Hi Friends
NOTE: మన Model Ideas YouTube Channel ను Subscribe చేసుకున్న
వారు అడిగే ప్రశ్నలను చదువుతూ
Next వీడియోలో Answer Explain చేయడం జరుగుతుంది.

This is Rajendhar Bondla, IMPACT Foundation Trainer, Soft Skills Trainer, Personality Development and Motivational Speaker.
This "Model Ideas YouTube Channel", is to guide you Government Jobs, Degree, PG, Professional Courses & "Career Guidance", to my Subscribers. It helps you in reaching your targeted Goals.
Please contact/text mail me for
1) Promotion of Your Business
2) Promotion of Your APPS
3) Promotion of Your Institutes
4) Promotion of Your Websites/YouTube Channels
Please follow me on:
Website: englishgururaj.com/
Instagram: www.instagram.com/modelideasy...
Telegram Link: t.me/rajo15
e-mail: rajavalmiki18@gmail.com
YouTube: model Ideas
Face Book: www.facebook.com/profile.php?...
Face Book Page: www.facebook.com/Model-Ideas-...
Twitter:https: twitter.com/BondlaRajendhar


Model Ideas

*🔊21 నుంచి ఎడ్‌సెట్, పీఈసెట్‌ కౌన్సెలింగ్‌*

*🍥రాష్ట్రంలో రెండేళ్ల బీఈడీతో పాటు బీపీఎడ్‌(బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌), డీపీఎడ్‌ సీట్ల భర్తీకి ఈ నెల 21 నుంచి వేర్వేరుగా కౌన్సెలింగ్‌ మొదలుకానుంది. ఇందుకు సంబంధించి మంగళవారం ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య ఐ.పాండురంగారెడ్డి తెలిపారు. ఎడ్‌సెట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 21-28 వరకు, పీఈసెట్‌కు 21-25 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్‌ ప్రక్రియ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎడ్‌సెట్‌కు ఆగస్టు 2-4 వరకు, పీఈసెట్‌కు 28-30వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. బీపీఎడ్, డీపీఎడ్‌ సీట్లను ఆగస్టు 2న, బీఈడీ సీట్లను ఆగస్టు 8న కేటాయిస్తామని కన్వీనర్‌ వెల్లడించారు.*

9 hours ago | [YT] | 0

Model Ideas

*💥DOST(DEGREE) Phase-III సీట్ల కేటాయింపు విడుదల*

*🏛️డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించే 'దోస్త్' మూడో విడత (Phase-III) సీట్ అలాట్మెంట్ విడుదల*

* సీటు పొందిన విద్యార్థులు 26.06.2026 నుంచి 02.07.2026 వరకు ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్ట్ చేయగలరు

*👉గమనిక:*
⭐PHASE -1, PHASE-2, PHASE-3 లలో సీటు పొందిన విద్యార్థులు 27.06.2026 నుంచి 04.07.2026 వరకు సంబంధిత కాళాశాలల్లో రిపోర్ట్ చేయగలరు.

* తరగతులు ప్రారంభం - 06.07.2026


*🌐షెడ్యూల్ వివరాలకు & Seat Allotment కోసం అధికారిక వెబ్‌సైట్ చూడగలరు👇*
dost.cgg.gov.in/allotScheduleDynamic.do

dost.cgg.gov.in/

2 weeks ago | [YT] | 0

Model Ideas

Hi everyone, welcome to my new YouTube Community! Now you can post on my channel, too. To get started, tell me in a post what you'd like to see next on my channel.
Visit my Community: youtube.com/@ModelIdeasRajendharBondla/community

1 month ago | [YT] | 5

Model Ideas

*🔊సాయంత్రం బీటెక్ కోర్సులు*

*🔶వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు సువర్ణావకాశం*

*🔷సాయంత్రం బీటెక్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల..రాష్ట్రవ్యాప్తంగా 12 కళాశాలల్లో 1,050 సీట్లు*


*🍥ఉద్యోగం చేస్తూనే ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేయాలనుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు అరుదైన అవకాశం లభించింది. డిప్లొమా పూర్తి చేసిన ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగుల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘బీఈ/బీటెక్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్’ కోర్సుల ప్రవేశాల కోసం టీజీ ఈసెట్-2026 (డబ్ల్యూపీ) నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసింది.2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు అప్పగించారు. ఈ మేరకు కన్వీనర్‌గా యూసీఈ(ఏ) ప్రిన్సిపాల్ ప్రొ. పైడిమర్రి చంద్రశేఖర్ వ్యవహరిస్తున్నారు. ఎఐసీటీఈ రెగ్యులర్ ప్రోగ్రాం ఉండి దానిలో 3వ వంతు ఇన్ టెక్ కు ఏఐసీటీఈ అనుమతిచ్చింది.*

*💥అర్హతలు*

*🌀అభ్యర్థులు డిప్లొమా ఉత్తీర్ణులై ఉండటంతోపాటు కనీసం సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి. ఉద్యోగ స్థలం లేదా నివాసం సంబంధిత కళాశాలకు 75 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. వయోపరిమితి లేదు. ఎఐసీటీఈ నిబంధనల ప్రకారం కోర్సు పూర్తి చేయడానికి 120 క్రెడిట్లు సాధించాల్సి ఉంటుంది.*

*💥12 కళాశాలల్లో 1,050 సీట్లు*

*💠రాష్ట్రంలో 12 కళాశాలకు ఈ కోర్సుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 12 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆరు విభాగాల్లో మొత్తం 1,050 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోనే 150 సీట్లు కేటాయించారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, మెటలర్జీ విభాగాల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.*

*💥పరీక్ష విధానం*

*🥏ప్రవేశ పరీక్ష ఓఎంఆర్ విధానంలో నిర్వహించనున్నారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో 90 మార్కులు సంబంధిత సబ్జెక్టుకు, 10 మార్కులు గణితానికి కేటాయించారు.పరీక్ష సమయం రెండు గంటలు.*

*💥కీలక తేదీలు*

*➡️దరఖాస్తుల చివరి తేదీ : జులై 18*

*➡️హాల్ టికెట్ల డౌన్‌లోడ్ : జులై 28*

*➡️ప్రవేశ పరీక్ష : ఆగస్టు 1, 2*

*➡️ఫలితాల విడుదల : ఆగస్టు 8*

*➡️కౌన్సెలింగ్ : ఆగస్టు మూడో వారం*

*➡️తరగతుల ప్రారంభం : సెప్టెంబర్ మొదటి వారం*

*💥వారాంతాలు, సాయంత్రం తరగతులు*

*🛟శనివారం, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. టీఎఫ్ఆర్‌‌సీ నిబంధనల ప్రకారమే ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, దరఖాస్తుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ www.tgecetwp.inను అందుబాటులో ఉంచినట్టు కన్వీనర్‌ తెలిపారు.*

*💥వర్కింగ్ ప్రొపెషనల్స్ ఇది సువర్ణ అవకాశం కన్వీనర్ ప్రొ. పైడిమర్రి చంద్రశేఖర్*

*💫డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగాల్లో ఉన్నవారు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఈ కోర్సులు ఎంతో ఉపయోగప డతాయి. ప్రస్తుతం పనిచేస్తున్న రంగాల్లో ప్రమోషన్స్ పొందటానికి ఈ బీటెక్ దోహదపడుతుంది. అడ్వాన్స్ సాఫ్ట్‌‌వేర్ టెక్నాలజీస్ అవగాహన పొందుతారు. వృత్తిపరంగా పురోగతి సాధించడంతో పాటు భవిష్యత్‌లో పీజీ, పీహెచ్‌డీ చదివే అవకాశాలు కూడా లభిస్తాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాలను కొనసాగిస్తూనే ఇంజినీరింగ్ డిగ్రీ సాధించేందుకు ఇది సువర్ణావకాశం. ఈ పరీక్ష‍ నిర్వహణ బాధ్యతలు ఓయూ చేపడుతోంది. అందుకు ఓయూ వీసీ ప్రొ. కుమార్ చొరవ కృషి ఉంది. ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఉన్నత విద్యామండలికి, ఓయూ వీసీకి కృతజ్ఞతలు.*

1 month ago | [YT] | 3

Model Ideas

*ఓయూ విద్యార్థులకు గుడ్ న్యూస్: వేసవి సెలవులు పొడిగింపు*

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని యూజీ, పీజీ కళాశాలలకు వేసవి సెలవులను మరో వారం రోజులు పొడిగిస్తూ ఓయూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.

తీవ్ర ఎండలు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో మే 31తో ముగియాల్సిన సెలవులను జూన్ 6 వరకు పొడిగించినట్లు వెల్లడించింది. జూన్ 8 (సోమవారం) నుంచి కళాశాలల్లో విద్యా కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్నాయి.

ఈ మేరకు క్యాంపస్, కాంస్టిట్యుయెంట్ మరియు అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఓయూ డిప్యూటీ రిజిస్ట్రార్ (అకాడెమిక్) సర్క్యులర్ జారీ చేశారు.

1 month ago | [YT] | 7

Model Ideas

*🔊చివరి ఏడాది విద్యార్థులకూ ప్రధానమంత్రి ఇంటర్న్షిప్*

*🔷ఎంపికైతే నెలకు రూ.9వేలు*

*🍥గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్(పీఎంఐఎస్)లో పాల్గొనవచ్చని కేంద్రం తెలిపింది. ఈ మేరకు అర్హత నిబంధనలు సడ లిస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధ వారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం.. 18-25 ఏళ్ల వయసున్న చివరి సంవత్సరం విద్యార్థులు పీఎం ఐఎస్ పోర్టల్ ద్వారా అగ్రశ్రేణి సంస్థల్లో పెయిడ్ ఇంట ర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి నెలకు కనీసం రూ.9వేల ఆర్థిక సాయం అందిస్తారు. దరఖాస్తు చేసుకొనేవారు తమ విద్యా సంస్థల నుంచి నిరభ్యంతర పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.*

2 months ago | [YT] | 5

Model Ideas

*తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల డైరెక్ట్ లింక్....*
👇👇👇👇👇

telanganams.cgg.gov.in/TGMSWEB20/#/

3 months ago | [YT] | 3

Model Ideas

*🔊డిగ్రీలో మళ్లీ సీట్ల కోత!.. 2 లక్షల వరకు తగ్గే అవకాశం*

*🔶రాష్ట్రంలో మొత్తం 4.4లక్షల సీట్లు*

*🔷సగం సీట్లు కూడా నిండని పరిస్థితి*

*🔶మూడో వారంలో దోస్త్‌ నోటిఫికేషన్‌*

*🔷సీట్లు తగ్గించిన తర్వాతే విడుదల*

*🍥రాష్ట్రంలో డిగ్రీ సీట్లకు మళ్లీ కోత పడబోతున్నది. ఒక్క ఫస్టియర్‌లోనే దాదాపు 2 లక్షల సీట్లు తగ్గనున్నాయి. అంటే సగం సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో 965 డిగ్రీ కాలేజీలు, 4,40,107 సీట్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో 2,05,140 సీట్లు(46శాతం) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఏకంగా 2,34,967 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే సగం సీట్లు కూడా నిండని పరిస్థితి. ఈ నెల 14లోపు ఇంటర్‌ ఫలితాలు విడుదలకానున్నాయి. మూడో వారంలో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. భర్తీకాని సీట్లను తగ్గించిన తర్వాతే దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. సోమవారం దోస్త్‌పై కీలక సమావేశం జరిగింది.*

*🌀ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, భర్తీకాని సీట్లను తగ్గించే అంశంపైనే చర్చ జరిగింది. అయితే, ఈ ఏడాది కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు 160 కాలేజీలు ఆసక్తి చూపించాయి. వీటికి అదనపు సీట్లు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న సీట్లను రద్దుచేసుకుంటేనే కొత్త సీట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇక జీరో అడ్మిషన్‌ కాలేజీలు, 15 మంది/15 శాతం అంతకంటే తక్కువ సీట్లు నిండిన కాలేజీలను కూడా పక్కనబెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు.*

*💥64 జీరో అడ్మిషన్‌ కాలేజీలు*

*💠ఉమ్మడి రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చారు. ఇంటర్‌ సెకండియర్‌లో ఏటా 3.3 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. కానీ, డిగ్రీ ఫస్టియర్‌లో4.4లక్షల సీట్లకు అనుమతిచ్చారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీలో చేరినవారు మినహా ఏటా రెండు లక్షల మంది మాత్రమే డిగ్రీలో చేరుతున్నారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో జీరో అడ్మిషన్‌ కాలేజీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. 2025-26 విద్యాసంవత్సరంలో 64 డిగ్రీ కాలేజీల్లో ఒక్కరు కూడా చేరలేదు. వీటిలో 63 ప్రైవేట్‌, ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉన్నది. యూనివర్సిటీల వారీగా తీసుకుంటే అత్యధికంగా కాకతీయ పరిధిలో 22, ఎంజీయూ పరిధిలో 14, ఉస్మానియా 13, పాలమూరు 5,శాతవాహన 2 ఉన్నాయి.*

*💥రూరల్‌ కాలేజీల్లో చేరట్లే..*

*🥏డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థుల ఆలోచనలు మారుతున్నాయి. రూరల్‌ కాలేజీల్లో చేరడం లేదు. ముఖ్యంగా అర్బన్‌, గ్రేటర్‌లోని కాలేజీల్లోనే చేరుతున్నారు. విద్యార్థులు ఎక్కువగా హైదరాబాద్‌ సహా పెద్ద నగరాల్లో చదివేందుకు ఇష్టపడుతున్నారు. పట్టణాల్లో చదివితే ఉన్నతస్థానాలు చేరవచ్చనే ఆలోచనతో విద్యార్థులు గ్రేటర్‌కు క్యూ కడుతున్నారు. జీరో అడ్మిషన్‌, సీట్లు నిండని కాలేజీలను పరిశీలిస్తే దాదాపు అన్ని గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఫలితంగా మండల, నియోజకవర ్గకేంద్రాల్లోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య తగ్గుతున్నది.*

3 months ago | [YT] | 1