైన తోట ప్రాకారం ఆధ్యాత్మిక ప్రశాంతతను పంచుతూ భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తోంది.
మండపాలు :
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలోని మహా మండపం, ముఖ మండపం, అంతరాలయ మండపం, గర్భాలయ మండపం, వాహన మండపం, పదహారు కాళ్ల మండపం అద్భుత శిల్పకళా వైభవంతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రతి స్తంభం, ప్రతి శిల్పం వైష్ణవ భక్తి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ, ఈ మండపాలలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడూ అపూర్వమైన ఆధ్యాత్మిక ప్రశాంతతను, దివ్యానుభూతిని ఆస్వాదిస్తారు.
ఉప ఆలయాలు :
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వెలసిన ఉపాలయాలు ఈ క్షేత్ర ఆధ్యాత్మిక మహిమను మరింత పెంపొందిస్తున్నాయి. శ్రీ పరాశరేశ్వరస్వామి, శ్రీ భక్తాంజనేయస్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి, శ్రీ శక్తి వినాయకస్వామి, శ్రీ అగస్తీశ్వరస్వామి, శ్రీ అవనాక్షి అమ్మవారి ఆలయాలు భక్తులకు దివ్య దర్శనమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదిస్తున్నాయి. అలాగే భక్తులు ఆధ్యాత్మిక ప్రశాంతతను ఆస్వాదించేలా దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లుతున్న పద్మ సరోవరం ఈ క్షేత్రానికి మరింత సౌందర్యాన్ని చేకూరుస్తోంది.
2500 సంవత్సరాల నాటి తిరగలి :
ఈ దివ్యక్షేత్ర ఆధ్యాత్మిక వైభవానికి చిరస్మరణీయ సాక్ష్యంగా నిలిచింది సుమారు 2500 సంవత్సరాల నాటి పవిత్ర తిరగలి. శ్రీ పద్మావతి అమ్మవారు – శ్రీనివాసుల దివ్య కళ్యాణ మహోత్సవంలో నలుగు పిండి తయారీకి ఉపయోగించిన ఈ తిరగలి నేటికీ భక్తుల్లో అపారమైన భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలిగిస్తోంది.
దర్శనం – సేవలు :
భక్తుల ఆధ్యాత్మిక ఆనందాన్ని పరిపుష్టం చేసే విధంగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతిరోజూ వివిధ ఆర్జిత సేవలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే నిత్యకైంకర్యాలలో తోమాల సేవ, అర్చన భక్తులను భక్తి పరవశ్యంలో ముంచెత్తుతాయి. రాత్రి 8 గంటలకు నిర్వహించే ఏకాంతసేవలో స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పిస్తారు. ప్రతి శుక్రవారం పవిత్ర అభిషేకం, మంగళవారం అష్టదళ పాద్మారాధన సేవలు విశేష భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతూ భక్తులకు దివ్యానుభూతిని ప్రసాదిస్తున్నాయి.
ఉత్సవాలు :
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నిత్య, వార, పక్ష, మాస, సంవత్సరోత్సవాలను టిటిడి అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తోంది. వైకుంఠ ద్వాదశి, శ్రీ పద్మావతి అమ్మవారి పంగుణి ఉత్తర ఉత్సవం, రథసప్తమి, బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, తెప్పోత్సవాలు భక్తి వైభవాన్ని ప్రతిబింబిస్తూ అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయం విద్యుద్దీపాలతో, పుష్పాలంకరణలతో దివ్యంగా అలంకరించబడుతూ భక్తులకు కనులపండువగా నిలుస్తుంది.
ప్రసాదాలు :
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారికి సమర్పించే నైవేద్య ప్రసాదాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తాయి. ప్రతిరోజూ పొంగలి, పులిహోర, పెరుగన్నం, దోసె వంటి ప్రసాదాలతో పాటు కళ్యాణోత్సవ సందర్భంలో ప్రత్యేకంగా చక్కెర పొంగలిని భక్తులకు అందజేస్తారు. ప్రత్యేక పర్వదినాల్లో సీరా, మిర్యాల పొంగలి, సుగీలు, వడలు, వడపప్పు, పానకం, అప్పం, లడ్డూ వంటి సంప్రదాయ ప్రసాదాలు స్వామివారి కృపాప్రసాదాలుగా భక్తులకు పంపిణీ చేస్తారు.
1967లో టిటిడిలో విలీనం :
నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యంతో అనాదిగా భక్తుల మన్ననలను అందుకుంటోంది. పూర్వం ఈ దేవాలయం మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో ఉండేది. అనంతరం తమిళనాడు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కైంకర్యాలు కొనసాగగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ దేవాదాయ శాఖ నిర్వహణలో పూజా కార్యక్రమాలు జరిగాయి.
తదుపరి 1967 ఏప్రిల్ 29న ఈ పవిత్ర ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం కావడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. టిటిడి ఆధ్వర్యంలోకి వచ్చిన తరువాత ఆలయ వైభవం మరింత విస్తరించి, నిత్యకైంకర్యాలు, వార్షిక ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడుతున్నాయి. టిటిడి ప్రత్యేక శ్రద్ధతో ఆలయ ఆధ్యాత్మిక మహిమ భక్తులకు మరింత చేరువైంది.
భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు :
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునే భక్తులకు దాతల సహకారంతో ప్రతిరోజూ మధ్యాహ్నం రుచికరమైన ఉచిత అన్నప్రసాదాలను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేస్తున్నారు. “అన్నదానం మహాదానం” అనే సనాతన ధర్మ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఈ సేవ భక్తుల హృదయాల్లో విశేష ఆనందాన్ని నింపుతోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
1 day ago | [YT] | 124
View 5 replies
Laxmi Telugu Tech
కల్పవృక్ష వాహనంపై కోనేటిరాయుడి దివ్య దర్శనం
వాంఛిత ఫలాల ప్రసాదకుడై భక్తులను కటాక్షించిన శ్రీ గోవిందరాజస్వామి
తిరుపతి, 2026 మే 26: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుండి వైభవంగా సాగిన వాహనసేవలో గజరాజులు ముందుండగా, మంగళవాయిద్యాలు, కోలాటాలు, గోవింద నామస్మరణల నడుమ మాడవీధులు ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడాయి. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహం పొందారు.
ప్రకృతికి ప్రాణాధారమైన వృక్షాలలో కల్పవృక్షం అత్యున్నతమైనదిగా పురాణాలు వర్ణిస్తాయి. సముద్ర మథనంలో ఆవిర్భవించిన ఈ దేవతా వృక్షం భక్తుల వాంఛిత ఫలాలను ప్రసాదించేదిగా ప్రసిద్ధి చెందింది. అలాంటి కల్పవృక్షాన్ని అధిరోహించిన కోనేటిరాయుడు భక్తుల కోరికలను తీర్చే దేవదేవుడిగా దర్శనమిచ్చి భక్తజనులను పరవశింపజేశారు.
స్నపన తిరుమంజనంలో భక్తి పరవశం
ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకం చేసి వేదమంత్రోచ్చారణల నడుమ విశేష పూజలు నిర్వహించారు.
సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్సేవ నిర్వహించనున్నారు.
సర్వభూపాల వాహనంపై రాత్రి దివ్య దర్శనం
ధర్మపాలనకు దివ్య సందేశమిచ్చే గోవిందుడు
రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. “రాజా ప్రజారంజనాత్” అన్న సూక్తికి అనుగుణంగా ప్రజలను రక్షించి ధర్మాన్ని స్థాపించేవారే నిజమైన పాలకులని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు సందేశమిస్తారు. కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సర్వలోకాల అధిపతిగా సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారని ఆగమశాస్త్రాలు పేర్కొంటాయి.
మే 27న వైభవంగా గరుడసేవ
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా జరిగే గరుడసేవ బుధవారం రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించనున్నారు. గరుడవాహనంపై స్వామివారి దివ్య దర్శనాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎస్వో శ్రీ ఆర్. శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయరావు, శ్రీ రంజిత్, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
1 day ago | [YT] | 171
View 1 reply
Load more