DK Aruna Official

దేశం కోసం, సనాతన ధర్మం కోసం, సంస్కృతి పరిరక్షణ కోసం.. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధాని కావాలి. ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థిగా నేను విజయకేతనం ఎగిరేసేలా ప్రజలు ఆశీర్వదించాలి.

- లోక్ సభ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ



DK Aruna Official

హైదరాబాద్ పిర్జాదిగూడలో జర్నలిస్ట్ మన తొలివెలుగు రఘు  గారి కుమార్తె ఓణీ ఫంక్షన్ కు హాజరై, ఆ చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది.

1 month ago | [YT] | 18

DK Aruna Official

హైదరాబాద్ BMR సార్థ కన్వెన్షన్ లో జరిగిన అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ గారి కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసాను.

1 month ago | [YT] | 11

DK Aruna Official

హైదరాబాద్ పార్క్ హయత్ లో సినీ నటుడు బండ్ల గణేష్ గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. 

1 month ago | [YT] | 12

DK Aruna Official

SSC CBSC ఫలితాలలో జిల్లా మొదటి ర్యాంక్, రాష్ట్ర రెండవ ర్యాంకు సాధించిన గద్వాల జిల్లా వీరాపురం SR విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి మునీరుద్దిన్ ను సన్మానించడం జరిగింది. అనంతరం వివిధ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసాను. 
ఎస్.ఆర్ విద్యానికేతన్ విద్యార్థి మునీరుద్దీన్ రాష్ట్ర రెండవ ర్యాంక్ సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నా శుభాకాంక్షలు.
రాష్ట్రంలో రెండవ ర్యాంకు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి ర్యాంకు సాధించిన మునీరుద్దిన్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
విద్యార్థులను చదువులోనే కాకుండా.. వారికి ఆసక్తి ఉన్న రంగంలో రాణించేలా వారిని తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరుతున్నాను.
#DKAruna #SSCResults #Gadwal #JogulambaGadwalDistrict #MahabubnagarParliament

1 month ago | [YT] | 7

DK Aruna Official

ఈ రోజు గద్వాల పట్టణం కలెక్టరేట్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన "వారధి ఫ్యామిలీ రెస్టారెంట్" ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యాను. 
ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రెస్టారెంట్ లోని వంటకాలను రుచిచూసాను. చాలా బాగున్నాయి. కస్టమర్లకు   నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందించి, వారి ఆదరాభిమానాలు చూరగొనాలని, హోటల్ రంగంలో వారధి ఫ్యామిలీ రెస్టారెంట్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. 
వారధి ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని కృష్ణం రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#DKAruna #MPDKAruna #VaradhiFamilyRestaurant #Gadwal

1 month ago | [YT] | 16

DK Aruna Official

ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ తాజ్ కృష్ణలో జరిగిన సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై వారిని ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశాను.
#vijaydevarakonda #rashmikamandanna

3 months ago | [YT] | 36

DK Aruna Official

గూడెబెల్లూర్–మహబూబ్ నగర్ హైవే (NH-167) నాలుగు లేన్లుగా విస్తరించేందుకు క్యాబినెట్ సమావేశంలో పచ్చజెండా ఊపిన ప్రధాని మోదీ గారికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

80 కిలోమీటర్ల మేర జరిగే ఈ విస్తరణ పనులకు రూ. 3175 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 

నారాయణపేట, మహబూబ్ నగర్, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల అభివృద్ధికి ఈ హైవే ఎంతో ఊతమిస్తుంది. 

హైదరాబాద్–పణాజీ ఆర్థిక కారిడార్‌కు వేగవంతంలో కీలకంగా పనిచేస్తుంది. 

తెలంగాణ–కర్ణాటక ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుదలతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 

#narendramodi #hyderabadpanajicorridor #nh167 #roadsdevelopment #bjp4ind

4 months ago | [YT] | 29

DK Aruna Official

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం  అనంతరం శ్రీ మల్లిఖార్జున అన్నసత్ర సంఘం వారి ఆహ్వానం మేరకు టీజీ లక్ష్మి వెంకటేష్ భవన్ ను సందర్శించాను. 
ఈ సందర్భంగా నన్ను సాదరంగా ఆహ్వానించిన శ్రీ మల్లిఖార్జున అన్నసత్ర సంఘం అధ్యక్షులు మిడిదొడ్డి శ్యాంసుందర్ గారు, ప్రధాన కార్యదర్శి బలుస శ్రీరాములు గారు, ఉప్పల శ్రీధర్ గారికి ధన్యవాదాలు. 
టీజీ భవన్ లో శ్రీ మల్లిఖార్జున అన్నసత్ర సంఘం భక్తులకు అందిస్తున్న సేవలను కలియతిరిగి తెలుసుకున్నాను. 
వంటశాల, డైనింగ్ హాల్ పరిశుభ్రతకు ప్రత్యేక శ్రద్ధ చూపడం ఎంతో చక్కగా అనిపించింది.

4 months ago | [YT] | 23

DK Aruna Official

మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం అమరచింత మున్సిపాలిటీలో రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నాను. అమరచింత మున్సిపాలిటీలోని 10 వార్డులలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అమరచింత పట్టణ ప్రజలను కోరాను. 

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల అభివృద్ధి కోసం లక్షల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారు. అమరచింత మున్సిపాలిటీ అభివృద్ధికి అమృత్ పథకం కింద పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది కేంద్రం.

BRS పదేళ్లు పాలించింది. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చింది.

పేదలకు కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు.

2వేల పెన్షన్ 4వేలు చేస్తామని వృద్ధులకు హామీ అమలు చేయలేదు.

18 ఏళ్లు నిండిన ఆడపిల్లకు 2500 రూపాయలు ఇస్తామన్నారు.. ఇస్తున్నారా..?

ప్రభుత్వానికి మున్సిపాలిటీ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబితే.. కాంగ్రెస్ ను ఓడిస్తేనే పథకాలు అమలు అవుతాయి.

ఆడపిల్ల పెండ్లికి లక్షరూపాయలతో పాటు.. తులం బంగారం అన్నారు.. లక్ష రూపాయలకు కూడా దిక్కు లేదు.

నిరుద్యోగులకు 4వేల భృతి ఇవ్వలేదు.

జాబ్ క్యాలెండర్ మాటలకే పరిమితమైంది.

ఉద్యోగులకు PRC,DA లు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది.

భవిష్యత్ లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే.. ఈ ఎన్నికలే పునాదిగా అమరచింతలోని అన్ని వార్డులలో బీజేపీని గెలిపించండి. 

అమరచింత మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలి అంటే.. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులందరిని గెలిపించండి.
#dkaruna #mpdkaruna #municipalelections #voteforbjp #bjptelangana

4 months ago | [YT] | 28

DK Aruna Official

మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లా చౌక్ సెంటర్ వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించి..  నారాయణపేట ప్రజలు ప్రతి వార్డులో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరాను.

అమృత్ పథకం నిధులతో మున్సిపాలిటీలో డ్రైనేజీ, రోడ్లు, మంచి నీటి సరఫరా కోసం పెద్ద ఎత్తున నిధులు కేంద్రం ఇస్తుంది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి.. కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చే ప్రయత్నం ఇందిరమ్మ కమిటీల ద్వారా చేస్తున్నారు.

బీజేపీ గెలిస్తే.. ప్రతి పైసా అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయి.

కేంద్ర ప్రభుత్వం మహిళలకు రుణాలు, ముద్ర యోజన ద్వారా చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తుంది.

BRS, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి లక్షల కోట్లు ఇస్తుంది.

ధనిక దేశాలు భారతదేశాన్ని చూసి ఈర్ష పడుతున్నాయి.

2027 నాటికి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు పని చేస్తున్నారు.

నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరం బలపర్చాలి.

కాంగ్రెస్ 2500 రూపాయలు ప్రతి మహిళకు ఇవ్వలేదు.. వృద్ధులకు 4వేల పెన్షన్ పెంచలేదు.

రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులే లేవు. మంత్రులు వేసే శిలాఫలకాలు.. BRS నేతలు వేసిన మొండి శిలాఫలకాల మాదిరి మిగిలిపోతాయి.

కాంగ్రెస్ కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అంటే.. ఇక్కడ ఆరు గ్యారంటీలు అన్నారు.. ప్రజలను మోసం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిగా మరిపోయింది.

ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలి.. అభివృద్దిని అందించే బీజేపీని గెలిపించాలి.

4 months ago | [YT] | 23