Mana Paleru News | Telangana Politics & Local Updates
Mana Paleru News brings you the latest news, political updates, Paleru constituency developments, Telangana state politics, and local issues with truth and clarity. Stay updated with breaking news, live coverage, and analysis on leaders, elections, and public voices.
👉 Subscribe for Paleru politics, Telangana updates, Revanth Reddy, Congress and more!
Mana Paleru News
తెలంగాణ ప్రజాప్రభుత్వం శ్రీకారం..
హైదరాబాద్ పట్టణ పేదల సొంతింటి కల సాకారం
#LIGIndirammaIndlu #IndirammaIndlu #HousingforAll #PrajaPalana #Telangana
9 hours ago | [YT] | 17
View 0 replies
Mana Paleru News
కొత్తగూడెం, పాల్వంచ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
పాల్వంచలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం,త్వరలో జీవో-76పై స్పష్టత
భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
#MunicipalDevelopment #FoundationStone #GO76 #LandIssues #TelanganaCongress #PrajaPalana #Kothagudem #Palvancha #BhadradriKothagudem #Telangana
1 day ago | [YT] | 10
View 0 replies
Mana Paleru News
రేపే క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు విధానం,
అర్హతలకు సంబంధించిన బ్రోచర్ విడుదల
తేదీ : 20.07. 2026 సోమవారం
వేదిక : డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం, హైదరాబాద్
నెరవేరనున్న దశాబ్దాల పట్టణ పేదల సొంతింటి కల..
#IndirammaHousingScheme #LIGHousing #HyderabadHousing #HousingForAll #TelanganaCongress #PrajaPalana #DrBRAmbedkarSecretariat #Telangana
1 day ago | [YT] | 19
View 0 replies
Mana Paleru News
కొత్తగూడెం–పాల్వంచ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
💠రూ. 14 కోట్లతో దమ్మపేట–పాల్వంచ నాలుగు లేన్ల రహదారి విస్తరణకు శంకుస్థాపన
💠రూ. 50 లక్షలతో సీసీ రోడ్డు.. మరో రూ. 50 లక్షలతో సెంట్రల్ లైటింగ్ పనులు
💠పాల్వంచ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.. జీవో–76పై త్వరలో స్పష్టత
💠రూపాయి ఖర్చు లేకుండా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
కొత్తగూడెం–పాల్వంచ జంట పట్టణాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారిలో జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ) నిధులు రూ.14 కోట్లతో చేపట్టనున్న రెండున్నర కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ అంకిత్లతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మంచికంటి నగర్ హర్ష టౌన్షిప్లో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు పనులకు, పోస్టాఫీస్ సెంటర్ నుంచి గోదుమవాగు వరకు రూ.50 లక్షలతో చేపట్టనున్న సెంట్రల్ లైటింగ్, డివైడర్ అభివృద్ధి పనులకు మంత్రి గారు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా జరిగిన సభల్లో మంత్రి పొంగులేటి గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు సమాన ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల దమ్మపేట–పాల్వంచ రహదారి దెబ్బతిని ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, దీనిపై స్పందించి అత్యవసరంగా రూ.14 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పాల్వంచ ప్రాంతంలో దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలు, రిజిస్ట్రేషన్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని సర్వేలు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సింగరేణి పరివాహక ప్రాంత ప్రజలకు సంబంధించిన జీవో–76 అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని, త్వరలోనే దీనిపై స్పష్టత ఇస్తామన్నారు. పాల్వంచలో కాలుష్య రహిత పరిశ్రమలను నెలకొల్పి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని, కొత్తగూడెం పరిసరాల్లో విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేశామని వివరించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకున్నప్పటికీ సంక్షేమ హామీల అమలులో ఎక్కడా వెనకడుగు వేయడం లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిరంతరాయంగా సాగుతున్నాయన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ఇందిరమ్మ గృహాల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో సుమారు 8 లక్షల ఇళ్లకు ఆమోదం తెలిపామని, ఇప్పటికే 1.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. అలాగే, గురుకుల విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచడంతో పాటు, 70 వేల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేసి యువతకు భరోసానిచ్చామని గుర్తుచేశారు.
జిల్లాలో నెలకొన్న ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని మంత్రి కోరారు. నష్టాలు రాకుండా మెట్ట పంటలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన పెంచుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని కలెక్టర్ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, కమిషనర్ సుజాత, అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్టీవో మధు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
1 day ago | [YT] | 20
View 0 replies
Mana Paleru News
రేపటి నుంచే హైదరాబాద్ లో ఎల్ఐజీ ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు
తేదీ : 20.07. 2026 సోమవారం
వేదిక : డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం, హైదరాబాద్
#IndirammaHousingScheme #LIGHousing #HyderabadHousing #HousingForAll #TelanganaCongress #PrajaPalana #DrBRAmbedkarSecretariat #Telangana
1 day ago | [YT] | 25
View 0 replies
Mana Paleru News
హైదరాబాద్ నగరంలో నిరుపేదలకు 1 లక్ష ఎల్ఐజీ ఇందిరమ్మ ఇండ్లు
జూలై 20, 2026 సోమవారం డా.బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో- ఇండ్లకు దరఖాస్తు విధానం, అర్హతలకు సంబంధించిన బ్రోచర్ ను విడుదల చేయనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
#IndirammaIndlu #IndirammaHousingScheme #HousingForAll #LIGHousing #TelanganaCongress #indirammaindlasreenanna #PrajaPalana #DrBRAmbedkarSecretariat #Telangana
1 day ago | [YT] | 12
View 0 replies
Mana Paleru News
రాష్ట్రంలో నిరంతరంగా కొనసాగనున్న ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం
రెండున్నర ఏండ్లలో 8 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
తొలివిడత గ్రామాల్లో 4.50 లక్షలు, రెండవ విడత 2.50 లక్షలు, పట్టణ పరిధిలో తొలి విడత 1 లక్ష
రేపు క్యూర్ పరిధిలో 1 లక్ష ఎల్ ఐజీ ఇందిరమ్మ ఇంద్రకు శ్రీకారం
#IndirammaIndlu #IndirammaHousingScheme #HousingForAll #LIGHousing #TelanganaCongressGovernment #indirammaindlasreenanna #PrajaPalana #Telangana
1 day ago | [YT] | 14
View 0 replies
Mana Paleru News
రేపు క్యూర్ పరిధిలో ఎల్ఐజీ ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం
#IndirammaIndlu #LIGHousing #Telangana #PonguletiSrinivasaReddy #PonnamPrabhakar #SridharBabu #MohammadAzharuddin #HousingForAll #AffordableHousing #PublicWelfare #Development #GovernmentInitiative
1 day ago | [YT] | 5
View 0 replies
Mana Paleru News
ఇందిరమ్మ ఇండ్ల శ్రీనన్నతో సెల్ఫీ
#IndirammaIndlu #Srinanna #SelfieWithSrinanna #PonguletiSrinivasaReddy #Telangana #HousingForAll #PublicService #Development #Welfare #PeopleFirst
1 day ago | [YT] | 5
View 0 replies
Mana Paleru News
పేదోడి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
గ్రామం నుంచి మహానగరం వరకు ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పిస్తాం
క్యూర్ పరిధిలో ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్లకు సోమవారం శ్రీకారం
రాష్ట్రంలో పేదవాడి సొంతింటి కల నెరవేరే వరకు ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం నిరంతరంగా కొనసాగుతుందని ఇది ఒకసారి చేపట్టి ముగించే కార్యక్రమం కాదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచారం పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గూడు లేని ప్రతి అర్హులైన నిరుపేద కుటుంబానికి చివరి లబ్ధిదారుని వరకు గౌరవప్రదమైన సొంతింటిని నిర్మించి అందించే వరకు ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని అన్నారు .
పేదల సొంతింటి కలలను సాకారం చేయడమే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.
క్యూర్ (CURE) పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్ల కార్యక్రమాన్ని సోమవారం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం ఉన్నతాధికారులతో మంత్రి గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన, సౌకర్యవంతమైన సొంత నివాసం కల్పించాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పేదల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటికే సుమారు రెండు లక్షల ఇళ్లు పూర్తై లక్షలాది కుటుంబాలు గృహప్రవేశాలు చేశాయని, మిగిలిన ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు.
గత నెల 2వ తేదీన ఆసిఫాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు.
రెండో విడతలో హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇండ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు.
ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించిన ప్రభుత్వం, ఇప్పుడు హైదరాబాద్ నగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల సొంతింటి కలను కూడా నిజం చేయబోతోందని మంత్రి పేర్కొన్నారు.
క్యూర్ పరిధిలో లక్ష ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
సోమవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్ అజారుద్ధీన్ గార్లతో కలిసి దరఖాస్తు విధానం, అర్హతలు, బ్రోచర్ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
పేదల ఇళ్ల కోసం నగరంలో కోట్ల రూపాయల విలువైన అత్యంత కీలక ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించిందని, ఆయా ప్రాంతాలలో స్థానిక పరిస్థితులను బట్టి ఒక ఎకరా నుండి ఐదు ఎకరాల వరకు స్థలాలను సేకరించినట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వాల మాదిరిగా నగరానికి దూరంగా కాకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి గారు స్పష్టం చేశారు. కుటుంబాల జీవనోపాధికి, పిల్లల చదువులకు, ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించామని తెలిపారు.
అధునాతన సౌకర్యాలతో బహుళ అంతస్తుల (పది అంతస్తుల వరకు) భవనాల నిర్మాణం చేపట్టి, ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన జీవనం కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు.
ప్రతి నియోజకవర్గాన్ని ప్రత్యేక యూనిట్గా తీసుకుని అమలు చేస్తున్న ఈ పథకంలో ఆ నియోజకవర్గ ప్రజలు అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇళ్లు కలిపి మొత్తం 3.50 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని, గత ఏడాది మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లతో కలిపి మొత్తం 8 లక్షలకు పైగా పేద కుటుంబాల జీవితాల్లో సొంతింటి వెలుగులు నింపుతున్న ప్రజా ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు పేర్కొన్నారు.
#Ponguletisrinivasareddy #Indhirammaindlu
1 day ago | [YT] | 9
View 0 replies
Load more