P TV(PEOPLES CHOURASTA)

ప్రజల ధిక్కార నినాదం-PTV(పీపుల్స్ చౌరస్తా)


P TV(PEOPLES CHOURASTA)

తమిళనాడు లో విజయ్ నేతృత్వంలో TVK పార్టీ అత్యధిక సీట్లు సాధించి విజయం సాధించడానికి కారణం ఏమై ఉంటుంది?.

మీ అభిప్రాయం తెలపండి?
‪@Peopleschowrasta‬
#tamilanaduelection
#Tvk
#Tvkvijay
#tamilanadu

1 month ago | [YT] | 0

P TV(PEOPLES CHOURASTA)

రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి -AISF
వెంటనే విద్యార్థులు సమస్యలను పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడి ఎఐఎస్ఎఫ్ హెచ్చరిక
ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడం సిగ్గు చేటు!


విద్యార్థుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడం సిగ్గు చేటు అని ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించడంతో పాటు విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) ఆధ్వరంలో శుక్రవారం హైదరాబాద్, బషీర్ బాగ్, దేశోద్ధారక భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.‪@Peopleschowrasta‬#viral#trending#

2 months ago (edited) | [YT] | 2

P TV(PEOPLES CHOURASTA)

తెలంగాణ లో ఉన్నత విద్యకోసం ఎంట్రన్స్ టెస్ట్ ల అప్లికేషన్ కోసం తేదీ మరియు పరీక్ష తేదీలు‪@Peopleschowrasta‬

2 months ago | [YT] | 1

P TV(PEOPLES CHOURASTA)

*తెలంగాణ ప్రజా ఫ్రంట్(TPF)*
*పెద్దపల్లి జిల్లా కమిటీ అధ్వర్యంలో
ఘనంగా సావిత్రిబాయి పూలే గారి 129 వ వర్థంతి!

*మహిళల చదువుతోనే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి*

మహిళలు చదువుకుంటేనే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి రాష్ట్ర కార్యదర్శి గాండ్ల మల్లేశం, జిల్లా అధ్యక్షులు గుమ్మడి కొమురయ్య అన్నారు.
సావిత్రి బాయి పూలే 129 వ వర్ధంతి సందర్భంగా స్థానిక పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ,ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆమె ఫోటోకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల, బాలికల చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని వారి కోసం ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు స్థాపించారని అన్నారు. స్త్రీ, బాలికల విద్య కోసం బ్రాహ్మణీయ భావజాలం, పితృస్వామ్యనికి, వ్యతిరేకంగా, వితంతు పునర్ వివాహలకోసం పోరాడిన యోధురాలని కొనియాడారు. భర్త జ్యోతిబా పూలే అడుగుజాడల్లో సతీ సహాగమనం, బాల్య వివాహాలు, అంటరానితనం, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిందని అన్నారు. మహారాష్ట్ర లో ప్లేగు వ్యాధి ప్రభలిన సందర్బంలో రోగులకు సేవలు చేస్తున్న క్రమంలో ఆ వ్యాధి సోకి సావిత్రి బాయి పూలే మృతి చెందిందని, ఆమె మృతి పీడిత వర్గాల మహిళలకు,ప్రజలకు తీరని లోటని ఆమె సిద్దాంతా అడుగుజాడల్లో నడవడమే ఆమెకు మనమిచ్ఛే ఘన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి గాండ్ల మల్లేశం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుమ్మడి కొమురయ్య,జిల్లా కమిటీ నాయకులు కె. రాజు,బీసీ సంఘాల JAC జిల్లా, JNTUH రాష్ట్ర నాయకులు ఆకుల వివేక్ బీసీ JAC రాష్ట్ర కన్వీనర్ కోమటిపల్లి రాజేందర్ ,బిసి సమితి జిల్లా నాయకులు కీర్తి రాజయ్య, గాండ్ల రాజేశం,అమర్ తదితరులు పాల్గొన్నారు ‪@Peopleschowrasta‬ #viral#trending#news

2 months ago | [YT] | 0

P TV(PEOPLES CHOURASTA)

రైతు భరోసా నిధులను వెంటనే రైతులకు చెల్లించాలి – అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.
సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ తొర్రూరు డివిజన్ నాయకులు తండా సురేష్.

తొర్రూరు 10/3/2026. డివిజన్ కేంద్రంలో డెమోక్రసీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం బంగారి శీను వాసు. అధ్యక్షతన
సిపిఐ (ఎంఎల్) తొర్రూరు న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు తండా సురేష్. పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించాల్సిన రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతాంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో రైతు భరోసా వంటి పథకాలను ఆలస్యం చేయడం రైతులను మరింత కష్టాల్లోకి నెట్టేస్తోందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయల బాకీ తెచ్చి, ఆ నిధులను రైతులకు చెల్లించకుండా ఇతర అవసరాలకు మళ్లించడం తీవ్రంగా ఖండనీయమని ఆయన పేర్కొన్నారు. రైతుల కోసం తీసుకొచ్చిన నిధులను రైతులకు ఇవ్వకుండా వేరే కార్యక్రమాలకు వినియోగించడం రైతాంగాన్ని మోసం చేయడమేనని అని విమర్శించారు.
ప్రస్తుతం రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, డీజిల్ ధరల పెరుగుదలతో భారీ ఖర్చులు భరిస్తున్నారని తెలిపారు. కానీ రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు అప్పుల బారిన పడుతున్నారని చెప్పారు. రైతులు పండించే ధాన్యం, పత్తి, మక్కజొన్న, మిర్చి తదితర పంటలకు ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కేవలం కొన్ని పంటలకు మాత్రమే మద్దతు ధర ప్రకటించడం సరిపోదని, రైతులు పండించే అన్ని రకాల పంటలకు బోనస్‌తో కూడిన గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్న సమయంలో రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు స్పష్టమైన వ్యవసాయ విధానాలను అమలు చేయాలని అన్నారు.
అందువల్ల ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతులకు చెల్లించాలని, రైతు భరోసా పేరుతో తీసుకొచ్చిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం నిలిపివేయాలని, అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలను పరిష్కరించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బంగారి శీను వాసు, యాకయ్య, సుగుణ, విమలమ్మ తదితరులు పాల్గొన్నారు‪@Peopleschowrasta‬ #trending#viral#trend

2 months ago | [YT] | 0

P TV(PEOPLES CHOURASTA)

*చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జీవితం స్ఫూర్తి దాయకం.*

*అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట స్ఫూర్తి సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే విప్లవ కృషి.*

సావిత్రి భాయి పూలే వర్ధంతి సందర్భంగా రంగవల్లి విజ్ఞాన కేంద్రంలో మహిళల సామాజిక , రాజకీయ , ఆర్ధిక సమానత్వంకై సదస్సు.

నిజానికి, మహిళా దినోత్సవం అంటే ఒక చారిత్రక పోరాట పథం.
శ్రామిక మహిళలు 8గంటల పనిదినం కోసం క్లారా జెట్కిన్, తదితర మహిళా పోరాటకారుల ఆధ్వర్యంలో చికాగో, తదితర యూరోపియన్ సమాజంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించి సాధించుకున్న దీర్ఘకాలిక పోరాట ఫలితం.

అందుకే మార్చి 8వ తేదీని 'అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం' అంటారు.

బానిసత్వం నుంచి అర్థ బానిసత్వం లోకి, అర్థ బానిత్వం నుంచి ఏవో కొన్ని ఉపశమన హక్కులు, వివక్షత,అటువంటి అసమానత్వాన్ని ప్రతిపాదించే అమానవీయ సంబంధాల్లోంచి సమానత్వంలోకి, అక్కడి నుంచి పూర్తి స్వేచ్ఛలోకి పురోగమించే క్రమమంతా ఒక పోరాట క్రమమే.

ఆధిపత్యం వివిధ రూపాల్లో మహిళలపై కొనసాగుతున్న వివిధ దశలలో తామెక్కడున్ళది, మహిళలు ఎవరికి వారు ఆయా దశల్లో తాము అనుభవిస్తున్న హింసను గుర్తించడం, దాన్నుంచి బయట పడటం కోసం నిరంతరం పోరాటాన్ని కొనసాగించడమే ఏకైక మార్గం.

యూరప్ దేశాలలో మహిళలను శతాబ్దాలుగా 16 గంటలు వెట్టిచాకిరి చేయించే దాష్టికం నుంచి క్రమంగా, 12 గంటల పని విధానం, అక్కడ నుండి 10 గంటల పని దినం చాలా కాలం కొనసాగింది. అయితే 10 గంటల పని దినాన్ని సాధించిన చైతన్య దీప్తి 8 గంటల పని దినాన్ని సాధించేదాకా విశ్రమించ లేదు. ఇవాళ మనం అనుభవిస్తున్న 8 గంటల పని దినం శ్రామిక మహిళల భిక్షే.

కార్మిక లోకానికి సుదీర్ఘ పని గంటల నుండి 8 గంటల పని దినాన్ని ప్రసాదించిన 'విముక్తి ప్రదాతలు' శ్రామిక మహిళామణులే.

అందువల్ల మార్చి 8, అంతర్జాతీయంగా మహిళలందరికి, ఆ మాట కొస్తే, పురుషులకు సైతం సుదీర్ఘ పనిగంటల నుంచి ఉపశమనాన్ని కల్పించిన పోరాటానికి ప్రతీక.

ఈ దేశంలో అవిశ్రాంత శ్రామికులు మన మహిళామతల్లులే.
సమాజపు కుల చట్రంలో, కుటుంబ సంసారపు చట్రంలో వాళ్ళు అట్టడుగుకి నెట్టేయబడ్డ వాళ్లు.
వాళ్లను మనుషులుగా కాక జీతం చెల్లించనవసరం లేని పని వాళ్లుగా, మనువు ప్రవచించిన మత నియమాలు,,కుల కట్టుబాట్ల వలన 'కట్టుబానిసత్వం మా జన్మహక్కు' అని మానసికంగా తమను తాము నమ్మించుకునేంతగా మహిళలు అలవాటు పడిపోయారు.

అట్లా ఆకాశంలో సకల అవకాశాల్లో సగం అందుకోవాల్సిన మహిళలు, మత మౌఢ్యం కులోన్మాదం, పితృస్వామిక, పురుషాధిపత్య తదితర భావజాలాలన్నింటి పట్ల హేతుబద్ధ వైఖరి అవలంబించలేని సాంప్రదాయ సంకెళ్లలో చిక్కుకు పోయి, అణిచివేత యంత్రాంగానికి పనిముట్లు అవడం, ఒక కాదన లేని వాస్తవం.

శతాబ్దాలుగా వాళ్లు, వాళ్ల వలె కాక పిల్లలకు తల్లులుగా, భర్తలకు భార్యలుగా, తల్లిదండ్రులకు బిడ్డలుగా తలమునకలై పోవడం తప్ప, తమకంటు ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిర్మించుకోలేని స్థితి.

విచిత్రంగా, సాంప్రదాయక సంకెళ్లలో మగ్గుతూ, అణిచివేతకు గురవుతూ కూడా, ఆడ బ్రతుకుకు అదే జీవన సాఫల్యంగా తలవడం జరుగుతోంది.

ఆర్థిక స్వావలంబనతో మహిళా సాధికారత సాధించ వచ్చన్నది కూడా కొంత వరకు నిజమే కాని, రకరకాల అహేతుక భావ దాస్యాలను వదులుకోవడం ద్వారా మాత్రమే నిజమైన మహిళా సాధికారత సాధ్యమని చెప్పక తప్పదు.
- రాజేశ్వరి రంగవల్లి విజ్ఞాన కేంద్రం సభ్యురాలు.

బడుగు బలహీన వర్గాలతో పాటు సమాజంలోని అట్టడగు వర్గాల మహిళల అభ్యున్నతి కోసం చదువు అవసరాన్ని గుర్తించి విద్య వ్యాప్తి కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని రాజేశ్వరి అన్నారు. మంగళవారం రంగవల్లి విజ్ఞాన కేంద్రంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభిలాష్ పీడీఎస్యూ విజృంభణ నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే అందించిన సేవలను కొనియాడారు. ప్రధానంగా మహిళల చదువు కోసం ప్రత్యేకంగా పాఠశాలను స్థాపించి ఉపాధ్యాయురాలిగా విద్య వ్యాప్తి కోసం సావిత్రిబాయి పూలే అందించిన సేవలను సావిత్రిబాయి పూలే జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, ట్రస్ట్ సభ్యులు చెన్నమనేని పురుషోత్తం రావు,
పోకల సాయికుమార్ లాయర్,
సీనియర్ జర్నలిస్ట్ అల్లే రమేష్,
రంగు ఆంజనేయులు గౌడ్,
చెట్కూరి ఆంజనేయులు గౌడ్,
స్వప్న, జ్యోతి, సరిత, లచ్చవ్వ, పిడిఎస్యూ విజృంభణ నాయకులు బుట్టం అరవింద్ పటేల్ , రామ్ సాయి, తదితరులు పాల్గొన్నారు.‪@Peopleschowrasta‬ #trending#viral

2 months ago | [YT] | 0

P TV(PEOPLES CHOURASTA)

సిపిఐ(ఎం-ఎల్)జనశక్తి పార్టీ ఇటుకులపాడు గ్రామ సీనియర్ నాయకులు,అమరుడు కామ్రేడ్: నల్ల సోమయ్య 30 వ,వర్ధంతిని పురస్కరించుకుని తన జ్ఞాపకార్థం జనశక్తి పార్టీ నిర్మించిన స్మారక స్థూపం వద్ద అమరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో తన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.‪@Peopleschowrasta‬ #Viral#trending

2 months ago | [YT] | 2

P TV(PEOPLES CHOURASTA)

'కొత్తదారి వెతుకులాటలో ఉన్నాం'.. మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న కీలక ప్రకటన

దిశ, వరంగల్ బ్యూరో: 'మేము చావుకు భయపడే వాళ్లం కాదు.. చావుకు భయపడి లొంగిపోయామని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు.. ఇకనుంచి చట్టం పరిధిలో పనిచేయాలని నిర్ణయించుకున్న తర్వాతనే లొంగిపోయాం' అని మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న తెలిపారు.

హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం బట్టుపల్లిలో మాజీ మావోయిస్టులు, అమరుల కుటుంబాలను ఆయన సోమవారం కలిశారు. సమాజంలో మార్పులు జరిగాయని ఆ మార్పులకు అనుగుణంగానే తాము బయటకు వచ్చామని స్పష్టం చేశారు. త్యాగాలు, నిర్బంధాల మధ్య పనిచేశామని అందరినీ కలుపుకొని సంఘటితంగా ముందుకు వెళ్తామన్నారు. అమరుల త్యాగాలు వృథా కానివ్వమన్నారు. తాము బయటకు రావాలని సమాజంలో మార్పులకు అనుగుణంగా పోరాడాలని కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలో చెప్పే నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్నీ ఆలోచించి బయటకు వచ్చామన్నారు. ఉన్నవారిని కాపాడుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తాము బయటకు రావడంపై కొన్ని వర్గాలు ఇష్టం వచ్చిన రీతిలో ఆరోపణలు చేశారని అన్నారు. సోషల్ మీడియాలో తమకు నచ్చిన విధంగా పోస్టులు పెట్టారని అన్నారు.

కొత్తదారి వెతుకులాటలో ఉన్నాం..

తాము అజ్ఞాతంలో ఆదివాసీల మధ్య మూడున్నర దశాబ్దాల పాటు పనిచేశామని అన్నారు. తాము తొందరపడే వ్యక్తులం కాదని.. అన్నింటినీ పాజిటివ్‌గా తీసుకుని ముందుకు పోతామని పేర్కొన్నారు. అందరినీ కలిసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం మాకు ఏ రాజకీయ పార్టీలో చేరాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సమాజంలో ఇంకా సమస్యలు ఉన్నాయని.. మెరుగ్గా వాటిని పరిష్కరించవలిసి ఉందన్నారు. ఓ కుల సంఘానికో, ఓ వర్గానికో పరిమితం కాకుండా అందరినీ కలుపుకొని పోతామన్నారు. లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ గట్టిగా ఉన్న సమయంలోనే నిర్ణయం తీసుకుని ఉండి ఉంటే బాగుండేదన్నారు. ఇంతమంది అమరులయ్యేవారు కాదన్నారు. పదేళ్ల క్రితం పార్టీ బలంగా ఉండటంతో పాటు ప్రభుత్వాలతో చర్చించే అవకాశం ఉండేదన్నారు. పదేళ్లలో బలహీన పడటం వల్ల చివరి నిర్ణయంగా బయటకు వచ్చామన్నారు.

పనివిధానం అనుగుణంగానే అవకాశాలు..

విప్లవంలో కులం ప్రధానంగా ఉండదని అన్ని వర్గాలకు సమప్రాధాన్యత ఉందన్నారు. పనివిధానం అనుగుణంగానే అవకాశాలు ఉంటాయన్నారు. తాము 30 ఏళ్లపాటు దండకారణ్యంలో ఆదివాసీల కోసం పనిచేశామన్నారు. నిర్బంధ స్థితిలో ప్రశ్నించే హక్కు నిలబెట్టుకోవడం కోసం పనిచేశామన్నారు. తాము ఎక్కడికి పారిపోమని విదేశాలకు వెళ్లడం లేదని ఇక్కడే ఉంటామని ప్రజల మధ్యనే కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు. కావాలని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ గడ్డ ఉద్యమాలకు ఊపిరినిచ్చిందన్నారు. ప్రస్తుతతం ఒకమార్పు క్రమంలో ఉన్నామన్నారు. ప్రతికూలత నుంచి కొత్తదారి వెతుకులాటలో ఉన్నామన్నారు. యువకులు ప్రేరణగా నిలవడంతో పాటు ధైర్యంగా పనిచేస్తున్నారని అన్నారు. అన్నింటిని పరిగణలోకి తీసుకొని పనిచేస్తామన్నారు.

బట్టుపల్లి గ్రామంతో విడదీయని అనుబంధం..

బట్టుపల్లి గ్రామంతో తనకు విడదీయని అనుబంధం ఉందన్నారు. ఇక్కడి నుంచే తాను ఉద్యమంలోకి అడుగు పెట్టానని అన్నారు. తన ప్రయాణానికి ఇక్కడి గ్రామ వాసులే అండగా ఉన్నారని అన్నారు. ఇక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి దండకారణ్యం వరకు తనకున్న పరిధిలో ప్రజల కోసం, ఆదివాసీల కోసం పనిచేశామన్నారు. అప్పుడున్న సమస్యలు ఇప్పుడు లేకున్నా కొత్త సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఆశన్న వెంట పవనానందరెడ్డి అలియాస్ శ్యామ్ దాదా, యాదగిరి అలియాస్ రాజ్మన్, పద్మ, వనిత, వెంకటేశ్, చంప, సంతోష్, అర్జున్, వికాస్ తో పాటు పలువురు ఉన్నారు.‪@Peopleschowrasta‬ #viral#trending

2 months ago | [YT] | 0

P TV(PEOPLES CHOURASTA)

పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
ఖాళీ గ్యాస్ సిలిండర్లతో pow ఆధ్వర్యంలో నిరసన

కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం సామాన్యులపై ధరలబారాన్ని మరోవైపు పన్నులపారాన్ని మోపి జేబులు కొల్లగొడుతుందని ప్రగతిశీల మహిళా సంఘం (pow) జిల్లా కార్యదర్శి కంచర్ల నర్సక్క అన్నారు

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని తుమ్మల పెన్పాడులో ఖాళీ సిలిండర్ తో పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహ వినియోగ ఎల్ పి జి సిలిండర్లపై రూ 60 కమర్షియల్ సిలిండర్ లపై రూ 115 పెంచడం పేదల జీవితాలపై ఆర్థిక దాడి చేయడమేనని అన్నారు యుద్ధాల పేరుతో నిత్యవసర ధరలు పెంచుకుంటూ పోతే పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితి కుందేలు అవుతుందని మండిపడ్డారు సామ్రాజ్యవాద పెట్టుబడి దేశాలు ప్రపంచ మార్కెట్ విస్తరణ కోసం ఆయిల్ నిక్షేపాలు ఖనిజ సహజ వనరుల దోపిడీ కోసం చిన్న దేశాలపై అత్యుత క్రూరంగా వైమానిక దాడులు చేస్తూ ప్రపంచశాంతికి విఘాతం చేస్తుంటే భారత ప్రధాని యుద్దాల నివాళులు నోరు విప్పకపోవడం అసమర్థతకు నిదర్శనం అన్నారు సామ్రాజ్యవాద దేశాల మధ్య యుద్ధాల ప్రభావం ఆర్థిక వ్యవస్థను విద్వాస్తం చేస్తుందని పకృతి సహజ వనరులను కోల్పోతామని ఆమె అన్నారు బిజెపి అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో ఇప్పటికే అనేకసార్లు గ్యాస్ ఆయిల్ ధరలు పెంచిందని మండిపడ్డారు మళ్లీ వినియోగదారులపై అధికంగా గ్యాస్ ధరలు పెంచుతున్నారని అన్నారు దేశ ప్రజలపై అధిక బారాలను మోపాలనే మోడీ ప్రభుత్వ ఆలోచనను వెనక్కి తీసుకొని పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి అని అన్నారు
దేశభక్తి అంటే ప్రజల ఆస్తులను లూటీ చేయడం కాదని ప్రజల ఆర్థిక అభివృద్ధిని సాధించడం అని ఎద్దేవ చేశారు
ఈ కార్యక్రమంలో కొరివి మంగమ్మ పులిగుజ్జు లక్ష్మి నల్లగొండ రమ్య భద్రమ్మ వెంకటమ్మ మంగమ్మ రోశమ్మ తదితరులు పాల్గొన్నారు.‪@Peopleschowrasta‬ #viral#trending

2 months ago | [YT] | 3

P TV(PEOPLES CHOURASTA)

సమ సమాజ స్వాప్నికుడు
ముక్తవరం పార్థసారథికి జోహార్లు

తెలుగు సాహిత్య లోకానికి, మరీ ముఖ్యంగా ప్రగతిశీల సాహిత్య లోకానికి ముక్తవరం పార్థసారథి సుపరిచితులు. ఆయన ఈ నెల నాలుగో తేదీన హైదరాబాద్ లో తన 82 ఏళ్ల ప్రాయంలో తుది శ్వాస విడిచారు. ఆయన పూర్వ నల్గొండ జిల్లా భువనగిరిలో 1944 జూలై 7న జన్మించారు. 82 ఏళ్ల జీవితంలో 70కి పైగా పుస్తకాలను మనకు అందించి వెళ్లారు. బోలెడు సాహిత్యాన్ని ప్రజా ప్రయోజన దృష్టితో శోధించారు, జల్లెడ పట్టారు. జీవించిన కాలమంతా మార్క్సిస్ట్ తాత్విక దృక్పథంతో సాహిత్య సృజన చేశారు. తెలుగు సమాజంలో ఉన్న అభ్యుదయ, ప్రగతిశీల, విప్లవ శిబిరాలన్నిటితో ఆయన స్నేహ సంబంధాలను కొనసాగించారు. విస్తృతంగా చదివారు, విస్తారంగా రాశారు. పెద్ద చిన్నా తేడా లేకుండా అనేక తెలుగు సాహిత్య పత్రికలకు ఎన్నో విలువైన కథలు, నవలలు, వ్యాసాలు, అనువాద సాహిత్యాన్ని అందించారు. ఆయన తన తొలి కథను 15వ ఏట రాశారు. అప్పటినుంచి తను చనిపోయేదాకా అంటే దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఆయన సాహిత్య కృషి ఒక ధారగా కొనసాగింది. ఆయన స్వయంగా 10 నవలలు రాశారు. తన కథల్ని "మిణుగుర్లు" పేరిట సంకలనంగా తీసుకు వచ్చారు. వివిధ దేశాల ప్రగతిశీల రచయితలు, సాహితీవేత్తల పరిచయాలు ఎనిమిది పుస్తకాలుగా వచ్చాయి. అత్యంత విలువైన అనువాద సాహిత్యాన్ని 50 కి పైగా పుస్తకాలుగా తెలుగు ప్రజలకు అందించారు. ఆయన అనువాదాల్లో చెహోవ్ కథలు, ఉక్కుపాదం నవల, ప్రేమ - పెట్టుబడి పేరిట వచ్చిన మార్క్స్- జెన్నీల జీవిత కథ ప్రముఖంగా ఉన్నాయి. అనేక ప్రపంచ ప్రఖ్యాత కథలు, సాహిత్య వ్యాసాలు, సైద్ధాంతిక రచనలు ఆయన అనువాద సాహిత్యంలో భాగం. ఎంత సాహిత్య అధ్యయనం చేశారో అంతగానూ రాశారు. అంతకు మించి తన పరిచయంలోకి వచ్చిన అనేక మందితో తాను చదివినవి, తన ఆలోచనలు పంచుకున్నారు. సాహిత్య పత్రికల్లో, ఇతరత్రా వచ్చిన రచనలు చదివి ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు పంచుకున్నారు, చర్చించారు. కొత్త రచయితలను ప్రోత్సహించారు.

విరసం మాస పత్రిక అరుణతారకు అనేక విలువైన సైద్ధాంతిక, తాత్విక రచనలు చేశారు. అరుణతారలో సీరియల్ గా వచ్చిన వ్యాసాలు తరవాత “మార్క్స్ పెట్టుబడి రచనా క్రమం”, “ఫాసిజం “ , “తత్వశాస్త్రం అంటే ఏమిటి “ పుస్తకాలు విరసం ప్రచురణలుగా వచ్చాయి. విరసం ఆవిర్భావ రోజుల నుంచీ ఆయనకు విప్లవ సాహిత్యోద్యమంతో గాఢమైన అనుబంధం ఉంది. విరసం అన్నా , అరుణతార పత్రిక అన్నా గౌరవం. మొత్తంగా ఆ గౌరవం ప్రజా ఉద్యమాలకు , ప్రజలకు చెందుతుంది. మార్క్స్, ఎంగెల్స్ నుంచి మావో దాకా మార్కిస్ట్ మహోపాధ్యాయులు చెప్పినవి ప్రజలకు సులభంగా అర్థం చేయించాలని తాపత్రయ పడేవారు. అరుణతార సామాన్యులకు చేరేలా మరింత ఆసక్తిదాయకంగా రూపొందించాలని, ఆ దిశగా ఆలోచించాలని సూచించే వారు. ఒక స్థాయి ఉండే పాఠకులకు మాత్రమే కాకుండా ఎక్కువ మంది సామాన్య ప్రజలు అరుణతార ఆదరించేలా ఏమి చేయాలో ఆలోచించమని చెప్పే వారు.. హాస్యం, వ్యంగ్యం, కొన్ని బొమ్మలు, కార్టూన్లు వంటి శీర్షికలు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడేవారు. మార్క్స్ రచన అంతా వ్యంగ్య శైలి అని, ఆ వ్యంగ్యాన్ని పాఠకులకు అందించాలని అనేవారు. తన విశ్లేషణకు, సామాజిక అధ్యయనానికి మార్క్స్ ఫ్రెంచ్ రచయిత బాల్జాక్ ను కూడా చదివాడు. తాను జీవించిన సంధి కాల సమాజ చలనాన్ని బాల్జాక్ తన రచనల్లో నిక్షిప్తం చేశారు. అది మార్క్స్ కు ఉపయోగపడింది. మత, రాజకీయ, సామాజిక అభిప్రాయాలలో బాల్జాక్ రియాక్షనరీ.. కానీ సమకాలీన జీవితాన్ని వివరించడంలో , విశ్లేషించడంలో, చికిత్స చేయడంలో బాల్జాక్ వైద్యుడులాంటి వాడని అంటారు ముక్తవరం. రచయితలు సమాజ చలనాన్ని పట్టుకుని, విశ్లేషించే నేర్పును సాధించాలని అనే వారు. అలా సాహిత్య ప్రయోజన దృష్టితో బాల్జాక్ ను తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. ఇంకా ఏమి చెప్పొచ్చు, ఏమి చేయొచ్చు అని చివరి దాకా ఆలోచనలు చేశారు. రచనా వ్యాసంగంలో క్రియాశీలంగా ఉన్నారు. ఇటీవల సమాజంలో పట్టింపుతో, సీరియస్ గా చదవడం తగ్గిందని బాధపడేవారు. అలా అని నిరుత్సాహ పడలేదు. తాను చదివినవి, చదవాల్సినవి చివరిదాకా అందరితో పంచుకుంటూనే ఉన్నారు. వచ్చి పడిన పనులు, తాను చేయాలనుకున్న పనులు చేస్తూనే ఉన్నారు. అధ్యయనం, రచన శ్వాసగా జీవించారు. తాను ఎలా జీవించాలని భావించారో అలాగే అర్థవంతంగా జీవించారు. పేరు కోసం , గుర్తింపు కోసం, అవార్డులు, రివార్డులు, సన్మానాలకు దూరంగా తాను అనుకున్న , నలుగురికి అవసరమనుకున్న పనిని శ్రద్ధగా, ఒక బాధ్యతగా చేసారు.

ప్రజా ఉద్యమాలను గమనిస్తూ వాటి కష్ట, నష్టాలకు, మనుషుల త్యాగాలకు చలించిపోయారు. విరసం వ్యవస్థాపక నాయకులు వరవరరావు, చెరబండరాజు సహా నేటి విరసం కార్యకర్తలతోను ఆయనకు స్నేహ సంబంధాలు ఉన్నాయి. వి వి అన్నా, చెరబండ రాజు అన్నా గొప్ప ప్రేమ, గౌరవం.. భీమాకోరేగావ్ కేసులో బందీ లు అయిన వి వి సహా మిగతా వారి కోసం, సాయిబాబా కోసం, ఇంకా అలాంటి వారి అందరికోసం చాలా బాధపడేవారు. భవిష్యత్తు పై ఆశావాహ దృష్టిని, ఉత్సాహాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. వ్యక్తులుగా చేసే కృషి మంచిదే గాని, సమిష్టి లక్ష్యాలకు కట్టుబడడం , ఆచరణ కొనసాగించడం సరైనదని, విలువైనదని అభిప్రాయపడే వారు. విరసం కు ఉన్న విలువైన సాహితీ మిత్రులలో ముక్తవరం ఒకరు. చనిపోయాక తన కళ్ళు అవసరమయినవారికి ఇచ్చేలా, శరీరం వైద్య విద్యార్థుల అధ్యయన నిమిత్తం దానమిచ్చారు.. కళ్ళు ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు, శరీరాన్ని డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ వారు తీసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. పార్థసారథి గారు భౌతికంగా మన మధ్య లేకున్నా , ఆయన సృజించిన సాహిత్యం ప్రజలకు నిరంతరం ప్రేరణను, వెలుగును పంచుతూనే ఉంటుంది.

-అరసవిల్లి కృష్ణ, అధ్యక్షుడు
-రివేరా, కార్యదర్శి

- విప్లవ రచయితల సంఘం
‪@Peopleschowrasta‬

2 months ago | [YT] | 1