📌 English
Welcome to Medak Fast News
Your trusted source for daily latest news, breaking updates, and important local & national stories. Stay informed with fast, fair, and accurate news anytime, anywhere.
👉 Subscribe now and never miss an update!

📌 اردو
میدک فاسٹ نیوز میں خوش آمدید
یہ آپ کا معتبر پلیٹ فارم ہے جہاں آپ کو روزانہ کی تازہ خبریں، بریکنگ نیوز اور اہم مقامی و قومی خبریں ملتی ہیں۔
👉 ابھی سبسکرائب کریں اور ہر خبر سے باخبر رہیں!

📌 తెలుగు (Telugu)
Medak Fast News కి స్వాగతం
ఇది మీ నమ్మకమైన వార్తా వేదిక. ఇక్కడ మీరు ప్రతిరోజూ తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ మరియు ముఖ్యమైన స్థానిక & జాతీయ వార్తలు తెలుసుకోవచ్చు.
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి మరియు ప్రతి అప్డేట్‌ను మిస్ కాకండి!

📌 Roman Urdu
Medak Fast News mein Khush Aamdeed
Yeh aap ka bharosa mand platform hai jahan aap ko rozana taaza khabrein, breaking news aur aham maqami aur qaumi updates milte hain.
👉 Abhi subscribe karein aur har update se ba khabar rahen!


MEDAKFASTNEWS

*నేడు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మీ రాజు యాదవ్ గారి కార్యక్రమాలు*
🔹 ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల వార్డు సభ
నర్సాపూర్ మున్సిపాలిటీ 1వ వార్డు హనుమంతపూర్‌లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల వార్డు సభలో మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మీ రాజు యాదవ్ గారు, వార్డు కౌన్సిలర్ గారు, మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజల సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించి సూచనలు స్వీకరించారు.
🔹 ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – స్వచ్ఛ సర్వేక్షణ అవగాహన కార్యక్రమం
5వ వార్డులో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మీ రాజు యాదవ్ గారు పాల్గొని పరిశుభ్రత ప్రాముఖ్యత, పరిసరాల శుభ్రత మరియు ప్రజల భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు.
🔹 ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – బడి బాట కార్యక్రమం
నర్సాపూర్ రైతు వేదికలో నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మీ రాజు యాదవ్ గారు, కౌన్సిలర్ సుధీర్ గౌడ్ గారు, మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్ గారు, సబ్ ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్ గారు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నమోదు, విద్య ప్రాధాన్యత, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి మరియు ప్రతి బాలబాలిక విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు సహకరించాలని పిలుపునిచ్చారు.

11 hours ago | [YT] | 0

MEDAKFASTNEWS

పురపాలక సంఘం మెదక్
ప్రెస్ నోట్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ లో భాగముగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఈరోజ అనగా తేదీ. 04.06.2026 నాడు మెదక్ పట్టణంలోని వార్డు నెంబర్లు 01, 02, 03, 04, 05, 16 ,17 & 18 వార్డులలో వార్డు సభలు సంబంధిత గౌరవ వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఇందులో, మున్సిపాలిటీ చేపట్టుచున్న వివిధ కార్యక్రమాలు అనగా ఘణ వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఇంటి వద్ద మరియు వివిధ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు, మురికి కాలువలను పూడిక తీయుట మరియు మురికి కాలువల శుభ్రత, వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేపట్టనున్న వివిధ కార్యక్రమాలు, ప్రజలకు త్రాగునీటి సరఫరా అందించుట, వివిధ ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూచుట, పట్టణంలో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించుట, రోడ్లను మరియు వీధి దీపాలను మెయింటెనెన్స్ చేయుట, మొక్కలు నాటుట, పర్యావరణ పరిరక్షణ గురించి తీసుకోనున్న చర్యలు, వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు మరియు మున్సిపాలిటీ నుండి చేపట్టనున్న వివిధ ఇతర కార్యక్రమాల గురించి వార్డు సభలలో ప్రజలకు వివరించడం జరిగినది. ప్రజలు వార్డులలో గల వివిధ సమస్యల గురించి తెలిపినారు. ఈ వార్డు సభలకు గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి. కానుగు రాధిక భూపతి రాజు గారు, గౌరవ వైస్ చైర్మన్ శ్రీ దొంతి నరేష్ గౌడ్ గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ వై నవీన్ గారు, టౌన్ ప్లానింగ్ అధికారి గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, మేనేజర్ గారు, సీనియర్ అసిస్టెంట్ గార్లు, ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ గారు, సంబంధిత వార్డుల వార్డు అధికారులు, మున్సిపల్ ఇతర సిబ్బంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

కమిషనర్,
పురపాలక సంఘం మెదక్

11 hours ago | [YT] | 1

MEDAKFASTNEWS

11 hours ago | [YT] | 1

MEDAKFASTNEWS

పత్రిక ప్రకటన
తేదీ 04-6-2026
మెదక్ జిల్లా
బడి బాట సమర్ధవంతంగా నిర్వహించాలి

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలి

---జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్


ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో విద్యాధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం మెరుగైన విద్యా ప్రమాణాల లక్ష్యంగా ముందుకు పోతూ బడి బాట సమర్ధవంతంగా నిర్వహించాలని,విద్యార్థుల తక్కువ నమోదు పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల నమోదు పెంచుటకై గ్రామంలోని ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని, కనీస సామర్ధ్యాలు అయినటువంటి చదవడం రాయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పాఠశాలల్లో ఏర్పాటు చేసే మౌలిక వసతుల గురించి తల్లిదండ్రులకు వివరించాలని, వీటి ఆధారంగానే పాఠశాలలకు ప్రగతి సూచికలు ఇవ్వబడతాయని ,రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రీ ప్రైమరీ పాఠశాలలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అలాగే ఎఫ్ఆర్ఎస్, ఇతర అంశాలపై దృష్టి పెట్టి సరియగు చర్యలు గైకొనాలని సూచించారు ,జిల్లాలోని భవిత కేంద్రాల బలోపేతానికి కృషి చేయాలని, కొత్త ప్రీ ప్రైమరీ విభాగాలను ప్రారంభించాలని, విద్యార్థుల సంఖ్యలేని పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని, పాఠ్యపుస్తకాల పంపిణీ చేయాలని, స్వయం సహాయక బృందాల చేత పిల్లలకు యూనిఫామ్ కుట్టించాలని, నూతన టెక్నాలజీ ఏఐ, డిజిటల్ తరగతులను నిర్వహించాలని, విద్యాశాఖ బలోపేతానికి ప్రత్యేక కార్యచరణ ప్రకారం ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజు, చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్ రాజు, ఏ ఎం ఓ సుదర్శన మూర్తి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

11 hours ago | [YT] | 0

MEDAKFASTNEWS

పత్రికా ప్రకటన
తేది: 04.06.2026
మెదక్ జిల్లా


ప్రత్యేక గ్రామసభల ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం – జిల్లా అదనపు కలెక్టర్ నగేష్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని శంకరంపేట ఆర్ మండలంలోని రుద్రారం గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ హాజరై గ్రామస్థులతో సమావేశమయ్యారు.

గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి , హార్టికల్చర్ అధికారి,ఇతర జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ..రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
మురికి కాలువలను శుభ్రపరచడం, పిచ్చి మొక్కలను తొలగించడం, తాగునీటి వనరులు, వాటర్ ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచడం, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు.
ఘన వ్యర్థాల నిర్వహణ రూల్స్–2026ను గ్రామపంచాయతీలు తప్పనిసరిగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. తడి, పొడి, శానిటరీ , ప్రత్యేక వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి నిర్వహించాలని సూచించారు.

గ్రీన్ బుట్టలో తడి వ్యర్థాలు, బ్లూ బుట్టలో పొడి వ్యర్థాలు, రెడ్ బుట్టలో శానిటరీ వ్యర్థాలు, నల్ల రంగు బుట్టలో ప్రత్యేక వ్యర్థాలను వేరు చేసి గ్రామపంచాయతీకి అందించాలని ప్రజలకు సూచించారు.

గ్రామసభలో తాగునీటి నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (SIR-2026), పంటల మార్పిడి, బడిబాట కార్యక్రమం, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కోరారు.

రైతులు సంప్రదాయ పంటలతో పాటు పంటల మార్పిడిని అలవాటు చేసుకొని ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.
అర్హులైన లబ్ధిదారులను గ్రామసభల ద్వారా గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాభివృద్ధి, ప్రజా భాగస్వామ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ప్రత్యేక గ్రామసభలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు.

అనంతరం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి, స్వచ్ఛత పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ గ్రామ సభలో గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు, వ్యవసాయ అధికారి దేవకుమార్ , హార్టికల్చర్ అధికారి ప్రతాప్ సింగ్ ,సర్పంచ్ సంతోష నవీన్ గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి, స్వచ్ఛత పోస్టర్లను ఆవిష్కరించారు.

11 hours ago | [YT] | 0

MEDAKFASTNEWS

పత్రిక ప్రకటన
తేదీ 4-6-2026
మెదక్ జిల్లా

రైతులు అధైర్య పడొద్దు ధాన్యం చివరి గింజ వరకూ కొంటాం

71,327 మంది రైతుల నుంచి 3,50,620.680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 57,496 మంది రైతుల లకు రూపాయలు 616.93 కోట్ల రూపాయల చెల్లింపులు

200 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేత

----జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్


రైతులు అధైర్య పడోద్దని ధాన్యాన్ని చివరి గింజ వరకు
కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నుంచి అధికారులతో గూగుల్ మీట్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్య పడొద్దు అన్నారు.

ఈ రోజు వరకు 71,327 మంది రైతుల నుంచి 3,50,620.680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 57,496 మంది రైతుల లకు రూపాయలు 616.93 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయన్నారు.

200 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేసి కేంద్రాలను ముసివేయడం జరిగిందనీ,
ధాన్యం కొనుగోలు పూర్తి అయిన కేంద్రాల్లోని హమాలి , లారీలను ధాన్యం పూర్తి కానీ కేంద్రాలకు తరలించి వేగంగా అన్లోడింగ్ జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి దేవకుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నిత్యానంద తదితరులు పాల్గొన్నారు.

11 hours ago | [YT] | 0

MEDAKFASTNEWS

నేడు నర్సాపూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో రోడ్డు మరియు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మాచనూరి లక్ష్మీ రాజు యాదవ్ గారు, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ గారు, మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ గారు, కౌన్సిలర్లు సుధీర్ గౌడ్ గారు, అంజినేయులు గౌడ్ గారు, ఇల్యాస్ ఖాన్ గారు, చింతకుంట శ్రీకాంత్ గారు, నిరంజన్ బాల్‌రెడ్డి గారు, రాజు గారు, మొయిజ్ గారు, భిక్షపతి గారు, షేక్ హుస్సేన్ గారు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

13 hours ago | [YT] | 1

MEDAKFASTNEWS

*అయ్యప్ప స్వామి దేవాలయ రజతోత్సవాలకు కంఠరెడ్డి. తిరుపతికి ఆహ్వానం*..

మెదక్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ రజతోత్సవ మహోత్సవాలను ఈ నెల 14 నుంచి 20 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజు పంతులు భక్తబృందంతో కలిసి బిఆర్ఎస్ జిల్లా నాయకులు కంఠరెడ్డి.తిరుపతిరెడ్డిని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి రజతోత్సవ మహోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు,తదితరులు పాల్గొన్నారు.

16 hours ago | [YT] | 0

MEDAKFASTNEWS

తెలుగు

శీర్షిక:
మెదక్‌లో ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు
మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పద్మా దేవేందర్ రెడ్డి

వార్త:
మెదక్, జూన్ 3: మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను మెదక్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సాయి బాలాజీ గార్డెన్‌లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు హరీష్ రావు చేసిన సేవలను కొనియాడారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తూ రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మెదక్ ఎంసీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం కొరతను దృష్టిలో ఉంచుకొని ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

English

Headline:
Harish Rao’s Birthday Celebrated Grandly in Medak
Mega Blood Donation Camp Inaugurated by Padma Devender Reddy

News:
Medak, June 3: The birthday celebrations of former minister and MLA T. Harish Rao were held on a grand scale in Medak under the leadership of former Deputy Speaker and BRS District President M. Padma Devender Reddy. Party leaders and workers gathered at Sai Balaji Garden, cut a cake, and extended their birthday wishes to Harish Rao.

A mega blood donation camp was also inaugurated on the occasion. Speaking at the event, Padma Devender Reddy praised Harish Rao’s contribution to the Telangana movement and his service in various ministerial roles. She stated that the blood donation drive was organized in response to the shortage of blood at Medak MCH Government Hospital. Several BRS leaders, public representatives, party workers, youth, and supporters participated in the program and donated blood.

اردو

سرخی:
میدک میں ہریش راؤ کی سالگرہ کی تقریبات شاندار انداز میں منعقد
پدما دیویندر ریڈی نے میگا بلڈ ڈونیشن کیمپ کا افتتاح کیا

خبر:
میدک، 3 جون: سابق وزیر اور رکن اسمبلی تننیرو ہریش راؤ کی سالگرہ کی تقریبات میدک میں بڑے جوش و خروش کے ساتھ منائی گئیں۔ یہ تقریب سابق ڈپٹی اسپیکر اور بی آر ایس ضلع صدر ایم پدما دیویندر ریڈی کی قیادت میں سائی بالاجی گارڈن میں منعقد ہوئی، جہاں کیک کاٹا گیا اور ہریش راؤ کو مبارکباد پیش کی گئی۔

اس موقع پر ایک میگا بلڈ ڈونیشن کیمپ کا بھی افتتاح کیا گیا۔ پدما دیویندر ریڈی نے خطاب کرتے ہوئے تلنگانہ تحریک اور ریاستی ترقی میں ہریش راؤ کی خدمات کو سراہا۔ انہوں نے کہا کہ میدک ایم سی ایچ سرکاری اسپتال میں خون کی کمی کو مدنظر رکھتے ہوئے اس کیمپ کا انعقاد کیا گیا۔ تقریب میں بی آر ایس قائدین، عوامی نمائندوں، کارکنوں، نوجوانوں اور حامیوں نے بڑی تعداد میں شرکت کی اور خون کا عطیہ دیا۔

Roman Urdu

Heading:
Medak Mein Harish Rao Ki Saalgirah Taqreebat Shaandaar Andaz Mein Mun'aqid
Padma Devender Reddy Ne Mega Blood Donation Camp Ka Iftitah Kiya

News:
Medak, 3 June: Sabiq Wazir aur MLA T. Harish Rao ki saalgirah ki taqreebat Medak mein BRS rehnumaon ki janib se purjosh andaaz mein manayi gayin. Sabiq Deputy Speaker aur BRS Zila Sadar M. Padma Devender Reddy ki qayadat mein Sai Balaji Garden mein cake kaata gaya aur Harish Rao ko saalgirah ki mubarakbaad pesh ki gayi.

Is mauqe par ek Mega Blood Donation Camp ka bhi iftitah kiya gaya. Padma Devender Reddy ne apne khitab mein Telangana tehreek aur riyasat ki taraqqi mein Harish Rao ki khidmaat ko saraha. Unhon ne bataya ke Medak MCH Government Hospital mein khoon ki kami ko dekhte hue is camp ka ehtemaam kiya gaya. Programme mein BRS ke rehnuma, awaami numainde, karkun, naujawan aur hami badi tadaad mein shareek hue aur khoon ka atiya diya.

1 day ago | [YT] | 1

MEDAKFASTNEWS

తెలుగు (Telugu)

శీర్షిక:
నర్సాపూర్ 11వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శ్రీకారం

వార్త:
నర్సాపూర్, జూన్ 3: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్ పాల్గొన్నారు.

అలాగే కౌన్సిలర్లు రవి, నిరంజన్, చింతకుంట శ్రీకాంత్, బిక్షపతి, రాజు, షేక్ హుస్సేన్, మాజీ కౌన్సిలర్లు యాదగిరి, రాజేందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

English

Headline:
CC Road and Drainage Works Launched in Narsapur Municipality's 11th Ward

News:
Narsapur, June 3: Construction works for a CC road and drainage system were officially launched in Ward No. 11 of Narsapur Municipality on Wednesday. The inauguration was attended by Municipal Chairman Lakshmi Raju Yadav, Vice Chairman Buchchesh Yadav, and Municipal Commissioner Sai Kumar.

Councillors Ravi, Niranjan, Chintakunta Srikanth, Bikshapathi, Raju, and Shaik Hussain, along with former councillors Yadagiri and Rajender, were also present. Speaking on the occasion, the leaders reaffirmed their commitment to the development of the ward and stated that efforts would continue to provide better civic infrastructure and public amenities to residents.

اردو (Urdu)

سرخی:
نرساپور میونسپلٹی کے 11ویں وارڈ میں سی سی روڈ اور ڈرینیج کاموں کا آغاز

خبر:
نرساپور، 3 جون: نرساپور میونسپلٹی کے 11ویں وارڈ میں سی سی روڈ اور ڈرینیج کی تعمیراتی کاموں کا بدھ کے روز باقاعدہ آغاز کیا گیا۔ اس موقع پر میونسپل چیئرمین لکشمی راجو یادو، وائس چیئرمین بچیش یادو اور میونسپل کمشنر سائی کمار نے شرکت کی۔

اس پروگرام میں کونسلرز روی، نرنجن، چنتاکنٹا سری کانتھ، بکشا پتی، راجو، شیخ حسین اور سابق کونسلرز یادگیری و راجیندر بھی موجود تھے۔ اس موقع پر قائدین نے کہا کہ وہ وارڈ کی ترقی کے لیے پُرعزم ہیں اور عوام کو بہتر بنیادی سہولیات فراہم کرنے کے لیے اپنی کوششیں جاری رکھیں گے۔

Roman Urdu

Heading:
Narsapur Municipality ke 11th Ward mein CC Road aur Drainage Kaamon ka Aaghaz

News:
Narsapur, 3 June: Narsapur Municipality ke 11th Ward mein CC Road aur Drainage ki tameeri kaamon ka Budh ke roz baqaida aaghaz kiya gaya. Is mauqe par Municipal Chairman Lakshmi Raju Yadav, Vice Chairman Buchchesh Yadav aur Municipal Commissioner Sai Kumar ne shirkat ki.

Programme mein Councillors Ravi, Niranjan, Chintakunta Srikanth, Bikshapathi, Raju, Shaik Hussain aur sabiq councillors Yadagiri aur Rajender bhi maujood the. Is mauqe par rehnumaon ne kaha ke woh ward ki taraqqi ke liye pur-azm hain aur awaam ko behtar bunyadi sahuliyat faraham karne ke liye apni koshishen jari rakhenge.

1 day ago | [YT] | 1