Hamsa Lekhha Films

Legacy , Luxury & Living life with dignity , rare honesty , integrity , culture & standards.. proud being a sanathani🇮🇳🇳🇵

#travel #pilgrimagetours #pilgrimagetrips #roadtrips #templehistories #temples #templedarshan #trips #traveltrips #thetraveldairies #travelvlogs #traveller #historicaltemples #temples #ancienttemples #history #historicaltemples

This channel is exclusively designed for travelling in TELUGU
Do you Live to Travel, or Travel to Live?
Hi i'm hamsa ! I am a foodie&a travel freak . i started this channel with the main theme to provide you all with the needful information of a particular place like how to travel , accomdation details, vicinity of major places , their culture & about their foods etc


Hamsa Lekhha Films

శ్వాస - పంచప్రాణాలు..............!!
శ్వాస రూపంలో మనం తీసుకున్న వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి
1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.

1.ప్రాణము:- అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.
2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్య మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.
3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు. ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.
4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.
5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.

శ్వాస - చక్రాలు..........
ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై
➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు
➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు
➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు
➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు
➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు
➡️ ఆజ్ఞా చక్రము నందు - 1000 సార్లు
➡️ సహస్రారము నందు - 1000 సార్లు
అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.

శ్వాస - అంగుళాలు........
సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు. శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.
➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.
➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.
➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే - బ్రహ్మానందం కలుగుతుంది.
➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.
➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.
➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.
➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.
➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే - అదృశ్యం అవ్వగలరు.
మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు. అలాంటి వారు అమరులు అవుతారు.

శ్వాస - సృష్టి వయస్సు.........
మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన
➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.
➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.
➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.
➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.
➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) - 43,20,000 సంవత్సరాలు.

శ్వాస - సాధన.........
సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.
మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు. దీనిని చిన్న పిల్లల(5 సం"ల)నుండి ముసలివారి దాకా ఎవరైనా చేయవచ్చును.
84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.

1 month ago | [YT] | 2

Hamsa Lekhha Films

Yesterday we are blessed to meet HH Sri Sri Yadugiri Yathiraja Jeeyar Swami of the Sri Yadugiri Yathiraja Mutt. Sri Yadugiri Yathiraja Mutt is the only Mutt established by 11th century saint reformer Sri Ramanuja himself about 1000 years ago, when he stayed at Melkote, Mandya District in Karnataka for 12 years.
Today is Ramanuja Jayanthi (22 April 2026)
Truly blessed again today to have had the opportunity to meet His Holiness Yadugiri Yathiraja Jeeyar Swami of the Sri Yadugiri Yathiraja Mutt. A moment of grace and spiritual inspiration.

1 month ago | [YT] | 8

Hamsa Lekhha Films

A black day

1 month ago (edited) | [YT] | 0

Hamsa Lekhha Films

సర్వ పాపాలను హరించే చక్రతీర్థం..............!!
అలకా పట్టణ ప్రభువైన కుబేరుడు ఒకసారి కైలాసానికి ఉత్తరం వైపున వైష్ణవ యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి విష్ణుమూర్తి వచ్చాడు. ఆయనతోపాటు సూర్యుడు, చంద్రుడు, దిక్పాలకులు, గంధర్వులు విచ్చేశారు.
ఆ యజ్ఞంలో కుబేరుని కొడుకు నలకూబరుడు ధనాగారానికి పాలకుడిగా, వీరభద్రుడు రక్షకుడుగా, గణపతి సేవా కార్యక్రమమునకు గాను వియోగింపబడ్డారు. ధర్మతత్పరుడైన కార్తికేయుడు సదస్యులకు మర్యాదచేయసాగాడు. కుబేరుని మంత్రులు ఘంటానాథుడు, పార్శ్వవౌళి- శాస్తక్రారులకు పెద్దలుగా దానాధ్యక్షులుగా వ్యవహరింపసాగారు.

మహావైభవంగా యజ్ఞం ముగిసింది.
యజ్ఞానంతరం కుబేరుడు దేవతలకు, వేద పండితులకు దానధర్మాలు చేశాడు. శుభావహంగా యజ్ఞ కార్యక్రమం పరిసమాప్తి అవుతున్న దశలో మహర్షి దుర్వాసుడు అక్కడకు వచ్చాడు. ఆయన శరీరం కృశించి ఉంది. ముఖం కోపంతో తీక్షణంగా ఉంది. కుబేరుడు భయభక్తులతో ఆయనను పూజించి, ‘‘మహాత్మా! మీ రాకతో నా జీవనం, ఈ యజ్ఞం పావనమయ్యాయి’’ అన్నాడు వినయంగా.

అందుకు దుర్వాసుడు సంతోషించి ‘‘ఓ రాజాధిరాజా! నీవు ధర్మాత్ముడవు. నీ దాతృత్వం బ్రాహ్మణ భక్తి నిరుపమానం! శ్రీ మహావిష్ణువును మెప్పించే విధంగా యజ్ఞం నిర్వహించావు. నీవు మంచి దాతవని విన్నాను. మీ ఇంటనున్న నవ నిధులు నాకు కావాలి. అవి ఇస్తే నీకు శుభం కలుగుతుంది. లేకుంటే నిన్ను శపిస్తాను!’’ అన్నాడు నిర్మొహమాటంగా. దానశీలుడైన కుబేరుడు మారుమాట్లాడకుండా అందుకు అంగీకరించాడు.

కానీ ఆ సమయంలో దానాధ్యక్షులుగా ఉన్న ఘంటానాథుడు, పార్శ్వవౌళిలిద్దరూ లోభగుణ మోహితులై కుబేరునితో, ‘‘ఈ మహర్షి ఒంటరివాడు. నవ నిధులనూ తీసికొని వెళ్ళి ఏంచేసుకుంటాడు? పోనీ ఒక లక్షకాసులు ఇచ్చి మిగిలిన ధనం మీరు ఉంచుకోవడం మంచిది’’ అన్నారు. వీరి మాటలు విని దుర్వాసుడు ఆగ్రహావేశాలతో కళ్ళెర్ర చేశాడు. కుబేరుడు భయపడుతూ వినయభావంతో ఆయనచెంత నిలబడ్డాడు.

దుర్వాసుడు ఆ మంత్రులవైపు తీక్షణంగా చూస్తూ ‘‘ఓ ఘంటానాథా! నీవు దుష్టబుద్ధివి. లోభుడవు. నువ్వొక మొసలిగా మారిపో... ఓరీ పార్శ్వవౌళీ! మత్త్భేమువలె మదించి యజమానికి దుష్టబోధ చేశావు గనక నీవు ఏనుగువై జీవించు’’అని శపించాడు. పిమ్మట ఆ మహర్షి కుబేరుని చూచి ‘‘ఓ రాజ రాజా! నీ దాతృత్వానికి ప్రసన్నుడనయ్యాను. నీవుచేసిన ఈ దానంవల్ల నీ నవ నిధులు రెండింతలు అగుగాక!’’అని పలికి నిష్క్రమించాడు.

మహర్షి శాపంవల్ల దీనులై దుఃఖిస్తున్న మంత్రులను చూసి కుబేరుడు రక్షించమని అక్కడే ఉన్న శ్రీమహావిష్ణువును శరణువేడాడు. అప్పుడు మహావిష్ణువు ‘‘ఆయన శాపాన్ని పరిహరించే శక్తి నాకులేదు. మీరిద్దరూ మకర, మద గజాలుగా మారక తప్పదు. కొంతకాలం తరువాత మీ ఇద్దరికీ భీకరమైన పోరు జరుగుతుంది. ఆ సమయంలో నా అనుగ్రహంవల్ల మీకు మీమీ రూ పాలు కలుగుతాయి! అన్నాడు. మహావిష్ణువు ఇలా పలికిన కొంత సేపటికి ఆ మంత్రులిద్దరూ మొసలిగా, ఏనుగుగా మారిపోయారు. ఘంటానాధుడు గోమ తీ నదిలోనూ, పార్శ్వావౌళి రైవతగిరి ప్రాంతంలోనూ జీవింపసాగారు...

ఒక పర్యాయం గజరాజుగా జీవిస్తున్న పార్శ్వవౌళి తన బృందంతో సమీపంలోవున్న గోమతీనదికి వచ్చి స్నానం చేయసాగాడు. ఏనుగుల బృం దమంతా నదిలోకి క్రీడిస్తూ ఒకదానిపై ఒకటి తొండాలతో నీళ్ళు జల్లుకోసాగాయి. అవలా జలకాలాటలో ఉండగా ఒక మొసలి కోపంతో వచ్చి గజరాజు కాలుపట్టుకొని లోపలకు లాగసాగింది.

గజేంద్రుడు ఆ మొసలిని బయటకులాగడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆమె తన పట్టువిడువలేదు. ఆ గజేంద్రుణ్ణి విడిపించడానికి మిగిలిన ఏనుగుల వశం. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు వాటి పోరు కొనసాగింది. క్రమంగా నీరసించిపోతున్న గజరాజుకి అప్పుడు పూర్వజన్మ స్ఫురణ కలిగింది. అది భక్తిపూర్వకంగా శ్రీమహావిష్ణువును, ‘‘ఓ పరమపావనా! పరమేశ్వరా! నన్ను ఈ మొసలి బయటినుంచి రక్షించు... రక్షించు!’’అని ప్రార్థించసాగింది.

దీనవత్సలుడైన భగవానుడు గజేంద్రుని మొర విని గరుత్మంతుని అధిరోహించి వేగంగావస్తూ- ఇంకా ఆత్రంగా గరుత్మంతుని కూడా వదిలిపెట్టి మరింత వేగంగా ముందుకువచ్చి తన చక్రాన్ని విసిరివేశాడు.
ఆ విష్ణుచక్రం వచ్చి తగిలీ తగలకముందే ఆశ్చర్యకరంగా ఆ మొసలి తన శరీరంనుంచి వేరయిపోయింది. అప్పు డా చక్రం వృథాపోకుండా ఆ గోమతీ నదిలోని రాయి చక్ర చిహ్నితముల నొనర్చింది. మహావిష్ణువు చక్రం ప్రవర్తిల్లిన స్థలంకాబట్టి అది చక్రతీర్థం అయింది. పరమాత్ముని అనుగ్రహంవల్ల మకర గజేంద్రులు ఆ రూపాలను వదలి తమ పూర్వ రూపాలను పొందాయి.
కుబేరుని మంత్రులైన ఘంటానాథుడు, పార్శ్వవౌలిలు శ్రీమహావిష్ణువుకు నమస్కరించి ఆ స్వామిని స్తుతించి తమ నివాసాలకు వెళ్ళిపోయారు. ఆనాటినుంచి గోమతీనది విష్ణుచక్ర ప్రభావంతో చక్రతీర్థంగా పేరుపొందింది. ఈ చక్రతీర్థగాథను విన్నవారికి చక్రతీర్థంలో స్నానం చేసిన ఫలం లభిస్తుందని సర్వపాపాలు హరించబడతాయని అంటారు.

1 month ago | [YT] | 1

Hamsa Lekhha Films

#శివపురాణం_లింగావిర్భావం

🕉️ లింగావిర్భావ మహాత్మ్యం – జ్యోతి స్తంభంగా అవతరించిన పరమేశ్వర తత్త్వం

🔥 శివపురాణం లింగావిర్భావం – అహంకారాన్ని కరిగించిన అనంత జ్యోతి కథ

🙏 ఎన్ని రూపాలు… ఒక్క తత్త్వం – లింగావిర్భావ అద్భుత గాథ

శివపురాణం: లింగావిర్భావం – శివతత్త్వ రహస్యం
లింగావిర్భావ కథ – శివుడి అనంత స్వరూపం

ఒకనాడు లింగావిర్భావకాలమునందు ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి ‘నేను అధికుడను అంటే నేను అధికుడను’ అని వాదోపవాదం జరిగింది.

వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్రస్థాయిని పొందుతుంటే దేవతల మొరవిన్న పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభంగా వారిమధ్య ఆవిర్భవించాడు.

దాని ఆది కనుక్కోవడానికి శ్రీమహావిష్ణువు వరాహరూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు.

బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని చివర కనుక్కుందుకు వెళ్ళారు. బ్రహ్మగారు వెళుతూ ఉండగా కేతకీ పుష్పం(మొగలి పువ్వు) ఒకటి క్రింద పడింది.

దానిని నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు?” అని అడిగారు. అపుడు మొగలిపువ్వు ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో నన్ను శంకరుడి మీద వేశాడు. అక్కడి నుంచి నేను క్రింద పడ్డాను. మీరు ఎక్కడికి వెడుతున్నారు?” అని అడిగింది.

అపుడు బ్రహ్మగారు నాకొక ఉపకారం చేస్తావా?’ అని అడిగాడు. ఏమిటి కావాలి మీకు?” అని అడిగింది మొగలిపువ్వు. ఆయన “క్రింద శ్రీమన్నారాయణుడు ఉంటారు. నేను ఆ పైభాగమును చూశానని సాక్ష్యం చెప్తావా? అని అడిగాడు. చెప్తాను అన్నది మొగలి పువ్వు. బ్రహ్మగారు మొగలిపువ్వుతో కలిసి క్రిందకు వచ్చారు.

శ్రీమహావిష్ణువును ఆయన చూసి వచ్చారా? అని అడిగారు. అపుడు విష్ణువు నాకు కనపడలేదు. ఎంతదూరం వెళ్ళినా నేను కనుగొనలేకపోయాను అన్నారు.

అపుడు బ్రహ్మ గారు నేను చూసి వచ్చాను. సాక్ష్యం ఈ కేతకీ పుష్పం అన్నారు. ఇప్పుడు జ్యోతి స్తంభంగా ఉన్న పరమాత్మ సాకారమును పొంది బ్రహ్మగారితో బ్రహ్మా నీకు దర్శనం అయిందని అబద్ధం ఆడావు.

కాబట్టి నీకు భూమియందు పూజ లేకుండుగాక! కానీ బ్రహ్మ స్థానమని ఒక స్థానం ఉంటుంది.
ఆ స్థానమునందు ఆవాహన పొంది నీవు గౌరవింపబడుతుంటావు.

మహావిష్ణువు నేను చూడలేదు అని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకు వైభవోపేతంగా పూజలు ఉంటాయి.

ఆ ఉత్సవములకు నీవు ఆధిపత్యం వహిస్తూ ఉంటావు. అందుకే బ్రహ్మోత్సవం అని బ్రహ్మగారి రథం ఉత్సవములకు ముందు నడుస్తుంది.

కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ పుష్పం నా పూజయందు వినిమయం అవకుండుగాక! ఇప్పుడు కేతకీ పుష్పం నాకు పూజార్హత లేదా అని బాధపడింది. నాకు పూజింపబడవు కానీ నా భక్తులయిన వారు నిన్ను తలలో ధరిస్తారు.

వారు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను. పూజ జరిగే ప్రాంగణం మొగలి పువ్వులతో అలంకారం చేస్తే ప్రీతి పొందుతాను. అని చెప్పాడు.

అలా ఏర్పడిన శివలింగం జ్యోతి స్తంభంగా ఏర్పడినదే మహాశివరాత్రి. ఇది మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటిచే చూడదగినటువంటి లింగాకృతిని పొందిన రూపమే అరుణాచలంలో ఉన్న కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమయిన రోజే మహాశివరాత్రి.

కాబట్టి భగవత్ స్వరూపములు అన్నీ సమానములే. ఎన్ని దీపములు వెలుగుతున్నా వెలుగుతున్నది ఒక్క జ్యోతి రూపమే. ఇన్ని రూపములుగా ఉన్నది ఒక్కటే అని మీరు తెలుసుకోవాలనే జ్యోతిర్లింగం ఆవిర్భవించింది.

శివలింగమునకు ఒక విశేషం ఉంది. మొట్టమొదట అన్నిటికన్నా గొప్పదయినా లింగమును స్వయంభూ లింగము అని పిలుస్తారు. ఆ లింగమును ఒకరు ప్రతిష్ఠ చేయరు. తనంత తాను వెలుస్తుంది. శ్రీశైలాది క్షేత్రములు ఇందుకు ఉదాహరణ. రెండవది దివ్య లింగములు ఇవి దేవతలు ప్రతిష్ఠ చేసినవి.

కుమారస్వామి ప్రతిష్ట చేసిన సామర్లకోటలోని కుమారారామం ఇందుకు ఉదాహరణ. మూడవది మానుష లింగములు. ఇవి మనుష్యులు ప్రతిష్ఠ చేసినవి. తరువాత ఆర్ష లింగములు. ఇవి మహర్షులు ప్రతిష్ఠ చేసినవి. రాక్షస లింగములు. రాక్షసులు ప్రతిష్ఠ చేసినవి.

దైవిక లింగములు వాటంతట అవి ఏర్పడతాయి. అరకువేలీలోని బుర్రా గుహలలో పైనుండి నీటి బిందువులు క్రిందపడతాయి. కొండ ఉపరితలం ఎక్కడో పైన ఉంటుంది. పైనుండి నీటి బిందువు ఒకేచోట బయలుదేరి క్రింద ఒకేచోట పడుతుంది.

ఆ నీటి బిందువు పడినప్పుడల్లా క్రింద ఉన్న భూమి కొద్దికొద్దిగా పైకి లేస్తూ శివలింగంగా మారిపోతుంది.

ఇది క్రమక్రమంగా పెరిగి చివరకు ఎక్కడి నుండి నీరు పడుతోందో ఆ ప్రదేశమును తాకి ఇంక నీరు పడకుండా ఆపేస్తుంది. అలా అది మర్రిచెట్టు ఊడలా పెరిగిపోతుంది. దీనిని దైవిక లింగం అంటారు. బాణ లింగములు అని ఉంటాయి. అవి నర్మదానది ప్రవాహము ఒరిపిడి చేత ఏర్పడతాయి.

లింగము అరూపరూపి. ఉపాసనలో లింగోపాసన ఒక మెట్టు పైన ఉంటుంది. మీకు శివలింగమును చూపించి ఆ శివలింగం ఎటువైపు చూస్తోంది అని అడిగినట్లయితే దానికి సమాధానం చెప్పడం తేలికయిన విషయం కాదు.

యథార్థమునకు మీరు శివాలయంలోపల కూర్చుని శివలింగమునాకు అభిషేకం చేయడం కన్నా రుద్రాధ్యాయంతో అర్చక స్వాములు అభిషేకం చేస్తుండగా బయట కూర్చుని కైమోడ్చి నమస్కరిస్తే దానివలన మీరు ఎక్కువ ప్రయోజనమును పొందుతారు. ఇది సాక్షాత్తు చంద్రశేఖరపరమాచార్య స్వామివారు చెప్పినమాట.

శివలింగంలో తూర్పుకు చూస్తున్న దానిని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుకు అధిష్ఠానంగా ఉంటుంది. దీనివలన అజ్ఞానం కలుగుతుంది.

దక్షిణమునకు చూసే ముఖమును అఘోర ముఖము అంటారు. ఇది అగ్నిహోత్రమును శాస్తిస్తుంది. అది అగ్నిహోత్రంగా ఉంటుంది లయం చేస్తుంది.
ఇది మీ అజ్ఞానమును దహించేస్తూ జ్ఞానమును కూడా ఇస్తుంది.

పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది. దీనిని సద్యోజాత ముఖం అంటారు.
పశ్చిమ ముఖం నుండి పాలు, నీళ్ళు విభూతి, పళ్ళరసములు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా మీకు పరమేశ్వరుని అనుగ్రహం కలిగేస్తూ ఉంటుంది.

అది భూసంబంధంగా ఉంటుంది. అది సృష్టికి కారణం అవుతుంది.

అందుకే లోకంలో పిల్లలు పుట్టలేదని అంటే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. దుష్ట నక్షత్రంలో పిల్లాడు పుట్టాడు అని చెప్తే సుందరకాండ పారాయణ/శివాభిషేకం చేసుకోమని చెప్తారు.

అపమృత్యువు వస్తుందేమోనని భయంగా ఉంది అంటే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. పీడకలలు వస్తున్నాయని చెప్తే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు.

ఈ రెండు క్రియలె చెప్తారు. ఎందుచేత? హనుమ శివాంశ. వర్షములు పడకపోతే శివలింగామునకు అభిషేకం చెయ్యండని చెప్తారు.

అభిషేకం చేస్తే వామదేవ ముఖం కానీ తడిసినట్లయితే పరమేశ్వర అనుగ్రహం వలన వర్షములు పడతాయి. పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది. దానిని ఈశానముఖం అంటారు.

దీనిని సదాశివ అని పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపియై ఉంటుంది. ఇదే మోక్షమును కటాక్షిస్తుంది. ఈ అయిదు ముఖములతో పంచభూతములను శాసిస్తోంది.

సృష్టి స్థితి లయ అజ్ఞాన మోక్షములకు కారకం అవుతుంది. సమస్త ఫలితములను ఇస్తుంది. కాబట్టి శివలింగం చల్లబడడం ఊరంతా చల్లగా ఉండడమే.

అసలు లింగమునకు బాహ్యమునందు ఏమీ లేదు. బ్రహ్మాండములన్నీ లింగాకృతిలోనే ఉన్నాయి.

లింగమునకు పూజ చేస్తే సమస్త లోకములకు పూజ జరిగినట్లే. శివాలయమునకు వెళ్ళినపుడు ముఖ్యంగా ఎనిమిది కనపడతాయి. మనం ఒక అపచార ధోరణి చేస్తూ ఉంటాము.

శివాలయం గోడకు ఆనుకోవడం, స్తంభాలను ఆనుకోవడం చేస్తుంటాము. ఆ గోడలు, స్తంభములు అన్నీ ఈశ్వర స్వరూపమే అయి ఉంటాయి.

దేవాలయ గోడను కొట్టినట్లయితే శాస్త్రం ప్రకారం శివుడిని కొట్టినట్లుగానే పరిగణింపబడుతుంది. శివాలయం నందు ఎనిమిది రూపములలో లింగం ఉంటుంది.

అందుకే పూర్వం పెళ్ళిళ్ళు గాని, జరిగితే ధ్వజస్తంభం ఎక్కడివరకు కనపడుతోందో అక్కడ మేళతాళములు ఆపుచేసేవారు. గోపురంగా శివుడే ఉంటాడు. రెండవది శివుడు గర్భాలయ శిఖరంగా ఉంటాడు.

ధ్వజస్తంభం శివుడు. ఇప్పటికీ కొన్ని దేవాలయములలో బలి పీఠమునకు, ధ్వజ స్తంభానికి అభిషేకం చేస్తారు.

లోపల ఉన్న శివలింగమును మహాలింగం అని పిలుస్తారు. పెద్ద పెద్ద దేవాలయములలో కొన్ని మహాలింగముల మీద చారికలు ఉంటాయి.

ఆ గీతలను బ్రహ్మసూత్రములు అని పిలుస్తారు. అవి సాధారణంగా స్వయంభూ లింగముల మీద ఉంటాయి.

శివాలయంలో ఉన్న ప్రధాన లింగమును ‘మూల లింగము లేక మహాలింగము’ అని పిలుస్తారు.

చందీశ్వరుడు ఒక లింగము. ఇవి కాకుండా అర్చక స్వామి ఒక లింగము. అందుకే నందికి శివుడికి మధ్య అర్చకుడు వెళ్ళవచ్చు.

శివాలయంలో దేవతామూర్తులు స్థానములు మారడానికి వీలులేదు. ఎంత పెద్ద శివాలయం అయినా సరే నైరుతిలో విఘ్నేశ్వరుడు, పడమట సుబ్రహ్మణ్యుడు, ఉత్తరమున చండీశ్వరుడు, దక్షిణమునందు దక్షిణామూర్తి, ఆగ్నేయం నందు సోమస్కందుడు, ఈశాన్యము =నందు నటరాజు కాని, భైరవ మూర్తి కాని ఉండాలి.

శివ లింగారాధనం ఎలా చేయాలి అని తెలిసి చెయ్యగలిగితే వాడంత అదృష్టవంతుడు సృష్టిలో లేడు. అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై నీటిని సన్నటి ధారగా పోయాలి. అంతేకానీ పంచపాత్రలో నీళ్ళు తీసుకుని ఉద్ధరిణతో పోయకూడదు. అభిషేక జలం తొక్కకూడదు. శివాభిషేకం గురు ముఖతః చేయడం చాలా మంచిది..
సాంప్రదాయ దుస్తులు ధరించడం చాలా చాలా మంచిది.

“ఎన్ని రూపాలు… ఒక్క తత్త్వం.
ఎన్ని దీపాలు… ఒక్క జ్యోతి.
ఓం నమః శివాయ 🕉️”

🔥 “శివలింగం చల్లబడితే… మన జీవితాలూ చల్లబడతాయి.

శివస్మరణే శాశ్వత శాంతి 🙏”

🕉️“ప్రతి రోజూ శివస్మరణే నిజమైన శివరాత్రి.🕉️
🕉️ఓం నమః శివాయ… హర హర మహాదేవ 🕉️”

3 months ago | [YT] | 3

Hamsa Lekhha Films

గణపతి ఉపాసనకు మహారాష్ట్ర పెట్టింది పేరు. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో గణపతి క్షేత్రాలు కోకల్లలుగా ఉన్నాయి. వాటన్నిటిలోకి అష్టగణపతి క్షేత్రాలుగా ప్రాముఖ్యం సంతరించుకున్న ఎనిమిది క్షేత్రాలు గాణాపత్యులకు ముఖ్యమైనవి. అనేకానేక శక్తిపీఠాల్లో అష్టాదశ శక్తిపీఠాలు ప్రసిద్ధికెక్కినట్లు ఈ ఎనిమిదీ అష్టగణపతి క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి.

1. మయూరేశ్వర గణపతి - పూనా జిల్లాలో పూనా నుండి నలభై మైళ్ళ దూరంలో నున్న 'మోరగావ్'లో మయూరేశ్వర గణపతి ఆలయం ఉంది.

2. చింతామణి గణపతి - పూనా నుండి పధ్నాలుగు మైళ్ళదూరంలో నున్న 'థేపూర్' చింతామణి గణపతి క్షేత్రం.

3.గిరిజాత్మజ గణపతి - పూనా నుండి అరవై మైళ్ళదూరంలో నున్న 'లేహ్యాద్రి' అనే స్థలంలో గిరిజాత్మజ గణపతి క్షేత్రం వెలిసింది.

4. శ్రీ విఘ్నేశ్వర గణపతి - లేహ్యాద్రి సమీపంలోనే 'ఓఝల్' స్థలంలో 'శ్రీవిఘ్నేశ్వర' క్షేత్రం వెలిసింది.

5. మహోత్కట గణపతి - పునానుండి 32 మైళ్ళ దూరంలో ''రాజన్గావ్''లో మహోత్కట గణపతి ఆలయం ఉంది.

6. భల్లాలేశ్వర గణపతి - మహారాష్ట్రలోని కులాబా జిల్లాలో 'పాలీ' అనేచోట భల్లాలేశ్వర గణపతి క్షేత్రం ఉంది.

7. వరదవినాయకుడు - కులాబాజిల్లాలో ''మహర్'' అనే స్థలంలో ''వరదవినాయక'' ఆలయం ఉంది.

8. సిద్ధివినాయకుడు - అహ్మద్ నగర్ జిల్లాలో ''సిద్ధటేక్'' అనే స్థలంలో సిద్ధివినాయక క్షేత్రం వెలిసింది.

4 months ago | [YT] | 2

Hamsa Lekhha Films

మరుగున పడ్డ అపురూప నది జాడ...........!!
అంతర్వాహిని సరస్వతి రహస్యం.......!
రెండు వేర్వేరు సంఘటనలు..
మరుగున పడ్డ ఒక అపురూప విషయాన్ని మళ్లీ
తెర పైకి తీసుకుని వచ్చాయి.
అదే సరస్వతీ నది.
వేదాల్లో సరస్వతీ నది ప్రస్తావన ఉంది.

అదే ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది అని చెబుతారు.
ఈ నది మనకు భౌగోళికంగా కనిపించదు.
అయితే భూమి కింద అంతర్వాహినిగా ప్రవహిస్తోందని చెబుతారు.
అయితే ఇటీవల జరిగిన రెండు సంఘటనలు.. సరస్వతీ నది ఉనికిని ఎలా నిర్ధారిస్తున్నాయో చూద్దాం.

కొద్ది రోజుల క్రితం రాజస్ధాన్‌ ఎడారిలో,
ఓ రహస్య సరస్సు అనుకోకుండా బయటపడింది.
జైసల్మేర్‌లోని మోహన్‌గఢ్‌లో ఓ రైతు తన పొలంలో ట్యూబ్‌వెల్‌ కోసం డ్రిల్లింగ్‌ చేయిస్తుండగా ఆకస్మాత్తుగా భూమి నుంచి జలధార ఉబికివచ్చింది. నీటితో పాటు గ్యాస్‌ బయటకు రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.
అందరూ చూస్తుండగానే ఆ ప్రాంతమంతా జలమయమయ్యింది.
ఓ పెద్ద సరస్సు ఏర్పడింది.

లారీతో పాటు డ్రిల్లింగ్‌ మిషన్‌ కూడా నీటిలో మునిగిపోయింది.
ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది.
దీంతో స్థానికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు అధికారులు.
అదే సరస్వతి నది అని చెబుతున్నారు స్థానికులు. వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం గుండా సరస్వతీ నది ప్రవహించేది అని, ఆ తర్వాత అది భూమిలోకి ఇంకిపోయిందని చెబుతారు.
ఆ నదికి సంబంధించిన నీటి ఊటల నుంచే
ఈసరస్సు బయటకు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

ఇక కొద్ది రోజుల క్రితం హర్యానాలోని రాఖీగర్హి ప్రాంతంలో పురావస్తు పరిశోధకులు తవ్వకాలు జరుపుతుండగా, భూగర్భంలో కొన్ని భారీ రిజర్వాయర్లు బయటపడ్డాయి.
అవి 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో పాటు నాలుగైదు అడుగుల లోతు ఉన్నాయి.

సరస్వతీ నది ఉపనది అయిన దృషద్వతి నీటిని నిల్వ చేసేందుకే, నాటి ప్రజలు ఈ భారీ భూగర్భ సంపులను నిర్మించారని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.
అయితే 3 వేల సంవత్సరాల క్రితమే.. దృషద్వతి, సరస్వతి నదులు క్రమేపీ ఇంకిపోతుండడంతో,
నీటి నిల్వ కోసం నాటి ప్రజలు, ఈ వాటర్‌ రిజర్వాయర్లను నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు.

ఈ రాఖీగర్హి ప్రాంతం.. ఇండస్‌ వ్యాలీ సివిలైజేషన్‌కు సంబంధించిన ప్రాంతం.
అంటే దాదాపు ఐదారు వేల ఏళ్ల కాలం నాటి
సింధునది నాగరికతకు సంబంధించిన ప్రాంతం.
ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌తో పాటు పాకిస్తాన్‌ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉంది.

ఇక 2018లో కూడా ఇస్రో శాటిలైట్‌ చిత్రాలు సరస్వతీ నది ఉనికిని నిర్ధారించాయి.
అప్పట్లో పార్లమెంట్‌కు ఇస్రో సమర్పించిన పత్రాల్లో
ఈ విషయం ఉంది.
సరస్వతీ నది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహించేదో, శాటిలైట్‌ ఇమేజెస్‌ ద్వారా ఇస్రో నిర్ధారించింది. అయితే 3 వేల సంవత్సరాల క్రితం వచ్చిన వాతావరణ మార్పులు, భూ భౌగోళిక మార్పులతో సరస్వతీ నది, దాని ఉపనది అయిన దృషద్వతి ఎండిపోయి, భూమిలోకి ఇంకిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అసలు ఈ సరస్వతీ నది ఎక్కడ పుట్టింది,
ఎక్కడ సముద్రంలో కలిసేదో చూద్దాం.

సరస్వతీ నది పుట్టుక హిమాలయాలు..
మంచు పర్వతాల్లో ఉద్భవించిన సరస్వతీ.. హిమాచల్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మీదుగా ప్రవహించింది.
చివరికి అరేబియా సముద్రంలో సంగమం అయ్యినట్లు చరిత్ర చెబుతోంది.
9వేల నుంచి 4 వేల సంవత్సరాల క్రితం వరకు సరస్వతీనది ప్రవహించిందని ఇస్రో పరిశోధనలు సూచిస్తున్నాయి.
3 వేల ఏళ్ల క్రితం వాతావరణ, భూ భౌగోళిక మార్పులు కారణంగా, వర్షాలు కురవక ఎండిపోయిన సరస్వతి, దృషద్వతి నదులు ఎండిపోయాయి.

ఇప్పుడు మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు.
ఇక్కడే గంగ, యమున, సరస్వతి నదులు కలుస్తాయని హిందువుల విశ్వాసం.

అయితే గంగ, యమునా నదులు కనిపిస్తాయి. సరస్వతి కనిపించదు.
అయితే అది అంతర్వాహిని అని,
భూమి కింద నుంచి ప్రవహిస్తుందని చెబుతారు. రాజస్థాన్‌లో ఇటీవల బయటపడ్డ భూగర్భ సరస్సు, రాఖీగర్హిలో బయటపడ్డ భారీ నీటి రిజర్వాయర్లు.. ఇవన్నీ సరస్వతీ నది ఉనికిని నిర్ధారిస్తున్నాయని చరిత్రకారులు భావిస్తున్నారు.
(సేకరణ )

4 months ago | [YT] | 0

Hamsa Lekhha Films

2026 రథసప్తమి శుభాకాంక్షలు #rathasaptami

4 months ago (edited) | [YT] | 3