Sarita Modem vlogs

Hi every one. I am Sarita. home maker. in my channel i want to share about Devotional content, spiritual stories, tailoring, crafts, hair styles diy projects. pls encourage me. and subscribe my channel🙏🙏🙏

@Sarita modem


Sarita Modem vlogs

!!.ఓం మాత మహేశ్వరి, దుర్గా, భవానీ, చండీ, నారాయణి నమోస్తుతే.!!
🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷
సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే ।
భయేభ్యస్తాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే ॥

ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే
అర్ధము
సర్వ శుభములకు నిలయమైన పార్వతీ ! సర్వార్థములను సాధింప చేయుదానా ! త్రిలోచనుడైన శివునకు పత్నివైన నీకు నేను నమస్కరించుచున్నాను.
!!.ఓం శాంతి శాంతి శాతిః.!!
🕉️🕉️🕉️🕉️🕉️☸️🕉️🕉️🕉️🕉️🕉️

1 year ago | [YT] | 67

Sarita Modem vlogs

🙏🌺ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఇది సమర్పిస్తే!
అమ్మవారి కృపతో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి...🌺🙏
🌺శ్రీమహాలక్ష్మి విష్ణుమూర్తి గుండెల్లో ఉంటుంది అయితే ఆవిడ ఈ కలియుగానికి మూల స్తంభం అయితే శ్రీమహాలక్ష్మి కరుణ పొందాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి.అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆతి ముఖ్యమైనది మరియు చాలా శుభదాయకం.

అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం చాలా రకాల పూజలు, పువ్వులు, నియామాలు పాటిస్తాము. అయితే ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది తెలుసుకోబోతున్నాం..

ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసి గంధం మరియు కుంకుమ బొట్టు పెట్టాలి.అలాగే వివిధరకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి.
లక్ష్మీదేవికి నమస్కారం చెబుతూ ఆహ్వానించే స్తోత్రం మహాలక్ష్మి అష్టకం ఇది కనీసం ఒక్కసారైనా చదవాలి. 🌺

🌺పూజ అంతా అయ్యాక ఆఖరి ఘట్టం నైవేద్యం సమర్పించడం,అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేధ్యాలలో చెరుకురసం చాలా ప్రీతికరం,

ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చెరుకురసం కనుక నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు మీ సొంతం అంతే కాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడు డబ్బుకి లోటు ఉండదు అలాగే వ్యాపారస్తులు కూడా ఇలాగా చెయ్యడం ద్వారా వ్యాపారాల్లో ఉన్నత స్తితికి వెళ్తారు.

అలాగే నైవేద్యం పెట్టిన చెరుకురసం మొత్తం కుటుంబ సభ్యులకు ఇవ్వాలి ఇలాగా చేస్తే పిల్లల్లో చెడు గ్రహ దోషాలు మరియు కుటుంబంలో దారిద్ర్యం మొత్తం పోతాయి. 🌺

1 year ago | [YT] | 83

Sarita Modem vlogs

పుత్ర గణపతి స్తోత్రం: 8 సార్లు పఠించాలి
********************************
శ్లో।। ఙ్ఞానశక్తిముమాం దృష్ట్వాయద్‌ దృష్టం వ్యోమ్ని శంభునా ।
యచ్చోక్తం బ్రహ్మణా పూర్వంశరీరంతు శరీరిణామ్‌ ।। 1

శ్లో।। యచ్చాపి హసితం తేనదేవేన పరమేష్ఠినా ।
ఏతత్కార్య చతుష్కేణపృథివ్యాంచ చతుర్ప్యపి ।। 2

శ్లో।। ప్రదీప్తాస్యో మహాదీప్తఃకుమారో భాసయన్‌ దిశః ।
పరమేష్ఠి గుణైర్యుక్తః సాక్షాత్‌రుద్ర ఇవాపరః ।। 3

శ్లో।। ఉత్పన్నమాత్రో దేవానాంయోషితః సప్రమోహయన్‌ ।
కాన్త్యా దీప్త్యా తథా మూర్త్యారూపేణచ మహాత్మవాన్‌ ।। 4

శ్లో।। తద్‌ దృష్ట్వా పరమం రూపంకుమారస్య మహాత్మనః ।
ఉమానిమీషే నేత్రాభ్యాంతమ పశ్యతభామినీ ।। 5

శ్రీ పరమేశ్వర ఉవాచ -
శ్లో।। వినాయకో విఘ్నకరో గజాస్యో
గణేశ నామా చ భవస్య పుత్రః ।
ఏతేచ సర్వే తవయాన్తు భృత్యా
వినాయకాః క్రూరదృశః ప్రచండాః ।
ఉచ్చుష్మ దానాది వివృద్ధ దేహః
కార్యేషు సిద్ధం ప్రతిపాదయన్తః ।। 6

శ్లో।। భవాంశ్చ దేవేషు తథా ముఖేషు
కార్యేషుచాన్యేషు మహానుభావాత్‌ ।
అగ్రేషు పూజాం లభతేన్యధాచ
వినాశయిష్య స్యథ కార్యసిద్ధిం ।। 7

శ్లో।। ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ
సురైఃసమం కాంచన కుంభ సంస్థెః ।
జలై స్తథా సావభిషిక్తగా
త్రోరరాజ రాజేంద్ర వినాయకానాం ।। 8

శ్లో।। దృష్ట్వాబిషిచ్య మానంతుదేవాస్తం గణనాయకం ।
తుష్టువుః ప్రయతాః సర్వేత్రిశూలాస్త్రస్య సన్నిధౌ ।। 9

దేవా ఈచుః -
శ్లో।। నమస్తే గజవక్త్రాయనమస్తే గణనాయక ।
వినాయక నమస్తేస్తు నమస్తేచండ విక్రమ ।। 10

శ్లో।। నమోస్తుతే విఘ్నకర్త్రేనమస్తే సర్పమేఖహో ।
నమస్తే రుద్ర వక్రోత్థ ప్రలంబ జఠరాశ్రిత ।
సర్వదేవ నమస్కారాదవిఘ్నం కురు సర్వదా ।। 11

శ్రీ పార్వత్యువాచ -
శ్లో।। అపుత్రోపి లభేత్‌ పుత్రానధనోపి ధనం లభేత్‌ ।
యం యమిచ్ఛేత్‌ మనసాతం తం లభతి మానవః ।। 12

శ్లో।। ఏవంస్తుత స్తదాదేవైర్మహాత్మా గణనాయకః ।
అభిషిక్తస్య రుద్రస్యసోమస్యా పత్యతాం గతః ।। 13

శ్లో।। ఏతస్యాం యస్తిలాన్‌ భుక్త్వాభక్త్యా గణపతిం నృప ।
ఆరాధయతి తస్యాశు తుష్యతేనాస్తి సంశయః ।। 14

శ్లో।। యశ్చైతత్‌ పఠతే స్తోత్రంయశ్చైతచ్ఛ్రుణుయాత్‌ సదా ।
నతస్య విఘ్న జాయన్తేనపాపం సర్వథా నృప ।। 15
**************************
శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిః (16 Names of Ganesha)

1 year ago | [YT] | 54

Sarita Modem vlogs

ఫాల్గుణమాసం ప్రారంభం :

తెలుగు మాసాల్లో చిట్టచివరిది ఫాల్గుణం. ఈమాసం నరసింహస్వామి ఆరాధనకు ప్రత్యేకించినది. అన్ని ప్రసిద్ధ నృసింహ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మధూక వ్రతం చేస్తారు. నాలుగోరోజును తిలచతుర్ధి అంటారు. ఆనాడు నువ్వులతో కలిపి వండిన అన్నంతో హోమం చేస్తే సర్వవిఘ్నాలు నశిస్తాయి. ఆనాడు పుత్రగణపతి వ్రతం కూడా ఆచరించాలి. పంచమినాడు అనంతపంచమి వ్రతాన్ని ఆచరించాలి. ఫాల్గుణ శుద్ధ అష్టమి లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. శుక్లపక్షంతో ప్రారంభించి ఫాల్గుణ బహుళ ద్వాదశి వరకు నృసింహారాధన చేయాలి. ఫాల్గుణ పూర్ణిమనాడు హోళీ వస్తుంది. ఆనాడు రాబోయే వసంతానికి స్వాగతం చెబుతూ వసంతోత్సవాలు జరుపుకుంటారు.

1 year ago | [YT] | 43

Sarita Modem vlogs

లలితా సహస్ర నామము

"విద్యా విద్యాస్వరూపిణీ"
"ఈశావాస్యోపనిషత్తు"

"విద్య, అవిద్య" ఈ రెండింటి స్వరూపము ఆ దేవి ఈశావాస్యోపనిషత్తులో విద్య అవిద్య ల గురించి చెప్పబడినది అవిద్యను ఆరాధించే వారు అంటే ఆత్మ జ్ణానము లేకుండా కర్మలను ఉపాసించే వాడు గాఢాంధ కారంలో పడి పోతారు అందు చేత జ్ణాన రహిత మైనఉనపాసన వలన గాని ఉపాసనా రహితమైన జ్ణానం వలన గాని సద్గతి కలుగదు విద్య,అవిద్య రెండు కూడా ఆ పరమేశ్వరి స్వరూపాలే అయితే సాధకుడు ఈ విష యాలనుతెలుసుకొని ఉపాసన చేసినట్లైతేఅతడికి మెాక్షం ప్రసాదిస్తుంది ఆ పరమేశ్వరి అందు చేతనే ఆమె విద్యా విద్యా స్వ రూపిణీ అనబడినది.

"ఈశా వాస్యోపనిషత్తు" వివరణ

అంతా నా ఆత్మ స్వరూపమే ఆత్మ యందే అంతా వున్నదీ అవిద్యా అంటే అజ్ణానం విద్య అంటే జ్ణానం

విద్య అనే మార్గంఅవిద్య ఆనే మార్గం వాటి వాటి ప్రయెాజనములు వేఱు వేఱయి వుంటున్నాయిశాస్త్ర సాధనా క్రమములు అవిద్యా
నిర్మా తలేశాస్త్రసంవిధానములోని విద్యఅవిద్యావిభాగములు ఎవరైతే చక్కగాబుద్ధితో విచక్షించి గ్రహిస్తారోఅట్టివారు అవిద్యా రూప సాధనలను ఉపయెాగించి మృత్యువు నుండి విడి వడిన వారై విద్యను ఉపాసించి అమృత స్వరూపు లగు చున్నారు

విద్య కొరకై అవిద్య ఉద్దరిణ వలె, పంచ పాత్ర వలె ఉపకరణము అగు చున్నది ప్రతీ జీవుని యందు ఆత్మ జ్ణానము మరియు ఆత్మ జ్యోతీ జ్వాజ్వల మానంగా ప్రకాశి స్తోంది అయితే ఆ ఆత్మ జ్ణానము అనే సత్యము హిరణ్య గర్భుని కల్పన యగు జగత్ అనుభవం అనే బంగారు పాత్రలో మెాహముఅనే మూసచే కప్పబడినదై వుండిఅనేకమందిజీవులకు అనుభూతం కావటం లేదు

మనలను అమృత స్వరూపులుగా తీర్చిదిద్ది పునీతం
చే స్తోంది" విద్యయా అమృతంఅశ్నుతే" కాబట్టి మనం జీవిత నావనువుపయెాగించి చేరవలసిన స్థానం మన నిత్య నిర్మల అప్రమేయ అమృత స్వరూప మగు ఆత్మ వైపుకు వెళ్లి సర్వ జీవులు తానై సర్వమునకు సాక్షిగా వేరైనట్టి ఆత్మత్వమే విద్యా మార్గము

సర్వతో ముఖీ

1 year ago | [YT] | 69

Sarita Modem vlogs

ఏకబిల్వం శివార్పణం

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ త్రి జన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం మనసు, బుద్ధి, చిత్తం అలాగే, వాక్కు, శరీరం, బుద్ధి అనే త్రికరణాలకు ప్రతీక బిల్వపత్రం. మూడు గుణాల్ని తొలగించే త్రిగుణాతీతుడైన భవునికి ఎంతో ప్రీతికరమైనది. మూడు జన్మల పాపాలను సైతం తొలగించే బిల్వాన్ని మనఃపూర్వకంగా భక్తితో పరమేశ్వరునకు అర్పించడమే బిల్వార్చన. మూడు ఆకులుండి రంధ్రాలేవీ లేకుండా కోమలంగా శుభ్రంగా ఉన్న బిల్వాలనే పరమేశ్వరునికి సమర్పించాలి 3,7,11 లేక 21, 54, 108 సంఖ్యలో లేదా శక్తి కొద్దీ ఎన్ని బిల్వాలనైనా శివునికి సమర్పించుకోవచ్చు.

బిల్వ ప్రసక్తి వేదంలో పలుచోట్ల కనిపిస్తుంది. నమకంలోనూ, శ్రీసూక్తంలోనూ మరింత విశేషంగా వర్ణితమైంది. పురాణ కథనాలను బట్టి తులసి (ఈమెనే బృంద అని కూడా పిలుస్తారు) జలంధరుని ఇల్లాలు. జలంధర సంహార సమయంలో ఈమె విష్ణువును శపించి యోగాగ్నిలో భస్మమవుతుంది. ఆ బూడిదలోనించి వచ్చినవే తులసి, బిల్వం, మందారం లాంటి వృక్షాలు. ఇలాంటిదే మరో కథకూడా ప్రచారంలో ఉంది. ఈశ్వరుని కంటినుండి నేలపై పడ నీటి బిందువు బిల్వవృక్షంగా మారిందని అంటారు. అమృతం ఉద్భవించే సందర్భంలో బిల్వం జన్మించిందనే కథ కూడా ఉంది. లక్ష్మికి తోడుగా పాలసముద్రంలో జన్మించింది కాబట్టి, లక్ష్మితో సమానంగా బిల్వాన్ని భావిస్తారు. లక్ష్మీప్రదమై అఖండైశ్వర్యాన్ని ప్రసాదించేదిగా బిల్వాన్ని పురాణాలు అభివర్ణించాయి.

మారేడు నీడలో...

మహాలక్ష్మి విష్ణువును అనుసరించగా, బిల్వం మాత్రం శివుణ్ణి అర్చించే సమయంలో తనను తాను అర్పించుకుని శివానుగ్రహం పొందింది. శివాలయంలో మారేడు మొక్కను నాటి సంరక్షిస్తే అఖండ సంపద సిద్ధిస్తుంది. ఇంటిలో కూడా పెంచుకోవచ్చు. తులసి కోట పక్కన మరో కుండలో చిన్న మారేడు మొక్కను నాటి, ఆ మొక్క కింద మట్టితో చేసిన శివలింగాన్ని ప్రతీ నెలా మాసశివరాత్రి నాడు ప్రతిష్ఠించి నిత్యం జలాభిషేకం చేసుకుంటే శివానుగ్రహం లభిస్తుంది.

పూజకు పువ్వులను సమర్పించే సమయంలో ఏ రోజు పూలు ఆ రోజే దైవారాధనకు సమర్పించాలి. మరునాటికి అవి నిర్మాల్యాలుగా మారిపోతాయి. అయితే బిల్వ దళానికి ఈ నియమం వర్తించదు. ఒకే బిల్వదళాన్ని ఎన్ని రోజులైనా స్వామికి సమర్పించవచ్చు. ఈరోజు సమర్పించిన వాటిని మరునాడు కడిగి పూజలో వినియోగించ వచ్చు. ఈశ్వరుడు మారేడుకు రేడు. శక్తి ఉన్న పక్షంలో వెండి, బంగారు లోహాలతో కూడా మారేడు పత్రాన్ని తయారుచేయించి శివునికి భక్తితో సమర్పించుకో వచ్చు. ఈశ్వరుణ్ణి బిల్వ దళంతో ఆరాధిస్తే శనిదోషాలు తొలగుతాయి. శివపురాణాన్ని అనుసరించి ఒకనాడు శనిదేవుడు కైలాసపతిని దర్శించాడు. మాటల సందర్భంగా ఒకరోజంతా నిన్ను పట్టి పీడిస్తానన్నాడు. వెంటనే శివుడు బిల్వ వృక్షరూపం ధరించాడు. దాంతో స్వామి జాడ తెలియక దేవతలు తల్లడిల్లారు. తరువాత శనిని కరుణించాడన్నది మిగతా కథ.

1 year ago | [YT] | 18

Sarita Modem vlogs

🙏ఓం నమఃశివాయ 🙏
*ధ్యానస్థితే శివరాత్రి*

మాఘ బహుళ చతుర్దశీ అర్ధరాత్రి లింగోద్భవ కాలం.
దీనినే 'మహా శివరాత్రి' అంటారు. ఇది 'రాత్రి' పర్వం.
ఉపవాసం, జాగరణ ఆచరించి ఆరాధించవలసిన పర్వం. దీనిలోని సంకేతాలను గమనిస్తే సాధనపరమైన అనేక రహస్యాలు గోచరిస్తాయి.
'రాత్రి' అనేది అన్ని సందడులూ, లోక వ్యవహారాలూ సద్దుమణిగిన స్థితి. అందునా - అర్ధరాత్రి. దీనిని 'తురీయ సంధ్య' - అంటారు.
ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయంసంధ్య - వ్యవహారంలో గోచరించేవి.
ఈ నాలుగో (తురీయ) సంధ్య పూర్తిగా ధ్యానానికి సంబంధించినది.
అన్ని అలజడులూ, గోలలూ అణగిన అచలస్థితి ధ్యానంలో అత్యంత ముఖ్యం. ఆ స్థితిలో మనస్సు లీనమై పొందేది పరమానందానుభవం. ఆ తాదాత్మ్య స్థితిలో లోకపు లంపటాలన్నీ అణగుతాయి. అదే పరమమైన లయ. ఆ లయనే కైవల్యం అంటారు.
ఈ రాత్రి అనేది సాధకుడు సాధించవలసిన స్థితి.
బహిర్ముఖ దృష్టిని వదలి, బుద్ధిని అంతర్ముఖం చేసి అంతరంగంలో ఈశ్వర జ్యోతిపై కేంద్రీకృతం చేయడమే రాత్రి. పగలు బహిర్ముఖం, రాత్రి అంతర్ముఖం. సాధారణ జీవితంలో కూడా పగలంతా బైట సంచరించిన జీవులు, రాత్రి స్వస్థలాన్ని చేరి విశ్రాంతి పొందుతారు. లోతుగా ఆలోచిస్తే అందరి స్వస్థలం ఈశ్వరధామమే. అది మన హృదయంలోనే ఉంది.
ఇంద్రియాల ద్వారా బహిర్లోక విషయాలతో అంటుకొనే మనస్సును, మనలోని చైతన్యానికి మూల కేంద్రమైన శివ (ఆత్మ) జ్యోతిలో లీనం చేసే అంతర్ముఖ ప్రయాణమే రాత్రి. ఆ ధ్యానస్థితి అంటే నిద్ర కాదు. మరపు కాదు. అదే వ్యక్తి జాగరూకత.
మనల్ని మనం మరచి తిరిగే వెలుపలి తిరుగుడు కన్నా, అంతర్ముఖీనమైన ఈ ధ్యానస్థితిలోనే మన చైతన్యం పూర్ణజాగృతిలో ఉంటుంది. అజ్ఞానపు పెనునిద్దుర వదలే ఈ 'జాగరణ'యే శివరాత్రి వ్రతం. ఇది ఉపవాస వ్రతం కూడా.
ఆహార నియమమే ఉపవాసం, మన ఇంద్రియాలతో అనుభవించే భోగాలే ఆహారాలు. వాటిని నియంత్రించే ఇంద్రియ నిగ్రహణమే నిజమైన ఉపవాసం. ఆ ఉపవాసం ద్వారా, జాగరణ ద్వారా సర్వవ్యాపక, అంతర్యామి శివచైతన్యంలో తాదాత్యాన్ని పొందగలం.
ప్రతి నెలా అమావాస్య ముందు వచ్చే (బహుళ) చతుర్దశి రాత్రిని 'మాస శివరాత్రి' అంటారు. ఇది నెలలో తురీయ సంధ్య, సంవత్సరపు చివరి మాసానికి (ఫాల్గుణానికి) ముందు వచ్చే మాఘమాసం సంవత్సరానికి సంధ్య వంటిది. ఆ సంధ్యలో సంధ్యా స్థానంలో మాఘ బహుళ చతుర్దశి రాత్రి. అందుకే ఇది సంవత్సరానికే సంధ్యాకాలం.
ఈ సమయానికి ‘మహాశివరాత్రి' అనే పేరు రావడంలో వైశిష్ట్యమిది.
కర్మ లంపటాలన్నీ చాలించి జీవుడు పరమాత్మ సాన్నిధ్యంలో శాంతిని పొందడమే లయ. ఆ లీనావస్థ లోనే అఖండానందం లభిస్తుంది. బహిర్ముఖ భ్రమణాలలో అలసిన జీవుడు 'అలసితి సొలసితి ఇంతట నీ శరణిదె జొచ్చితిని' అని ఏ అంతర్యామితో తన్మయం చెందుతాడో ఆ అంతర్యామినే 'శివం' అన్నారు.
త్రిగుణాలకు, త్రి అవస్థలకు, శరీర త్రయానికీ (స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు) అతీతమై, ఆ మూడింటినీ నడిపే పరంధామమే శివజ్యోతి. దానిని అంతరంగంలో ఆవిష్కరించుకొనే తత్త్వమే శివరాత్రిలో అంతరార్ధం.
'రాతి సుఖం దదాతీతి రాత్రి ' - సుఖాన్నిచ్చే కాలం రాత్రి. భోగానందాల మాటను వదలి, యోగానందాన్ని పొందే అవస్థ అసలైన రాత్రి.
'యానిశా సర్వభూతానాం తస్య జాగర్తి సంయమీ' (భగవద్గీత)
అందరికీ రాత్రి ఏదో, యోగికి అది పగలు. మన పగలు. వారికి రాత్రి.
బహిర్ముఖులు ఏ ఆత్మ విషయంలో నిద్రపోతారో, ఆ ఆత్మ స్థితిలో యోగి నిత్యమూ మెలకువ కలిగిఉంటాడు. లౌకిక లంపటులు ఏ బాహ్య విషయంలో మెలకువ కలిగి ఉంటారో, ఆ బాహ్య విషయంలో నిస్పృహులై ఉంటారు యోగులు.
జ్ఞానానంద స్వరూపుడు, నిత్య జాగరూకుడు శివుడు.
అంతర్ముఖ ప్రజ్ఞకు గోచరించే ఆ శాశ్వత సత్య తత్త్వాన్ని ఆవిష్కరించుకొనే సాధన శివరాత్రి.🙏

1 year ago | [YT] | 20

Sarita Modem vlogs

ఋణ విమోచన నృసింహ స్తోత్రము

ఋణబాధలను, ఆర్ధిక సమస్యలను తీర్చే శక్తివంతమైన ఋణవిమోచన నరసింహ స్తోత్రం. దీన్ని నిత్యం సాయం సంధ్యా వేళ పఠిస్తే శీఘ్ర ఫలితాలుంటాయి.

దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ ||

1 year ago | [YT] | 94

Sarita Modem vlogs

నేడు గురుపాడ్యమి

కలియుగములో రెండవ దత్తావతారమైన శ్రీ నృశింహ సరస్వతి స్వామి వారు శ్రీశైలం పాతాళ గంగ తీరమున ఒక పుష్పరధము అధిరోహించి నిజానంద గమనం చేరి తమ అవతార సమాప్తి గావించిరి.

ఆ రోజు బహుధాన్య సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం మాఘ బహుళ పాడ్యమి శుక్రవారం, పుష్యమీ నక్షత్రం దినము అవతార సమాప్తి చేసారు.

శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు చివరగా గాణ్గాపూర్ నందు 23 సం. ప్రవాసం చేసి ఎన్నొ విశేషములు జరిగినవి.

భక్తుల శారీరిక మానసిక బాధలు తొలగించి అందరినీ అనుగ్రహించారు.
శ్రీ స్వామి వారు చూపిన లీలలు అనంతం.

ఈ గురుపాడ్యమినాడు దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రాలను, మరియు శ్రీ పాద వల్లభ - నరసింహ సరస్వతి స్వామి వారి స్తోత్రాలను స్మరిస్తూ వారి అనుగ్రహం పొందుదాము.

1 year ago | [YT] | 36

Sarita Modem vlogs

🌼🌿మాఘ పౌర్ణమి🌼🌿

మాఘ పౌర్ణమి విశిష్టత
మాఘపూర్ణిమ , మహా మాఘి
ఇది విశేష పర్వదినం.
స్నానానికి ప్రాముఖ్యమైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయం ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగా
చేసే స్నానం) ఈ రోజునైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి.

ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం.
తిధుల్లో ఏ పూర్ణిమ అయిన సంపూర్ణంగా దైవీశక్తులు దీవించే పుణ్యతిధే.
ఈ తిధినాడు ఇష్టదేవతారాధన, ధ్యాన జపాది అనుష్టానాలు మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి.

ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది.
అన్ని పూర్ణిమల్లోకి మఘ, కార్తీక, వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతొ ఉత్కృష్టమైనవి.
వాటిని వ్యర్ధంగా గడుపరాదుని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.

వైశాఖీ కార్తీకీ మాఘీ
తిథయో౭ తీవ పూజితాః!
స్నాన దాన విహినాస్తా
ననేయాః పాండునందన!!

స్నానదాన జపాది సత్కర్మలు లేకుండా వృథాగా
ఈ మూడు మాసాలు పూర్ణిమలను గడుపరాదు.

మాఘ పూర్ణిమ నాడు " అలభ్య యోగం " అని కూడా అంటారు.
అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా
అది గొప్ప యోగ మవుతుంది.
అది అంత తేలికగా లభించేది కాదు.

స్నానంం చేస్తున్నప్పుడు పఠించాల్సిన శ్లోకం.

దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం

మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''

అని పఠించి, మౌనంగా స్నానం చేయాలి,
అంటే "దుఃఖములు, దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ
ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను.

కనుక ఓ గోవిందా! అచ్యుతా! మాధవా!
ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు''
అని అర్థం.

ఆ తరువాత ...
"సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ
త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా''

అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి.
అంటే "ఓ పరంజ్యోతి స్వరూపుడా!
నీ తేజస్సుచే నా పాపములు సర్వము
వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు
బడి నశించుగాక'' అని అర్థం.

ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత, పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని,
ఇష్టదైవాన్ని ఆరాధించాలి.
ఆ తర్వాత, దానధర్మాలు చేయాలి.
వస్త్రములు, కంబలములు [దుప్పటిలు],
పాదరక్షలు, గొడుగు, తైలము, నెయ్యి, తిలపూర్ణఘటము, బంగారము, అన్నము
మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది.

1 year ago | [YT] | 50