సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
ఈ సందర్భంగా మాట్లాడుతూ..
2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు రూ. 2500 ఇస్తామని చెప్పి నిరుద్యోగులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది.
ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైగా కేసీఆర్ గారు మైనారిటీలకు ఇచ్చిన ప్రయోజనాలను సైతం రేవంత్ రెడ్డి ఆపేశాడు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు.. బాత్ కరోడో మే.. కామ్ పకోడో మే అన్నట్లుగా ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం శూన్యం.
ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ నిధులు రావడం లేదు. ఎస్సీ-ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ రెండున్నరేళ్ల పాలనలో ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి లబ్ధి కూడా జరగలేదు.
కేసీఆర్ గారి పాలనలో ఎంతో అభివృద్ధి జరిగింది. కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతంలోని పొలాలు పారాయి.
గతంలో మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏనాడైనా కోదాడకు గోదావరి జలాలను తీసుకురాగలిగారా?
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే ఎస్సారెస్పీ ఫేజ్-2 పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించాం.
ఎన్నికల్లో ఓడిపోయినా మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు. కానీ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రం కేవలం ఆన్లైన్ కే పరిమితమైంది.
అసలైన నాయకుడు ఎవరో ప్రజలు అర్థం చేసుకోవాలి.
పసలేని ఈ కాంగ్రెస్ పాలన ఎప్పుడెప్పుడు పోతుందా అని జనం ఎదురుచూస్తున్నారు.
ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ పాలన రావాలని బలంగా కోరుకుంటున్నారు.
కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు రైతుబంధు ఆపలేదు.
హమాలీలు దొరక్క వడ్ల కొనుగోళ్లు ఆగుతున్నాయంటే.. ఏకంగా బీహార్ నుంచి ప్రత్యేక రైళ్లలో కూలీలను తీసుకొచ్చి వడ్ల లోడ్లు దించిన గొప్ప నాయకుడు కేసీఆర్.
ఆనాడు కరోనా సమయంలో 93 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొన్న ఘనత కేసీఆర్ గారిది. ఈ యాసంగిలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని గొప్పలు చెప్పి.. ఇప్పటి వరకు కేవలం 17 లక్షల టన్నుల వడ్లను మాత్రమే కాంగ్రెస్ కొన్నది.
కరోనా మనుషుల ప్రాణాలు తీస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుపోసుకుంటోంది. ప్రతిక్షణం రైతులను ఏడిపిస్తోంది.
కాంగ్రెస్ పాలనలో రైతులకు అడుగడుగునా కష్టాలే. ఎరువు బస్తాల కష్టాలు, కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు.. ఆఖరికి పండిన వడ్లు అమ్ముకోవాలన్నా కష్టాలు తప్పడం లేదు.
యూరియా అమ్ముకోవడం చేతకాని ప్రభుత్వం.. మొన్నటి దాకా ఆన్లైన్ యాప్ లు పెట్టింది, ఇప్పుడు ఏకంగా యూరియా అమ్మకాల పైనే బ్యాన్ పెట్టి రైతులను గోస పెడుతోంది.
అస్తమానం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న రేవంత్ రెడ్డి.. ఒక్కసారైనా ఏసీ రూములు వదిలి వడ్ల కల్లాల దగ్గరికి వచ్చి రైతుల కష్టాలు వినాలి.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐకేపీ కేంద్రాలకు వెళ్లి రైతుల బాధలు చూడాలి.
అమాయకుడైన బీఆర్ఎస్ కార్యకర్త రాజేష్ ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా పొట్టనబెట్టుకుంది.
రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చాక ఆ లెక్కలన్నీ ముంగటేస్తాం, ప్రతి ఒక్కరి తాట తీస్తాం.
మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వడ్డీతో సహా చెల్లిస్తాం.
బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలో కూడా కచ్చితంగా మార్పు వస్తుంది.
ఇప్పటికే ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది, వచ్చేసారి కేసీఆర్ గారిని మళ్లీ గెలిపించుకుంటారు.
ఇప్పుడు రాష్ట్రం అంతటా వినిపిస్తున్నది ఒకటే నినాదం.. కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలె.
Harish Rao Thanneeru
ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.
12 hours ago | [YT] | 25
View 0 replies
Harish Rao Thanneeru
ఆ ఆంజనేయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🚩🙏
2 weeks ago | [YT] | 140
View 1 reply
Harish Rao Thanneeru
మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
2 weeks ago | [YT] | 71
View 0 replies
Harish Rao Thanneeru
*దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులతోనే అధికారుల కాళ్లు మొక్కిస్తున్న ఘనత ఈ రేవంత్ సర్కారుదే.*
*మాజీ మంత్రి బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు* 🔥
2 weeks ago | [YT] | 73
View 0 replies
Harish Rao Thanneeru
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
ఈ సందర్భంగా మాట్లాడుతూ..
2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు రూ. 2500 ఇస్తామని చెప్పి నిరుద్యోగులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది.
ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైగా కేసీఆర్ గారు మైనారిటీలకు ఇచ్చిన ప్రయోజనాలను సైతం రేవంత్ రెడ్డి ఆపేశాడు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు.. బాత్ కరోడో మే.. కామ్ పకోడో మే అన్నట్లుగా ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం శూన్యం.
ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ నిధులు రావడం లేదు. ఎస్సీ-ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ రెండున్నరేళ్ల పాలనలో ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి లబ్ధి కూడా జరగలేదు.
కేసీఆర్ గారి పాలనలో ఎంతో అభివృద్ధి జరిగింది. కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతంలోని పొలాలు పారాయి.
గతంలో మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏనాడైనా కోదాడకు గోదావరి జలాలను తీసుకురాగలిగారా?
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే ఎస్సారెస్పీ ఫేజ్-2 పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించాం.
ఎన్నికల్లో ఓడిపోయినా మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు. కానీ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రం కేవలం ఆన్లైన్ కే పరిమితమైంది.
అసలైన నాయకుడు ఎవరో ప్రజలు అర్థం చేసుకోవాలి.
పసలేని ఈ కాంగ్రెస్ పాలన ఎప్పుడెప్పుడు పోతుందా అని జనం ఎదురుచూస్తున్నారు.
ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ పాలన రావాలని బలంగా కోరుకుంటున్నారు.
కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు రైతుబంధు ఆపలేదు.
హమాలీలు దొరక్క వడ్ల కొనుగోళ్లు ఆగుతున్నాయంటే.. ఏకంగా బీహార్ నుంచి ప్రత్యేక రైళ్లలో కూలీలను తీసుకొచ్చి వడ్ల లోడ్లు దించిన గొప్ప నాయకుడు కేసీఆర్.
ఆనాడు కరోనా సమయంలో 93 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొన్న ఘనత కేసీఆర్ గారిది. ఈ యాసంగిలో 90
లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని గొప్పలు చెప్పి.. ఇప్పటి వరకు కేవలం 17 లక్షల టన్నుల వడ్లను మాత్రమే కాంగ్రెస్ కొన్నది.
కరోనా మనుషుల ప్రాణాలు తీస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుపోసుకుంటోంది. ప్రతిక్షణం రైతులను ఏడిపిస్తోంది.
కాంగ్రెస్ పాలనలో రైతులకు అడుగడుగునా కష్టాలే. ఎరువు బస్తాల కష్టాలు, కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు.. ఆఖరికి పండిన వడ్లు అమ్ముకోవాలన్నా కష్టాలు తప్పడం లేదు.
యూరియా అమ్ముకోవడం చేతకాని ప్రభుత్వం.. మొన్నటి దాకా ఆన్లైన్ యాప్ లు పెట్టింది, ఇప్పుడు ఏకంగా యూరియా అమ్మకాల పైనే బ్యాన్ పెట్టి రైతులను గోస పెడుతోంది.
అస్తమానం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న రేవంత్ రెడ్డి.. ఒక్కసారైనా ఏసీ రూములు వదిలి వడ్ల కల్లాల దగ్గరికి వచ్చి రైతుల కష్టాలు వినాలి.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐకేపీ కేంద్రాలకు వెళ్లి రైతుల బాధలు చూడాలి.
అమాయకుడైన బీఆర్ఎస్ కార్యకర్త రాజేష్ ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా పొట్టనబెట్టుకుంది.
రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చాక ఆ లెక్కలన్నీ ముంగటేస్తాం, ప్రతి ఒక్కరి తాట తీస్తాం.
మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వడ్డీతో సహా చెల్లిస్తాం.
బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలో కూడా కచ్చితంగా మార్పు వస్తుంది.
ఇప్పటికే ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది, వచ్చేసారి కేసీఆర్ గారిని మళ్లీ గెలిపించుకుంటారు.
ఇప్పుడు రాష్ట్రం అంతటా వినిపిస్తున్నది ఒకటే నినాదం.. కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలె.
3 weeks ago | [YT] | 131
View 0 replies
Harish Rao Thanneeru
కార్మిక, కర్షక, కష్టజీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
3 weeks ago | [YT] | 210
View 2 replies
Harish Rao Thanneeru
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్..
పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు బహిరంగ లేఖ.
4 weeks ago | [YT] | 117
View 2 replies
Harish Rao Thanneeru
తెలంగాణ సాగునీటి రంగానికి ఆర్. విద్యాసాగర్ రావు గారి సేవలు అనిర్వచనీయం..
ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము.
4 weeks ago | [YT] | 114
View 1 reply
Harish Rao Thanneeru
నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక,
సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక,
పదేళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక,
తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక,
ప్రజల విశ్వాసానికి ప్రతీక, ప్రజా ఉద్యమ పతాక.. భారత రాష్ట్ర సమితి 26 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
పాపపు పాలనలో ప్రజల జీవితాలు నలిగిపోతున్న వేళ, ప్రజల గుండెల్లో మార్మోగుతున్నది ఒక్కటే నినాదం..
సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచకం తాండవం చేస్తున్న కాలంలో వినిపిస్తున్నది ఒక్కటే ఆవాజ్..
"రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి”
ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా
ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్ఎస్.
పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి మన బీఆర్ఎస్.
గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదు,
నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదు.
జై తెలంగాణ,
జై కేసీఆర్,
జై బీఆర్ఎస్.
1 month ago (edited) | [YT] | 111
View 0 replies
Harish Rao Thanneeru
2 years ago | [YT] | 20
View 0 replies