మూడు నెలలు ఇరిగేషన్ శాఖ నాకప్పగించు.. నీళ్లు తేకపోతే రాజకీయ సన్యాసం చేస్తా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్.
లక్ష క్యూసెక్కుల వరద ఉన్నా మోటార్లు ఎందుకు ఆన్ చేయరు? సమ్మక్క బ్యారేజి వద్ద పుష్కలంగా నీళ్లున్నా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెరువులు ఎండిపోతున్నా రైతుల నోట్లో మట్టికొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవని చెప్పింది CWC.. అనుమతి ఆపింది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. 152 మీటర్లకు కాంగ్రెస్ అనుమతి తెచ్చినట్లు ఒక్క లెటర్ చూపించినా వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.
7 వేల కోట్లు కొట్టుకుపోయిన పోలవరం సీఈఓనే.. ఇక్కడ NDSA కమిటీ చైర్మనా? పోలవరంలో వేల కోట్ల నష్టం జరిగితే కళ్లు మూసుకున్న కేంద్రం, కరెక్ట్గా ఎన్నికల ముందే మేడిగడ్డపై రిపోర్టులు ఇప్పించడం రాజకీయ కుట్ర కాదా?
15 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని నిలబడ్డ కాళేశ్వరం. కానీ, మీ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలోనే సుంకిశాల గోడలు కూలాయి, వట్టెం పంప్ హౌస్ మునిగింది, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది.
కాళేశ్వరం అంటే కేవలం ఒక్క మేడిగడ్డ కాదు 3 బ్యారేజీలు, 21 పంప్ హౌజ్లు, 15 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టన్నెల్స్తో నిర్మించిన మహాద్భుతం. అబద్ధాల పవర్ పాయింట్లతో ప్రాజెక్టును బద్నాం చేయడం మానుకోవాలి.
సిద్దిపేట జిల్లా కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రి లో ' గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ' కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..
✳️ఈ చిన్నారులకు మళ్ళీ ప్రాణం పోసి పునర్జన్మ కల్పించిన మా వైద్యులకు, ఈ ఆసుపత్రిలో ఎంతో అంకితభావంతో, ప్రేమతో, సహనంతో, ఓర్పుతో చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్న వైద్య బృందానికి, సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు.
✳️నిజంగా శ్రీనివాస్ గారి గురించి నేను పొగడటానికి మాట్లాడటం లేదు. నా హృదయం నుంచి వచ్చిన మాట ఒక్కటే చెబుతున్నాను. శ్రీనివాస్ గారు మనకు కనిపించే దేవుడు.
✳️దేవాలయంలో కనిపించని దేవుడిని మనం ప్రార్థిస్తాం. మన కష్టాలు తొలగించాలని, మన బాధలు దూరం చేయాలని చేతులు జోడించి వేడుకుంటాం. కానీ శ్రీనివాస్ గారు ఈ ఆసుపత్రి ద్వారా ప్రతి సంవత్సరం వేలాది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. చిన్నారుల కళ్లలో ఆనందాన్ని, తల్లిదండ్రుల కళ్లలో ఆశను చూస్తుంటే నిజంగా నా హృదయం ఆనందంతో నిండిపోతుంది.
✳️ప్రతి సంవత్సరం సుమారు ఆరు వేల మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, వైద్యసేవలు అందిస్తూ వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించడం సాధారణ విషయం కాదు.
✳️ఇది శ్రీనివాస్ గారి అంకితభావానికి, సత్యసాయి బాబా ఆశీర్వాదాలకు నిదర్శనం. అందుకే నేను ఆయనను కనిపించే దేవుడు అని అంటాను.
✳️ఉదయం నుంచి రాత్రి వరకు ఈ సేవా కార్యక్రమాల కోసమే ఆయన తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. Charity begins at home అనే మాటను ఆచరణలో చూపిస్తూ, ఎవరో విరాళం ఇస్తే సేవ చేయడం కాదు, తన సొంత సంపాదనను ఖర్చు చేస్తూ, ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ఈ ఆసుపత్రిని విజయవంతంగా నడిపిస్తున్నారు.
✳️ఈరోజు మనం చిన్నారుల, తల్లిదండ్రుల మాటలు విన్నాం. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కుటుంబం మాట విన్నాం. ఒడిశా నుంచి వచ్చిన కుటుంబం అనుభవం విన్నాం. వారి కళ్లలో కనిపించిన ఆనందం, కృతజ్ఞత, నమ్మకం ఈ ఆసుపత్రి చేస్తున్న సేవలకు గొప్ప నిదర్శనం.
✳️మనం ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి చూస్తూ ఉంటాం. కానీ అంతే నీట్నెస్, అంతే కేర్, అంతే ప్రేమ, అంతే మంచి ట్రీట్మెంట్ నిజంగా అక్కడ అందిస్తున్నారు.
✳️మన దగ్గర చికిత్స పొందిన ఒక తండ్రి మాట విన్నాం. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లోని పలాస నుంచి వచ్చిన వారి మాట విన్నాం. మన సిద్ధిపేటకు చెందిన చిన్నారి కూడా ఇక్క ఉన్నాడు. ఇలా ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వైద్యం పొందడం నిజంగా చాలా ఆనందంగా ఉంది.
✳️ఇందులో మనమందరం నేర్చుకోవాల్సిన విషయం ఒక్కటే. ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడడం కాదు. భగవంతుడు మనకు ఈ గొప్ప మానవ జన్మను ఇచ్చినందుకు, మనం కూడా మనకు తోచినంతగా తోటివారికి సహాయం చేయాలి, సహకారం అందించాలి.
✳️అలాంటి సేవాభావాన్ని ఈ ఆసుపత్రిని చూసి, ఇక్కడ జరుగుతున్న సేవలను చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
✳️నిజంగా నాకు కూడా ప్రతిసారి ఒక అనుభూతి కలుగుతుంది. ఇది నేను నాలుగోసారి ఈ ఆసుపత్రికి వచ్చి చిన్నారులను, వారి కుటుంబాలను కలుస్తున్నాను. ప్రతి సారి సర్జరీ పూర్తయి ఆరోగ్యంగా బయటకు వస్తున్న ఆ పిల్లలను చూసినప్పుడు నా గుండె ఉప్పొంగిపోతుంది.
✳️మనం చేసిన ఒక చిన్న ప్రయత్నం సమాజానికి ఉపయోగపడుతుంటే, అంతకంటే గొప్ప ఆనందం ఇంకేముంటుంది?
✳️జీవితంలో మనం ఎంత పెద్ద పదవులు అలంకరించాం, ఎంత ఆస్తి సంపాదించాం అనేది కాదు. ఎంత పెద్ద పరిశ్రమలు స్థాపించాం, ఎంత ఆస్తి సంపాదించాం అనేది కాదు.
✳️చివరికి శాశ్వతంగా నిలిచేది మనం చేసిన సేవ, మనం చేసిన మంచి పని మాత్రమే. వ్యక్తులు వస్తారు, వెళ్తారు. But work remains. మనం చేసిన మంచి పని ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
✳️అందుకే నేను ప్రతి సంవత్సరం ఈ ఆసుపత్రికి వస్తుంటాను. ఇక ముందు కూడా వస్తాను.
✳️ఈ ఆసుపత్రి చేసే సేవకు మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. నా ఏడాది జీతం ఈ ట్రస్ట్ కు అందిస్త.
✳️సత్యసాయి సంజీవని ఆసుపత్రి కేవలం ఒక ఆసుపత్రి కాదు, వేలాది కుటుంబాలకు ఇది ఒక దేవాలయం. This is a temple. ఎందుకంటే ఇక్కడ వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారు.
✳️అప్పుడే పుట్టిన చిన్నారికి గుండెలో రంధ్రం ఉందని, గుండె సమస్య ఉందని తెలిసిన క్షణంలో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతాయి. బిడ్డ పుట్టిందనే ఆనందం ఒక్కసారిగా ఆందోళనగా మారిపోతుంది. అలాంటి సమయంలో ఈ ఆసుపత్రి ఆ చిన్నారికి వైద్యం చేసి ప్రాణం పోస్తుంది.
✳️నా దృష్టిలో ఈ ఆసుపత్రి ఒక చిన్నారి గుండెను మాత్రమే కాపాడదు. మూడు గుండెలను కాపాడుతుంది. ఒకటి ఆ చిన్నారి గుండె. రెండోది ఆ తల్లి గుండె. మూడోది ఆ తండ్రి గుండె.
✳️బిడ్డకు ప్రాణం పోయగానే తల్లిదండ్రుల జీవితాల్లో కూడా ఆశ, ధైర్యం, ఆనందం తిరిగి వస్తాయి. అందుకే నేను చెబుతున్నాను… ఈ ఆసుపత్రి మూడు గుండెలను కాపాడుతోంది.
✳️ఈరోజు 500వ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేయడం నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇది గొప్ప రోజు. ఈ సందర్భంగా వైద్య బృందం మొత్తానికి హృదయపూర్వక అభినందనలు.
✳️విజయ్ దేవరకొండ గారు సాధారణంగా విజయం వచ్చిన తర్వాత కొందరిలో గర్వం వస్తుంది. వారి ఆలోచనల్లో మార్పు వస్తుంది. ప్రవర్తనలో మార్పు వస్తుంది. కానీ విజయ్ లో నేను చూసింది మాత్రం రాలేదు. ఎంత ఎదిగితే అంత ఒదిగే మనసు.
✳️విజయ్ గారు కేవలం విజయవంతమైన సినీ నటుడు మాత్రమే కాదు. మంచి మనసున్న వ్యక్తి కూడా. కరోనా సమయంలో వేలాది మందికి అండగా నిలిచారు. అంతేకాదు, తన కుటుంబం తండ్రి గారి పేరుతో ఎంతోమంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తూ వారి చదువుకు తోడ్పాటు అందిస్తున్నారు.
✳️విజయ్ సత్యసాయి లోనే చదువుకున్నాడు అందుకే ఆయన ఈ సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారు.
✳️సత్యసాయి సంజీవని ఆసుపత్రి చేస్తున్న ఈ మహోన్నత సేవకు ఆయన అందిస్తున్న సహకారం కూడా ఎంతో ప్రశంసనీయం.
✳️అలాంటి సంస్థకు మనందరం తోడుగా నిలవాలి. ఇక్కడి స్థానికులు మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహకరించాలి.
✳️నిజంగా ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే. కానీ ఒక విషయం మాత్రం చెప్పాలి. శ్రీనివాస్ గారు తన జీవితాన్నే ఈ సేవకు అంకితం చేశారు. వేలాది చిన్నారుల కోసం, వారి కుటుంబాల కోసం తన జీవితాన్ని ధారపోశారు. అలాంటి వ్యక్తికి మనమందరం కృతజ్ఞతలు చెప్పాలి, అభినందించాలి.
✳️ఇక్కడ చికిత్స పొందుతున్న పిల్లలు ఏ మతానికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా ఎలాంటి తేడా లేకుండా సమానమైన ప్రేమతో, సేవాభావంతో వైద్యం అందిస్తున్నారు. అదే ఈ సంస్థ గొప్పతనం.
✳️ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇది వెలకట్టలేని అనుభూతి. ఒక చిన్నారి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడం కంటే గొప్ప సంతోషం మరొకటి ఉండదు.
✳️మన సిద్దిపేట గడ్డపై ఇలాంటి సేవా సంస్థ ఉండటం మనందరికీ గర్వకారణం.
✳️ఈ సేవా మరింత విస్తరించాలని, ఇంకా వేలాది మంది చిన్నారులకు జీవం పోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
✳️మరోసారి శ్రీనివాస్ గారికి, వైద్య బృందానికి, ఈ సేవలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు
సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం, సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, మంత్రుల అబద్ధాలను ఎండగట్టారు.
*చీము, నెత్తురు ఉంటే మంత్రి జూపల్లి రాజీనామా చేయాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
సింగరేణి కోల్ మైన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఆర్పీ, పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారుల ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
చరిత్రలో తొలిసారి సింగరేణి అధికారులు సమ్మె బాట పట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కనీసం చీమకుట్టినట్లు కూడా లేదు.
అధికారుల 'పీఆర్పీ' ఆపేసి బొగ్గు ఉత్పత్తిని పడగొట్టారు.. కరెంటు ప్లాంట్లు మూతవేసి బయట విద్యుత్ కొనుగోళ్లకు తెరలేపారు.
సింగరేణిలో పారదర్శక బదిలీలకు పాతరేశారు.. పోస్టింగ్ల పేరుతో పైరవీకారులు, బ్రోకర్లకు అడ్డాగా మారింది.
తక్షణమే పీఆర్పీ బకాయిలు చెల్లించి, కోల్ ఇండియా తరహాలో 'పే-అప్గ్రేడేషన్' అమలు చేయాలి.
జడ్చర్లలోని వాసవి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు, SIR అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు.
మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్...
* తెలంగాణ కోసం రాజీనామా చెయ్యమంటే జిరాక్స్ కాయితం ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది. * 2009లో కూటమిలో భాగంగా లక్ష్మారెడ్డి గారికి టికెట్ రాకపోయినా పార్టీకోసం నిబద్దతతో పని చేసి కేసీఆర్ గారిని ఎంపీగా గెలిపించడానికి కృషి చేసిన నిజాయితీ గల నాయకుడు. * రేవంత్ రెడ్డి గారు ఉద్యమం గురించి, త్యాగాల గురించి మాట్లాడుతుంటే నవ్వి పోదురు గాక నాకేం సిగ్గు అన్నట్టు ఉంది ఆయన తీరు. * పాలమూరు ప్రజల జోష్ చేస్తుంటే బీఆర్ఎస్ మళ్ళీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం ఉంది. * రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో రైతు ఆశీర్వాద సభ అని పెడుతున్నాడు. అది రైతు ఆశీర్వాద సభ కాదు రైతుల వంచన సభ. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి రైతును వంచించుతూనే ఉన్నాడు. * యాసంగి రైతు బంధు ఎగొట్టి ఇప్పుడు మల్ల వానాకాలం రైతు బంధు వేస్తానని మోసం చేస్తున్నాడు. * రైతు రుణమాఫీ అన్నారు రెండు లక్షలు కాదు కదా లక్ష లోపు ఉన్నవాళ్లకు కూడా చెయ్యలేదు. * నిన్న నల్గొండలో ఒట్టేసి చెప్తున్నా మూసి ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు. ఆ ఒట్టు అనేదానికి ప్రాణం ఉంటే ఈ రేవంత్ రెడ్డి అబద్ధాలకు ఉరేసుకొని ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేది. * కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చెయ్యకుండా దేవుళ్ళనే మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి * పాలమూరు బిడ్డలు స్వచ్ఛమైన పాలలాంటి మనుసున్న బిడ్డలు. రేవంత్ రెడ్డి జూట మాటలు, బట్టెబాజ్ మాటలతో పాలమూరు పరువు తీస్తున్నాడు. * ఎన్నికల్లో మాట ఇచ్చి తప్పిన మనిషి రేవంత్ రెడ్డి. హామీ ఇవ్వక పోయినా ప్రజలకు కావాల్సింది అర్ధం చేసుకొని రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ * రైతు బంధు పేరిట 29 వేల 300 కోట్ల రూపాయలు రైతులకు బాకీపడ్డ రేవంత్ రెడ్డి.
తెలంగాణ గర్వించే బిడ్డగా, అత్యుత్తమ పరిపాలనాదక్షుడిగా, భారత ప్రధానిగా దేశానికి అమూల్యమైన సేవలు అందించిన భారతరత్న పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ నివాళి.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు గారి ప్రెస్ మీట్.
తన రాజకీయ గురువుకు 'గురుదక్షిణ'గా రాష్ట్ర జలహక్కులను తాకట్టు పెడుతున్న రేవంత్.. తెలంగాణను ముంచే 'ముంపు మేస్త్రి'గా మారాడు..
నదీ జలాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి అజ్ఞానం.. నేడు తెలంగాణకు మరణ శాసనంగా మారింది.
కేసీఆర్ గారు పోరాడి సాధించిన ప్రాజెక్టుల అనుమతులను గాలికి వదిలేసి.. తన రాజకీయ స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నాడు..
కర్ణాటక, ఏపీ అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణను ముంచుతుంటే.. అడ్డుకోవాల్సిన సీఎం వారితో కలిసి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేట.
మంత్రి ఉత్తమ్ను బయటపెట్టి.. ఏపీ అధికారితో సీక్రెట్ మీటింగ్ లో ముగ్గురు సీఎంలు చేసుకున్న ఆ 'చీకటి ఒప్పందం' ఏంటో రేవంత్ బయటపెట్టాలి..
నదుల అనుసంధానం పేరిట ఏపీ జలదోపిడీకి రెడ్ కార్పెట్ వేస్తూ.. తెలంగాణ సమ్మక్క సాగర్ ప్రాజెక్టును రేవంత్ బలిపెడుతున్నాడు.
Harish Rao Thanneeru
షాబాద్ హంతకుడికి, రేవంత్ రెడ్డికి తేడా లేదు.. సీఎంపై డీజీపీ కేసు నమోదు చేయాలి.
కాంగ్రెస్ నేత 20 లక్షలు తీసుకుని కాపాడటం వల్లే షాబాద్ లో ఆరుగురి ఊచకోత.
కమీషన్ల కక్కుర్తితో విద్యార్థులకు పుస్తకాలు బంద్.. బసవేశ్వర ప్రాజెక్టు బంద్.
ముఖ్యమంత్రికి దమ్ముంటే నారాయణఖేడ్ సమస్యలపై సమాధానం చెప్పాలి.
త్వరలో బసవేశ్వర విగ్రహం నుంచి సంగమేశ్వర వరకు భారీ పాదయాత్ర.
1 day ago | [YT] | 255
View 2 replies
Harish Rao Thanneeru
రైతులు నీళ్లు అడిగితే రక్తం అడుగుతావా?.. షాబాద్ హంతకుడికి, నీకు తేడా ఏముంది రేవంత్ రెడ్డి..
68 లక్షల నుంచి 2.60 కోట్ల టన్నుల వరి దిగుబడి ముమ్మాటికీ కేసీఆర్ ఘనతే.
ఏడు వేల కోట్లతో పోలవరాన్ని ముంచిన అధికారులతో.. మేడిగడ్డపై రిపోర్టులా
పట్టిసీమకు నీళ్లు వదిలేసి.. గురువు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ
నీ ఈగో కోసం మోటార్లు ఆపితే.. థర్మల్ పవర్ ప్లాంట్లు ఆగిపోయి రాష్ట్రం అంధకారం కావడం ఖాయం.
నన్ను జైల్లో వేసినా సరే.. నా ప్రాణం పోయినా సరే.. వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులను కాపాడండి.
- మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
2 days ago | [YT] | 248
View 1 reply
Harish Rao Thanneeru
మూడు నెలలు ఇరిగేషన్ శాఖ నాకప్పగించు.. నీళ్లు తేకపోతే రాజకీయ సన్యాసం చేస్తా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్.
లక్ష క్యూసెక్కుల వరద ఉన్నా మోటార్లు ఎందుకు ఆన్ చేయరు? సమ్మక్క బ్యారేజి వద్ద పుష్కలంగా నీళ్లున్నా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెరువులు ఎండిపోతున్నా రైతుల నోట్లో మట్టికొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవని చెప్పింది CWC.. అనుమతి ఆపింది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. 152 మీటర్లకు కాంగ్రెస్ అనుమతి తెచ్చినట్లు ఒక్క లెటర్ చూపించినా వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.
7 వేల కోట్లు కొట్టుకుపోయిన పోలవరం సీఈఓనే.. ఇక్కడ NDSA కమిటీ చైర్మనా? పోలవరంలో వేల కోట్ల నష్టం జరిగితే కళ్లు మూసుకున్న కేంద్రం, కరెక్ట్గా ఎన్నికల ముందే మేడిగడ్డపై రిపోర్టులు ఇప్పించడం రాజకీయ కుట్ర కాదా?
15 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని నిలబడ్డ కాళేశ్వరం. కానీ, మీ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలోనే సుంకిశాల గోడలు కూలాయి, వట్టెం పంప్ హౌస్ మునిగింది, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది.
కాళేశ్వరం అంటే కేవలం ఒక్క మేడిగడ్డ కాదు 3 బ్యారేజీలు, 21 పంప్ హౌజ్లు, 15 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టన్నెల్స్తో నిర్మించిన మహాద్భుతం. అబద్ధాల పవర్ పాయింట్లతో ప్రాజెక్టును బద్నాం చేయడం మానుకోవాలి.
6 days ago | [YT] | 414
View 0 replies
Harish Rao Thanneeru
సిద్దిపేట జిల్లా కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రి లో ' గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ' కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ..
✳️ఈ చిన్నారులకు మళ్ళీ ప్రాణం పోసి పునర్జన్మ కల్పించిన మా వైద్యులకు, ఈ ఆసుపత్రిలో ఎంతో అంకితభావంతో, ప్రేమతో, సహనంతో, ఓర్పుతో చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్న వైద్య బృందానికి, సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు.
✳️నిజంగా శ్రీనివాస్ గారి గురించి నేను పొగడటానికి మాట్లాడటం లేదు. నా హృదయం నుంచి వచ్చిన మాట ఒక్కటే చెబుతున్నాను. శ్రీనివాస్ గారు మనకు కనిపించే దేవుడు.
✳️దేవాలయంలో కనిపించని దేవుడిని మనం ప్రార్థిస్తాం. మన కష్టాలు తొలగించాలని, మన బాధలు దూరం చేయాలని చేతులు జోడించి వేడుకుంటాం. కానీ శ్రీనివాస్ గారు ఈ ఆసుపత్రి ద్వారా ప్రతి సంవత్సరం వేలాది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. చిన్నారుల కళ్లలో ఆనందాన్ని, తల్లిదండ్రుల కళ్లలో ఆశను చూస్తుంటే నిజంగా నా హృదయం ఆనందంతో నిండిపోతుంది.
✳️ప్రతి సంవత్సరం సుమారు ఆరు వేల మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, వైద్యసేవలు అందిస్తూ వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించడం సాధారణ విషయం కాదు.
✳️ఇది శ్రీనివాస్ గారి అంకితభావానికి, సత్యసాయి బాబా ఆశీర్వాదాలకు నిదర్శనం. అందుకే నేను ఆయనను కనిపించే దేవుడు అని అంటాను.
✳️ఉదయం నుంచి రాత్రి వరకు ఈ సేవా కార్యక్రమాల కోసమే ఆయన తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. Charity begins at home అనే మాటను ఆచరణలో చూపిస్తూ, ఎవరో విరాళం ఇస్తే సేవ చేయడం కాదు, తన సొంత సంపాదనను ఖర్చు చేస్తూ, ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ఈ ఆసుపత్రిని విజయవంతంగా నడిపిస్తున్నారు.
✳️ఈరోజు మనం చిన్నారుల, తల్లిదండ్రుల మాటలు విన్నాం. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కుటుంబం మాట విన్నాం. ఒడిశా నుంచి వచ్చిన కుటుంబం అనుభవం విన్నాం. వారి కళ్లలో కనిపించిన ఆనందం, కృతజ్ఞత, నమ్మకం ఈ ఆసుపత్రి చేస్తున్న సేవలకు గొప్ప నిదర్శనం.
✳️ఇలాంటి మహోన్నత సేవను అందిస్తున్న శ్రీనివాస్ గారికి, వైద్యులకు, నర్సులకు, సిబ్బందికి మరోసారి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు.
✳️మనం ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి చూస్తూ ఉంటాం. కానీ అంతే నీట్నెస్, అంతే కేర్, అంతే ప్రేమ, అంతే మంచి ట్రీట్మెంట్ నిజంగా అక్కడ అందిస్తున్నారు.
✳️మన దగ్గర చికిత్స పొందిన ఒక తండ్రి మాట విన్నాం. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లోని పలాస నుంచి వచ్చిన వారి మాట విన్నాం. మన సిద్ధిపేటకు చెందిన చిన్నారి కూడా ఇక్క ఉన్నాడు. ఇలా ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వైద్యం పొందడం నిజంగా చాలా ఆనందంగా ఉంది.
✳️ఇందులో మనమందరం నేర్చుకోవాల్సిన విషయం ఒక్కటే. ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడడం కాదు. భగవంతుడు మనకు ఈ గొప్ప మానవ జన్మను ఇచ్చినందుకు, మనం కూడా మనకు తోచినంతగా తోటివారికి సహాయం చేయాలి, సహకారం అందించాలి.
✳️అలాంటి సేవాభావాన్ని ఈ ఆసుపత్రిని చూసి, ఇక్కడ జరుగుతున్న సేవలను చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
✳️నిజంగా నాకు కూడా ప్రతిసారి ఒక అనుభూతి కలుగుతుంది. ఇది నేను నాలుగోసారి ఈ ఆసుపత్రికి వచ్చి చిన్నారులను, వారి కుటుంబాలను కలుస్తున్నాను. ప్రతి సారి సర్జరీ పూర్తయి ఆరోగ్యంగా బయటకు వస్తున్న ఆ పిల్లలను చూసినప్పుడు నా గుండె ఉప్పొంగిపోతుంది.
✳️మనం చేసిన ఒక చిన్న ప్రయత్నం సమాజానికి ఉపయోగపడుతుంటే, అంతకంటే గొప్ప ఆనందం ఇంకేముంటుంది?
✳️జీవితంలో మనం ఎంత పెద్ద పదవులు అలంకరించాం, ఎంత ఆస్తి సంపాదించాం అనేది కాదు.
ఎంత పెద్ద పరిశ్రమలు స్థాపించాం, ఎంత ఆస్తి సంపాదించాం అనేది కాదు.
✳️చివరికి శాశ్వతంగా నిలిచేది మనం చేసిన సేవ, మనం చేసిన మంచి పని మాత్రమే. వ్యక్తులు వస్తారు, వెళ్తారు. But work remains. మనం చేసిన మంచి పని ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
✳️అందుకే నేను ప్రతి సంవత్సరం ఈ ఆసుపత్రికి వస్తుంటాను. ఇక ముందు కూడా వస్తాను.
✳️ఈ ఆసుపత్రి చేసే సేవకు మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. నా ఏడాది జీతం ఈ ట్రస్ట్ కు అందిస్త.
✳️సత్యసాయి సంజీవని ఆసుపత్రి కేవలం ఒక ఆసుపత్రి కాదు, వేలాది కుటుంబాలకు ఇది ఒక దేవాలయం. This is a temple. ఎందుకంటే ఇక్కడ వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారు.
✳️అప్పుడే పుట్టిన చిన్నారికి గుండెలో రంధ్రం ఉందని, గుండె సమస్య ఉందని తెలిసిన క్షణంలో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతాయి. బిడ్డ పుట్టిందనే ఆనందం ఒక్కసారిగా ఆందోళనగా మారిపోతుంది. అలాంటి సమయంలో ఈ ఆసుపత్రి ఆ చిన్నారికి వైద్యం చేసి ప్రాణం పోస్తుంది.
✳️నా దృష్టిలో ఈ ఆసుపత్రి ఒక చిన్నారి గుండెను మాత్రమే కాపాడదు. మూడు గుండెలను కాపాడుతుంది. ఒకటి ఆ చిన్నారి గుండె. రెండోది ఆ తల్లి గుండె. మూడోది ఆ తండ్రి గుండె.
✳️బిడ్డకు ప్రాణం పోయగానే తల్లిదండ్రుల జీవితాల్లో కూడా ఆశ, ధైర్యం, ఆనందం తిరిగి వస్తాయి. అందుకే నేను చెబుతున్నాను… ఈ ఆసుపత్రి మూడు గుండెలను కాపాడుతోంది.
✳️ఈరోజు 500వ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేయడం నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇది గొప్ప రోజు. ఈ సందర్భంగా వైద్య బృందం మొత్తానికి హృదయపూర్వక అభినందనలు.
✳️విజయ్ దేవరకొండ గారు సాధారణంగా విజయం వచ్చిన తర్వాత కొందరిలో గర్వం వస్తుంది. వారి ఆలోచనల్లో మార్పు వస్తుంది. ప్రవర్తనలో మార్పు వస్తుంది. కానీ విజయ్ లో నేను చూసింది మాత్రం రాలేదు. ఎంత ఎదిగితే అంత ఒదిగే మనసు.
✳️విజయ్ గారు కేవలం విజయవంతమైన సినీ నటుడు మాత్రమే కాదు. మంచి మనసున్న వ్యక్తి కూడా. కరోనా సమయంలో వేలాది మందికి అండగా నిలిచారు. అంతేకాదు, తన కుటుంబం తండ్రి గారి పేరుతో ఎంతోమంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తూ వారి చదువుకు తోడ్పాటు అందిస్తున్నారు.
✳️విజయ్ సత్యసాయి లోనే చదువుకున్నాడు అందుకే ఆయన ఈ సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారు.
✳️సత్యసాయి సంజీవని ఆసుపత్రి చేస్తున్న ఈ మహోన్నత సేవకు ఆయన అందిస్తున్న సహకారం కూడా ఎంతో ప్రశంసనీయం.
✳️అలాంటి సంస్థకు మనందరం తోడుగా నిలవాలి. ఇక్కడి స్థానికులు మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహకరించాలి.
✳️నిజంగా ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే. కానీ ఒక విషయం మాత్రం చెప్పాలి. శ్రీనివాస్ గారు తన జీవితాన్నే ఈ సేవకు అంకితం చేశారు. వేలాది చిన్నారుల కోసం, వారి కుటుంబాల కోసం తన జీవితాన్ని ధారపోశారు. అలాంటి వ్యక్తికి మనమందరం కృతజ్ఞతలు చెప్పాలి, అభినందించాలి.
✳️ఇక్కడ చికిత్స పొందుతున్న పిల్లలు ఏ మతానికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా ఎలాంటి తేడా లేకుండా సమానమైన ప్రేమతో, సేవాభావంతో వైద్యం అందిస్తున్నారు. అదే ఈ సంస్థ గొప్పతనం.
✳️ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇది వెలకట్టలేని అనుభూతి. ఒక చిన్నారి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడం కంటే గొప్ప సంతోషం మరొకటి ఉండదు.
✳️మన సిద్దిపేట గడ్డపై ఇలాంటి సేవా సంస్థ ఉండటం మనందరికీ గర్వకారణం.
✳️ఈ సేవా మరింత విస్తరించాలని, ఇంకా వేలాది మంది చిన్నారులకు జీవం పోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
✳️మరోసారి శ్రీనివాస్ గారికి, వైద్య బృందానికి, ఈ సేవలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు
1 week ago (edited) | [YT] | 350
View 2 replies
Harish Rao Thanneeru
సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం, సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, మంత్రుల అబద్ధాలను ఎండగట్టారు.
*చీము, నెత్తురు ఉంటే మంత్రి జూపల్లి రాజీనామా చేయాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
*అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పింది నిజమా? జూపల్లి చెప్పింది నిజమా?
*సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాదయాత్రలు
*ఓట్ల తొలగింపు కుట్రలను తిప్పికొట్టాలి.. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి
*సంగారెడ్డిలో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ సర్కార్
1 week ago | [YT] | 384
View 0 replies
Harish Rao Thanneeru
నాడు రాష్ట్రం కోసం
నేడు ప్రజల కోసం
కాలం మారింది కానీ.. పోరాటం మారలేదు.
1 week ago | [YT] | 364
View 6 replies
Harish Rao Thanneeru
సింగరేణి కోల్ మైన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఆర్పీ, పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారుల ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
చరిత్రలో తొలిసారి సింగరేణి అధికారులు సమ్మె బాట పట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కనీసం చీమకుట్టినట్లు కూడా లేదు.
అధికారుల 'పీఆర్పీ' ఆపేసి బొగ్గు ఉత్పత్తిని పడగొట్టారు.. కరెంటు ప్లాంట్లు మూతవేసి బయట విద్యుత్ కొనుగోళ్లకు తెరలేపారు.
సింగరేణిలో పారదర్శక బదిలీలకు పాతరేశారు.. పోస్టింగ్ల పేరుతో పైరవీకారులు, బ్రోకర్లకు అడ్డాగా మారింది.
తక్షణమే పీఆర్పీ బకాయిలు చెల్లించి, కోల్ ఇండియా తరహాలో 'పే-అప్గ్రేడేషన్' అమలు చేయాలి.
1 week ago | [YT] | 122
View 0 replies
Harish Rao Thanneeru
జడ్చర్లలోని వాసవి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు, SIR అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు.
మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్...
* తెలంగాణ కోసం రాజీనామా చెయ్యమంటే జిరాక్స్ కాయితం ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది.
* 2009లో కూటమిలో భాగంగా లక్ష్మారెడ్డి గారికి టికెట్ రాకపోయినా పార్టీకోసం నిబద్దతతో పని చేసి కేసీఆర్ గారిని ఎంపీగా గెలిపించడానికి కృషి చేసిన నిజాయితీ గల నాయకుడు. * రేవంత్ రెడ్డి గారు ఉద్యమం గురించి, త్యాగాల గురించి మాట్లాడుతుంటే నవ్వి పోదురు గాక నాకేం సిగ్గు అన్నట్టు ఉంది ఆయన తీరు.
* పాలమూరు ప్రజల జోష్ చేస్తుంటే బీఆర్ఎస్ మళ్ళీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం ఉంది.
* రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో రైతు ఆశీర్వాద సభ అని పెడుతున్నాడు. అది రైతు ఆశీర్వాద సభ కాదు రైతుల వంచన సభ. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి రైతును వంచించుతూనే ఉన్నాడు.
* యాసంగి రైతు బంధు ఎగొట్టి ఇప్పుడు మల్ల వానాకాలం రైతు బంధు వేస్తానని మోసం చేస్తున్నాడు.
* రైతు రుణమాఫీ అన్నారు రెండు లక్షలు కాదు కదా లక్ష లోపు ఉన్నవాళ్లకు కూడా చెయ్యలేదు.
* నిన్న నల్గొండలో ఒట్టేసి చెప్తున్నా మూసి ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు. ఆ ఒట్టు అనేదానికి ప్రాణం ఉంటే ఈ రేవంత్ రెడ్డి అబద్ధాలకు ఉరేసుకొని ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేది.
* కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చెయ్యకుండా దేవుళ్ళనే మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి
* పాలమూరు బిడ్డలు స్వచ్ఛమైన పాలలాంటి మనుసున్న బిడ్డలు. రేవంత్ రెడ్డి జూట మాటలు, బట్టెబాజ్ మాటలతో పాలమూరు పరువు తీస్తున్నాడు.
* ఎన్నికల్లో మాట ఇచ్చి తప్పిన మనిషి రేవంత్ రెడ్డి. హామీ ఇవ్వక పోయినా ప్రజలకు కావాల్సింది అర్ధం చేసుకొని రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్
* రైతు బంధు పేరిట 29 వేల 300 కోట్ల రూపాయలు రైతులకు బాకీపడ్డ రేవంత్ రెడ్డి.
2 weeks ago | [YT] | 130
View 0 replies
Harish Rao Thanneeru
తెలంగాణ గర్వించే బిడ్డగా, అత్యుత్తమ పరిపాలనాదక్షుడిగా, భారత ప్రధానిగా దేశానికి అమూల్యమైన సేవలు అందించిన భారతరత్న పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ నివాళి.
2 weeks ago | [YT] | 135
View 0 replies
Harish Rao Thanneeru
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు గారి ప్రెస్ మీట్.
తన రాజకీయ గురువుకు 'గురుదక్షిణ'గా రాష్ట్ర జలహక్కులను తాకట్టు పెడుతున్న రేవంత్.. తెలంగాణను ముంచే 'ముంపు మేస్త్రి'గా మారాడు..
నదీ జలాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి అజ్ఞానం.. నేడు తెలంగాణకు మరణ శాసనంగా మారింది.
కేసీఆర్ గారు పోరాడి సాధించిన ప్రాజెక్టుల అనుమతులను గాలికి వదిలేసి.. తన రాజకీయ స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నాడు..
కర్ణాటక, ఏపీ అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణను ముంచుతుంటే.. అడ్డుకోవాల్సిన సీఎం వారితో కలిసి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేట.
మంత్రి ఉత్తమ్ను బయటపెట్టి.. ఏపీ అధికారితో సీక్రెట్ మీటింగ్ లో ముగ్గురు సీఎంలు చేసుకున్న ఆ 'చీకటి ఒప్పందం' ఏంటో రేవంత్ బయటపెట్టాలి..
నదుల అనుసంధానం పేరిట ఏపీ జలదోపిడీకి రెడ్ కార్పెట్ వేస్తూ.. తెలంగాణ సమ్మక్క సాగర్ ప్రాజెక్టును రేవంత్ బలిపెడుతున్నాడు.
కూలగొట్టే హైడ్రాకు 'హిట్లర్' స్ఫూర్తన్న రేవంత్ రెడ్డి.. మన నీళ్లు ఎత్తుకుపోతుంటే ఫిడేల్ వాయించిన 'నీరో చక్రవర్తి'లా చోద్యం చూస్తున్నాడు..
కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో ఏకంగా 383 టీఎంసీల అనుమతులు సాధిస్తే.. ఈ కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేళ్లలో కనీసం ఒక్క టీఎంసీకి కూడా అనుమతి సాధించలేదు.
2 weeks ago | [YT] | 146
View 0 replies
Load more