Welcome to B1 Media YouTube Channel , your go-to space for sharp political insights and honest movie talk!
We dive deep into the headlines, break down political events, and review the latest films – from Tollywood blockbusters to thought-provoking documentaries.

💥 Expect:

* Unfiltered political commentary

* Film reviews & analysis

* News breakdowns & cultural critiques

* Smart debates, spicy takes, and no fluff

🎥 New videos every Day!
🎯 Real talk. Real stories. No spin.

📢 Join the conversation – subscribe and be part of a growing community that thinks critically and watches smart.

📧 Business inquiries & collaborations: [Your Email]
🌐 Follow us on [Your Social Media Links]


B1 Media

ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన 100 మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ జాబితాలో హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి చోటు దక్కించుకున్నారు.

దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష ప్రభావం చూపిన మహిళల్లో ఆమెను ఎంపిక చేశారు.

హెరిటేజ్ ఫుడ్స్ అభివృద్ధిలో ఆమె నాయకత్వం, రైతులతో నిర్మించుకున్న నమ్మకం, డైరీ రంగంలో తీసుకొచ్చిన ఆవిష్కరణలు, రైతుల జీవనోపాధి మెరుగుపర్చేందుకు చేసిన కృషిని గుర్తించి ఈ గౌరవం లభించింది.👏👏👏👏👏

#narabramini
#b1media

2 days ago | [YT] | 420

B1 Media

బనగానపల్లెలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించిన సీఎం. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ అధికారులు.

#PattadarPassbooks
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#b1media

3 days ago | [YT] | 586

B1 Media

దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో శాంసంగ్ సీనియర్ డైరెక్టర్ హెలెనా పార్క్, డైరెక్టర్ హీసూ యాంగ్, గ్లోబల్ సేల్స్ హెడ్ వీపీ జున్ పాల్గొన్నారు.

మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను శాంసంగ్‌కు భారతదేశంలో కీలక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు.

ప్రత్యేకంగా డేటా సెంటర్లు, సర్వర్ తయారీ, సర్వీసింగ్, ఏఐ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

ఏపీలో ఉన్న డేటా-సెంటర్ అవకాశాలను వినియోగించుకుని, రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.

#ChooseSpeedChooseAP
#JobCreatorInChiefLokesh
#LokeshinSouthKorea
#NaraLokesh
#b1media

5 days ago | [YT] | 470

B1 Media

కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శనివారం సందర్శించారు. నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జన నాయకుడు పోర్టల్ ద్వారా వచ్చిన అర్జీలను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజల నుంచి వినతలు అందుకున్నారు

#chandrababu #tdp #b1media

1 week ago | [YT] | 1,162

B1 Media

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించారు.

ఈ సందర్భంగా సున్నపురాళ్లపల్లిలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించారు. హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ ఫ్లోరింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి, రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిందాల్ సౌత్ వెస్ట్ సంస్థ అధినేత సజ్జన్ జిందాల్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పర్యటనకు ముందు పెద్దండ్లూరులోని శ్రీ బాలాత్రిపురసుందరి సమేత సుందరేశ్వరస్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

#chandrababu #kadapa #tdp #b1media

1 week ago | [YT] | 536

B1 Media

విశాఖపట్నం చేరుకున్న గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారితో కలిసి స్వాగతం పలికిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు అనిత, నారా లోకేష్.

#DroupadiMurmu
#NaraLokesh
#AndhraPradesh

1 week ago | [YT] | 973

B1 Media

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షల కోసం ముంబై చేరుకున్నారు.

కొంతకాలంగా భుజాల రొటేటర్ కఫ్ గాయంతో పాటు రెండు భుజాల కండరాలు చిట్లడంతో ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వైద్య పరీక్షల నిమిత్తం కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లనున్నారు.

ఈ సందర్భంగా ఆయన వెంట సతీమణి అన్నా కొణిదెల కూడా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

#pawankalyan #janasenaparty #annalezhneva #b1media

1 week ago | [YT] | 1,116

B1 Media

జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం క్యాంప్ కార్యాలయంలో శ్రీకారం చుట్టారు.

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన అనంతరం, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లలను ఎత్తుకుని కొంతసేపు ఆడిస్తూ వారి ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

"ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని" ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

#chandrababu #tdp #apnews #b1media

1 week ago | [YT] | 206

B1 Media

రాజధాని అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 112వ చిత్రం ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను అధికారికంగా ప్రారంభించారు.

బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత చెరుకూరి సుధాకర్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజు తదితర సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

అమరావతిలో జరిగిన ఈ గ్రాండ్ మూవీ లాంచ్ వేడుక సినీ, రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 🔥

#naralokesh #balakrishna #b1media

2 weeks ago | [YT] | 128

B1 Media

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.

ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

మంత్రి నారా లోకేష్ ఆలయ విశేషాలను తెలుసుకుని భక్తులతో కాసేపు ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు.
#naralokesh #tdp #b1media

2 weeks ago | [YT] | 635