Welcome to the official YouTube channel of Vamsikrishna Gaddam, Member of Parliament from Peddapalli, Telangana.
📌 On this channel, you'll find:
Speeches, Parliament sessions & interviews
Updates on Peddapalli development projects
Ground-level public service and citizen engagement
Insights into governance, youth empowerment & welfare initiatives
🎯 Committed to people-first leadership, transparency, and progress.
🔔 Subscribe for regular updates and follow Vamsikrishna Gaddam across platforms:
👉 Twitter (X): x.com/KakaVamsiGaddam
👉 Instagram: instagram.com/kakavamsigaddam
👉 Facebook: facebook.com/vkgaddamofficial
#VamsikrishnaGaddam #PeddapalliMP #TelanganaPolitics #PublicService #VKGaddam
Gaddam Vamsi Krishna
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకున్నాను.
అనంతరం మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించాను.
ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక విద్యార్థులు, యువత, ప్రజల త్యాగాలు, ఉద్యమ స్పూర్తి ఉన్నాయని పేర్కొన్నాను. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడం మనందరి బాధ్యత అని చెప్పాను.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించాను. అమరవీరులు కలలు కన్న తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి కొనసాగించాలని పిలుపునిచ్చాను.
అనంతరం తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అందజేస్తున్న మోటారు వాహనాల (స్కూటీల) పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశాను. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమ జీవితాల్లో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించాను.
తెలంగాణ అమరవీరుల త్యాగ స్ఫూర్తిని స్మరిస్తూ, వారి ఆశయ సాధన కోసం ప్రజలతో కలిసి నిరంతరం పనిచేస్తానని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశాను.
21 hours ago | [YT] | 10
View 0 replies
Gaddam Vamsi Krishna
పిన్నారం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను స్థానికులు నా దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించాం. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారితో కలిసి కొత్తగా ఏర్పాటు చేసిన బోర్వెల్ను ప్రారంభించడం ఆనందంగా ఉంది.
గ్రామంలో కొంతకాలంగా కొనసాగుతున్న నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఈ బోర్వెల్ ఏర్పాటు కోసం చర్యలు చేపట్టాం. దీని ద్వారా గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయని ఆశిస్తున్నాను.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందించడం మా బాధ్యత. గ్రామాల్లో తాగునీటి సమస్యలు సహా ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పనిచేస్తాం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులకు ధన్యవాదాలు.
1 day ago | [YT] | 11
View 0 replies
Gaddam Vamsi Krishna
ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్గా బీఎల్ఏ-2 సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులతో విస్తృతంగా చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నాను. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపుకు జరుగుతున్న ప్రయత్నాలను అప్రమత్తంగా గమనించాలని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును కాపాడేందుకు బీఎల్ఏలు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చాను.
అలాగే, దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకుంటున్న అవకతవకలు, పేపర్ లీకేజీల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశాను. యువత విద్య, ఉపాధి, అభివృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాను.
బీఎల్ఏ-2 సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలపై స్పందన, రాబోయే రాజకీయ కార్యాచరణపై సమగ్రంగా చర్చించాము. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ ప్రజల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశాను.
2 days ago | [YT] | 14
View 0 replies
Gaddam Vamsi Krishna
పెద్దపల్లి పట్టణంలోని ఒక చిన్న టీ షాప్ను సందర్శించే అవకాశం కలిగింది. అక్కడ తన కాళ్ల మీద తాను నిలబడి, ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవనం సాగిస్తున్న మహిళను కలవడం నాకు ఆనందాన్ని కలిగించింది.
కట్టెల పొయ్యి, గ్యాస్ పొయ్యి బదులుగా ఎలక్ట్రిక్ పొయ్యితో టీ తయారు చేస్తూ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్న ఆమె ఆలోచన నిజంగా అభినందనీయం. గ్యాస్ కొరత పరిస్థితుల్లో కూడా పొగరహిత విధానాన్ని ఎంచుకుని పర్యావరణాన్ని కాపాడుతూ జీవనం సాగించడం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుంది.
ఆమె చేత తయారైన టీని అక్కడే ఆస్వాదించాను. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. కలిసి సెల్ఫీ దిగుతూ ఆమె ఆత్మస్థైర్యాన్ని, స్వయం సమర్థతను అభినందించాను.
వయస్సుతో సంబంధం లేకుండా సాంకేతిక మార్పులను స్వీకరించడం సమాజానికి ఎంతో అవసరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి మార్పులు మరింత ప్రోత్సహించాలి. ప్రజలు స్వయం సమర్థతతో ముందుకు రావడం నిజమైన అభివృద్ధికి నిదర్శనం.
2 weeks ago | [YT] | 25
View 4 replies
Gaddam Vamsi Krishna
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో నేరుగా మాట్లాడి ధాన్యం తూకం, కొనుగోలు ప్రక్రియ, చెల్లింపుల ఆలస్యం, నిల్వ సౌకర్యాలపై వారి సమస్యలను తెలుసుకున్నాను.
జిల్లా మార్కెటింగ్ అధికారితో మాట్లాడి రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యం ఎందుకు జరుగుతోందో ప్రశ్నించాను. మార్కెట్ యార్డులో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, పారదర్శక తూకం విధానం మరియు వేగవంతమైన కొనుగోలు ప్రక్రియ అమలు చేయాలని అధికారులను ఆదేశించాను.
రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలని సూచించాను. రైతులకు న్యాయం జరగడం ఎప్పుడూ నా ప్రాధాన్యతగానే ఉంటుంది.
2 weeks ago | [YT] | 19
View 1 reply
Gaddam Vamsi Krishna
పెద్దపల్లి గెస్ట్ హౌస్లో జరిగిన ప్రెస్ మీట్లో నేను కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని తీవ్రంగా విమర్శించాను. బీహార్, యూపీ రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయిస్తూనే, తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోతలు పెడుతున్నారు. తెలంగాణ నుంచి అత్యధిక పన్నులు కేంద్రానికి వెళ్తున్నప్పటికీ, రాష్ట్రానికి తిరిగి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోంది.
డిలిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేము గట్టిగా వ్యతిరేకించాం. తెలంగాణకు రావాల్సిన సెమీకండక్టర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్కు తరలించారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యాచార కేసుల్లో విడుదలైన ఖైదీలకు బీజేపీ టికెట్లు ఇచ్చి గెలిపించుకుంది.
రామగుండం యూరియా ఉత్పత్తి విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చూపుతూ కృత్రిమ కొరత సృష్టిస్తోంది.
మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ధాన్యం కొనుగోలు విషయంలో పెద్దపల్లి కలెక్టర్ వివక్ష చూపుతున్నారు. దళిత రైతులు ఎక్కువగా ఉన్నారనే చిన్నచూపుతో రైతులను మోసం చేస్తున్నారు.
నేను అధికారంలో ఉన్నా లేకపోయినా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజల కోసం ఎప్పుడూ ప్రశ్నిస్తాను, పోరాడుతాను. ప్రజల కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను.
అధికారులు రాజకీయాలు చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. పనిచేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
పెద్దపల్లి జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే దింపుకున్నారు. మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు కేటాయించిన ధాన్యం ఎత్తివేతలో నిర్లక్ష్యం జరుగుతోంది.
రైతుల బాధలు మీకు పట్టవా? రైతులను నాశనం చేయాలనుకుంటున్నారా? అందుకే రైతుల పక్షాన ప్రశ్నించేందుకు నేను ఇక్కడికి వచ్చాను.
ఈరోజు భారత్ అమెరికా నుంచే నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. వాషింగ్టన్ డీసీ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే మోదీ పని చేస్తున్నట్టుగా ఉంది. ట్రంప్ చెప్పినట్టే మోదీ కూర్చోవడం, లేవడం జరుగుతోందన్న భావన కలుగుతోంది.
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ విషయంలో కేటీఆర్ అనవసర రాజకీయాలు చేస్తున్నారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తూ కుటుంబాలను కూడా నాశనం చేశాడు.
బండి భగీరథ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది.
2 weeks ago | [YT] | 18
View 3 replies
Gaddam Vamsi Krishna
బుద్ధిర్బలం యశోధైర్యం. సకల గుణ గణాభిరాముడు, సంకట మోచనుడైన ఆ హనుమంతుడు మన ప్రజల కష్టాలన్నీ తొలగించి ప్రతి కార్యంలో విజయాన్ని అందించాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
3 weeks ago | [YT] | 13
View 5 replies
Gaddam Vamsi Krishna
అకాల వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో రైతులు మృతి చెందిన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు, లక్షెట్పేట్ తహసిల్దార్ దిలీప్ కుమార్ గారు, డీసీసీ ప్రతినిధి రఘునాథ్ రెడ్డి గారు మరియు అధికారులతో కలిసి సందర్శించాను.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని పేర్కొన్నాను. లక్షెట్పేట్ మండలం కొత్తూరు కొనుగోలు కేంద్రంలో గోడ కూలి రైతులు మృతి చెందడం ఎంతో బాధాకరమని తెలిపాను. రవాణా సమస్యల వల్ల రైతులు ఇబ్బంది పడకూడదని, లారీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించాను. కొత్తూరు కొనుగోలు కేంద్రానికి సంబంధించిన ధాన్యాన్ని నెల్కి వెంకటాపూర్ గోదాముకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించాను.
అకాల వర్షాల ప్రమాదంలో మృతి చెందిన కొత్తూరు గ్రామానికి చెందిన వెంకటేష్ కుటుంబాన్ని, గంపలపల్లి గ్రామానికి చెందిన తండ్రి–కొడుకులు తనుగుల నాగరాజు, అభిరామ్ కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశాను. అనంతరం దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్కి లచ్చన్న కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ గారు మరియు తహసిల్దార్ రోహిత్ దేశ్పాండే గారితో కలిసి పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చాను.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
3 weeks ago | [YT] | 16
View 5 replies
Gaddam Vamsi Krishna
మంచిర్యాల జిల్లా లక్షెట్పేట్ సమీపంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించాను. ఇటీవల గోడ కూలిన ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి, అక్కడి పరిస్థితులను రైతులతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నాను. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, కలెక్టర్తో కలిసి కేంద్రాన్ని సమీక్షించాను.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే లారీలు, ట్రాక్టర్లు కేటాయించాలని అధికారులను ఆదేశించాను. వడ్లలో అనవసర కటింగ్లు జరగకుండా మిల్లర్లతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించాను. కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశాను.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
3 weeks ago | [YT] | 20
View 0 replies
Gaddam Vamsi Krishna
ధర్మపురి నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్కు సంబంధించి రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ గారితో కలిసి ప్రారంభదశ పనులను పరిశీలించాను. స్కూల్ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాన్ని సందర్శించి, లేఅవుట్, ప్రాథమిక సదుపాయాలు మరియు నిర్మాణ ప్రణాళికపై అధికారులతో సమీక్ష నిర్వహించాము.
పనులు ప్రారంభ దశలోనే నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని, ప్రతి దశను పర్యవేక్షిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించాను. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ధర్మపురి ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యా వసతులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాము.
ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి మరియు ఇతర సదుపాయాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నాను. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
3 weeks ago | [YT] | 17
View 1 reply
Load more