Vibrant AP – Voice of the People, Vision of the State.
Welcome to Vibrant AP, a dedicated Telugu news channel focusing on the heart of our community. We believe news should be more than just headlines; it should be about the people.
We bring you in-depth coverage of regional affairs, investigative reports, and stories that matter to the common man. From the fields of our farmers to the halls of the Assembly, we are there to witness and report.
Subscribe to Vibrant AP to stay connected with your roots and stay updated on the latest happenings in the Telugu world.
Follow us on Facebook & Instagram for real-time alerts!
VIBRANT AP
అమరావతి వేదికగా జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొని, మహిళా రిజర్వేషన్ ప్రవేశపెట్టే తీర్మానంపై ప్రసంగించడం జరిగింది. స్త్రీశక్తి ప్రధాన థీమ్గా కొనసాగుతున్న మహానాడు వేదికగా రాబోయే 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ ప్రతిపాదన చేసిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
@ncbn
@naralokesh
#Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత
11 hours ago (edited) | [YT] | 328
View 1 reply
VIBRANT AP
మహానాడు సభలో ప్రసంగించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మంత్రి, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు
#Mahanadu2026
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
15 hours ago | [YT] | 341
View 0 replies
VIBRANT AP
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్తో కలిసి పార్టీ జెండా ఆవిష్కరణతో మహానాడు 2026 పండుగ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
#Mahanadu2026
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
#ChandrababuNaidu
#NaraLokesh
15 hours ago | [YT] | 309
View 0 replies
VIBRANT AP
కోనసీమ నుండి హైదరాబాద్కు తరలిన ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహం
కొత్తపేట వడయార్ శిల్పశాలలో ప్రముఖ శిల్పి రాజ్కుమార్ వడయార్ చేతిలో రూపుదిద్దుకున్న నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహాన్ని సోమవారం హైదరాబాద్కు తరలించారు.
అన్నగారి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 28న అమీర్పేట మైత్రీవనం కూడలిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్న తొలి ఎన్టీఆర్ విగ్రహం ఇదే కావడం విశేషం.
#IconNewsBreakings
1 day ago | [YT] | 480
View 3 replies
VIBRANT AP
ఢిల్లీలో‘అప్నాపన్’పుస్తకావిష్కరణ
స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మంత్రి లోకేష్
ఒకవైపు మంత్రిగా, మరోవైపు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా క్షణం తీరిక లేకున్నా.. ఢిల్లీ పర్యటనకు వెళ్లారు మంత్రి నారా లోకేష్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తనకు ఉన్న అనుబంధంపై కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన “అప్నాపన్: మై ఎక్స్ పీరియెన్సెస్ విత్ నరేంద్ర మోదీ” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు ఉన్న 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవాలను, ఆత్మీయ ప్రయాణాన్ని మరియు జ్ఞాపకాలను శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆవరణలో ‘అప్నాపన్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ ప్రధాని హెచ్ డీ దేవగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హెచ్ డీ దేవెగౌడ, కుమారస్వామిలను పలకరించారు మంత్రి లోకేష్. ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో మంత్రి లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు రామ్మోహననాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు, బీజేపీ నాయకులు, పలువురు సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు.
1 day ago | [YT] | 633
View 11 replies
VIBRANT AP
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న
కేంద్రమంత్రి రామ్మోహననాయుడు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో పాటుగా దర్శించుకున్నారు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహననాయుడు. దేశ ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన వేడుకున్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనం ఎప్పుడూ గొప్ప ఆధ్యాత్మిక చింతనను అందిస్తుందన్నారు.
2 days ago | [YT] | 579
View 4 replies
VIBRANT AP
బెంగళూరులో జరిగిన పూజనీయ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ జీ 70వ జన్మదిన వేడుకలలో మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొనడం నా భాగ్యంగా మరియు గౌరవంగా భావిస్తున్నాను. నేటి వేగంగా మారుతున్న ప్రపంచంలో, ఆధ్యాత్మికత, అంతర్గత శాంతి మరియు మానవీయ విలువలు ఎన్నడూ లేనంతగా ఎంతో ముఖ్యమైనవి. గురుదేవ్ తన కరుణ, సామరస్యం మరియు సేవా సందేశాలతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. మానవాళికి సేవ చేసే ఈ గొప్ప ఆశయంలో ఆయనకు మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు నిరంతర విజయం లభించాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
6 days ago | [YT] | 861
View 6 replies
VIBRANT AP
పండుగలు, జాతరలు మన సంస్కృతీ సంప్రదాయాలకు సజీవ సాక్ష్యాలు. మన సాంస్కృతిక మూలాలను గౌరవిస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎప్పుడూ ఒక ప్రత్యేక సంతృప్తిని ఇస్తుంది. అందులో భాగంగానే, కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ తల్లి దేవాలయానికి భువనేశ్వరితో కలిసి వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించాను.
ప్రత్యేక పూజలు నిర్వహించి.. నా కుప్పం ప్రజలతో పాటు, ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అంతా మేలు జరిగేలా చూడమని ఆ జగన్మాతను ప్రార్థించాను. మన ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లోనూ దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలనే మా నిరంతర కృషికి, సంకల్పానికి ఆ గంగమ్మ తల్లి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. 🙏 నిరంతరం మీ సేవలో.. మీ చంద్రబాబు.
#KuppamGangammaJatara #ChandrababuNaidu #NaraBhuvaneshwari #APDevelopment #CultureAndTradition #AndhraPradesh
1 week ago (edited) | [YT] | 1,164
View 11 replies
VIBRANT AP
కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి దంపతులు తంజమ్మకొట్టాలు వద్ద ఆగారు. కల్లుగీత కార్మికులు తాటిముంజలు తీస్తుండగా కాన్వాయ్ను నిలిపి వారి వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు దంపతులు...ముంజలు తీసి ఇవ్వండి... రుచి చూస్తాం అని అడిగారు. కార్మికులు అందించిన తాజా తాటిముంజలను సీఎం దంపతులు రుచి చూశారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో ముఖ్యమంత్రి కాసేపు ఆత్మీయంగా సంభాషించారు. వారి పనితీరు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
#kuppam
#NaraBhuvaneswari
#ChandrababuNaidu
#AndhraPradesh
1 week ago | [YT] | 512
View 8 replies
VIBRANT AP
🛶 కృష్ణానదిపై వంద పడవల ప్రదర్శన.. సీఎం చంద్రబాబుకు మత్స్యకారుల అరుదైన కృతజ్ఞత! 🌊
‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద నిధులు విడుదల చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు మత్స్యకారులు సరికొత్తగా స్పందించారు.
కృష్ణానదిపై ఏకంగా 100 పడవలతో ర్యాలీగా ఉండవల్లి నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు వారికి ఆత్మీయ స్వాగతం పలికి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
📌 ముఖ్యాంశాలు:
అండగా ప్రజా ప్రభుత్వం: మత్స్యకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
ఏ కష్టం వచ్చినా తోడుగా: గంగపుత్రులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని, వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
గంగపుత్రులు చూపించిన ఈ అరుదైన కృతజ్ఞత, వారి అభిమానం నిజంగా వెలకట్టలేనిది! 🤝
#MatsyakarulaSevalo #AndhraPradesh #CMNCBN #FishermenWelfare #PeopleGovernment #VibrantAP
1 week ago (edited) | [YT] | 397
View 2 replies
Load more