Amaravati Prajarajadhani

The official YouTube channel of the Andhra Pradesh Capital Region Development Authority (APCRDA), showcasing the vision, planning, and development of Amaravati- the People's Capital of Andhra Pradesh. The channel features updates on infrastructure projects, institutional development, urban planning initiatives, and key milestones shaping the capital region.


Amaravati Prajarajadhani

రాజధాని రైతు శ్రీరామమూర్తి గారిని సత్కరించిన APCRDA కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్ గారు

✅ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి ఇటీవలే భూములిచ్చి సహకరించిన రైతు చింతల శ్రీరామమూర్తి బుధవారం, 2026 మే 27న రాయపూడిలోని APCRDA కార్యాలయానికి ఈ- లాటరీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. అమరావతిలోని లింగాయపాలెం, శాఖమూరు , కొండమరాజుపాలెంలో తమ కుటుంబానికి చెందిన 16 ఎకరాల 70 సెంట్ల భూమిని శ్రీరామమూర్తి, రాజధాని నిర్మాణానికి పూలింగ్ కింద అందజేశారు. బుధవారం రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు నిమిత్తం ఆయన ఈ- లాటరీకి హాజరయ్యారు. చింతల శ్రీరామమూర్తి గారికి ఈ- లాటరీ ద్వారా 11 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించడం జరిగింది.

✅అనంతరం శ్రీరామమూర్తి గారిని కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్లు ఏ. భార్గవతేజ ఐఏఎస్, కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ గార్లు మర్యాదపూర్వకంగా కలిశారు. రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికెట్‌ను కమిషనర్ గారు శ్రీరామమూర్తి గారికి అందజేసి శాలువాతో సత్కరించారు.

✅రాజధాని అమరావతి సమగ్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు, రాజధాని గ్రామాల రైతులు అమరావతి అభివృద్ధి కార్యకలాపాలలో APCRDA అధికారులకు సహకరించాలని శ్రీరామమూర్తి విజ్ఞప్తి చేశారు. అమరావతి అభివృద్ధి పనులు వేగం పుంజుకున్న నేపథ్యంలో ఇటీవలే తాను తమ భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చామని, పూలింగ్ కింద తాను ఇచ్చిన భూమికి అధికారులు ఈ- లాటరీ నిర్వహించి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించారని శ్రీరామమూర్తి ఆనందం వ్యక్తం చేశారు.
#FarmersFirst #Amaravati #APCRDA #PeoplesCapital #PrajaRajadhani #AmaravatiFarmers #FarmerParticipation #LandPoolingScheme #LPS #ReturnablePlots #ELottery #TransparentGovernance #UrbanDevelopment #InfrastructureDevelopment #AndhraPradesh #PeoplesCapitalAmaravati #FarmerSupport #CapitalCityDevelopment #InclusiveDevelopment #APCRDAInitiatives

6 hours ago | [YT] | 103

Amaravati Prajarajadhani

రాజధాని అమరావతిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున సైట్‌లలో పని చేసే కార్మికులు వడగాలులకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరడమైనది.
#HeatWaveAlert #Amaravati #WorkerSafety #HeatWavePrecautions #SummerSafety #ConstructionSafety #WorksiteSafety #APCRDA #AndhraPradesh #HeatStressAwareness #LabourWelfare #StayHydrated #PublicSafety #InfrastructureDevelopment #SafetyFirst

4 days ago | [YT] | 193

Amaravati Prajarajadhani

🌿 22nd May | International Day for Biological Diversity 🌿

People’s Capital Amaravati reflects a strong commitment to sustainable and environmentally responsible urban development. Through APCRDA’s Blue-Green Planning Approach, Amaravati is being designed to preserve biodiversity, protect natural water systems, enhance green spaces, and promote ecological balance alongside modern infrastructure development.

By integrating nature with urban planning, Amaravati aims to emerge as a people-centric capital city that reflects harmony between development and environmental conservation.

#InternationalDayForBiologicalDiversity #Amaravati #PeoplesCapital #PrajaRajadhani #APCRDA #BlueGreenInfrastructure #SustainableDevelopment #EcoFriendlyCity #Biodiversity #GreenUrbanPlanning #AndhraPradesh #UrbanDevelopment

5 days ago | [YT] | 81

Amaravati Prajarajadhani

ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలకై కృష్ణాయపాలెంలో APCRDA ఆధ్వర్యంలో గురువారం 2026 మే 21న గ్రామసభ జరిగింది. నేడు జరిగిన గ్రామసభలో కమిషనర్ వి.విజయరామరాజు ఐఏఎస్ గారు, అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ ఐఏఎస్ గారు హాజరయ్యారు.

రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, LPS జోన్లు, తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్- LPS) చేపట్టామని.. సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే ఇటీవల భూసేకరణ ప్రక్రియకై నోటిఫికేషన్ విడుదల చేశామని కమిషనర్ గారు గ్రామస్తులకు వివరించారు. భూసమీకరణలో పాల్గొనేందుకు రైతులకు ఇప్పటికీ అవకాశం ఉందని, ఇటీవల విడుదల చేసిన భూసేకరణ ప్రకటనలో పేర్లు ఉన్నప్పటికీ సంబంధిత రైతులు నిర్ణీత గడువులోపు భూసమీకరణలో పాల్గొనేందుకు అవకాశముందని కమిషనర్ గారు గ్రామసభలో స్పష్టం చేశారు.

రాజధాని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు గ్రామాలవారీగా అధికారులతో కూడిన ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ బృందం గ్రామాలలో మౌలిక వసతులు, LPS ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై పని చేస్తారన్నారు. కృష్ణాయపాలెంలో త్రాగునీటి సరఫరాలో నెలకొన్న ఇబ్బందుల గురించి గ్రామస్తులు కమిషనర్ గారి వద్ద ప్రస్తావించగా.. రూరల్ వాటర్ సప్లై(RWS) అధికారులతో సమన్వయం చేసుకుని సమస్య పరిష్కరిస్తామని కమిషనర్ గారు హామీ ఇచ్చారు. అమరావతిలోని నిర్మాణ పనుల కారణంగా సంచరించే భారీ వాహనాలతో దుమ్ము ధూళి వస్తోందని గ్రామస్తులు తెలుపగా..సంబంధిత గుత్తేదారులను సమస్య పరిష్కరించాలని కమిషనర్ గారు ఆదేశాలిచ్చారు.

రాజధాని అమరావతి గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామని కమిషనర్ గారు పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నందున, రాజధాని గ్రామాల రైతులు APCRDA అధికారులకు సహకరించాలన్నారు. అలాగే రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు స్థానికంగా అందుబాటులో ఉండే కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు. గ్రామసభలో APCRDA ప్లానింగ్ విభాగ డైరెక్టర్ బి.సురేష్ కుమార్(FAC), డైరెక్టర్- ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) ఎన్. వసంతరాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి.మధుసూధనరావు, జి. రవీందర్, కె.సుధారాణి, తహసీల్దార్ పి. సతీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
#Amaravati #PeoplesCapital #PrajaRajadhani #APCRDA #APCRDAInitiatives #AndhraPradesh #UrbanDevelopment #InfrastructureDevelopment #LandPooling #LandAcquisition #PublicConsultation #GramaSabha #Krishnayapalem #SustainableDevelopment #GovernmentOfAndhraPradesh

6 days ago | [YT] | 169

Amaravati Prajarajadhani

ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలకై తుళ్లూరులో APCRDA ఆధ్వర్యంలో మంగళవారం 2026 మే 19న గ్రామసభ జరిగింది. నేడు జరిగిన గ్రామసభలో కమిషనర్ వి.విజయరామరాజు ఐఏఎస్ గారు, అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐఏఎస్ గారు హాజరయ్యారు.

రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, LPS జోన్లు, తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్- LPS) చేపట్టామని.. సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే ఇటీవల భూసేకరణ ప్రక్రియకై నోటిఫికేషన్ విడుదల చేశామని కమిషనర్ గారు గ్రామస్తులకు వివరించారు. భూసమీకరణలో పాల్గొనేందుకు రైతులకు ఇప్పటికీ అవకాశం ఉందని, భూసేకరణ ప్రకటనలో పేర్లు ఉన్నప్పటికీ సంబంధిత రైతులు నిర్ణీత గడువులోపు భూసమీకరణలో పాల్గొనేందుకు అవకాశముందని కమిషనర్ గారు గ్రామసభలో స్పష్టం చేశారు.

రాజధాని అమరావతిలోని గ్రామాలవారితో తరచుగా సమావేశాలు నిర్వహిస్తామని తుళ్లూరు గ్రామసభలో కమిషనర్ గారు చెప్పారు. ఆ సమావేశాలలో క్రితం సమావేశంలో చర్చించిన అంశాలపై- ATR(యాక్షన్ టేకెన్ రిపోర్ట్)ను అధికారులు సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. ఆధార్ బేస్డ్ OTP ద్వారా పారదర్శకంగా TDR బాండ్స్ పంపిణీ చేసేందుకు సాఫ్ట్‌వేర్ సిద్ధం చేస్తున్నామని గ్రామస్తులకు కమిషనర్ గారు చెప్పారు. NSP అమలులో భాగంగా లే అవుట్స్ సిద్ధం చేయాలని, అలాగే తుళ్లూరు, పరిసర గ్రామాల లోపలికి సులభంగా చేరుకునేలా రహదారుల వ్యవస్థకై సర్క్యులేషన్ ప్యాట్రన్ సిద్ధం చేయాలని APCRDA ఇంజినీరింగ్ & ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. డ్రైనేజి, పవర్ సప్లై తదితర మౌలిక వసతులలో ఉన్న సమస్యలపై పలువురు గ్రామస్తులు కమిషనర్ గారికి ఫిర్యాదు చేయగా.. సంబంధిత అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారు ఆదేశించారు. తుళ్లూరు- తాడికొండ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని పలువురు గ్రామస్తులు కోరగా.. ఆ యొక్క రహదారి ఆర్ & బీ పరిధిలో ఉన్నదని, గుంటూరు జిల్లా కలెక్టర్‌ వారితో నిధుల అంశంపై చర్చించడం జరిగిందని కమిషనర్ గారు చెప్పారు.

రాజధాని అమరావతి గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామని కమిషనర్ గారు పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నందున, రాజధాని గ్రామాల రైతులు APCRDA అధికారులకు సహకరించాలన్నారు. అలాగే రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు స్థానికంగా అందుబాటులో ఉండే కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు. గ్రామసభలో APCRDA డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వే(LA) ఎస్. రవీంద్ర ప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి.మధుసూధనరావు, పి.పద్మావతి, తహసీల్దార్ పి. సతీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. #Amaravati #PeoplesCapital #PrajaRajadhani #APCRDA
#APCRDAInitiatives #AndhraPradesh #UrbanDevelopment
#InfrastructureDevelopment #LandPooling #LandPoolingScheme
#LandAcquisition #LPSZones #GramaSabha
#PublicConsultation #FarmerParticipation
#SustainableDevelopment #SustainableInfrastructure
#RoadInfrastructure #TDRBonds #Thulluru
#GovernmentOfAndhraPradesh

1 week ago | [YT] | 149

Amaravati Prajarajadhani

APCRDA ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన "యువ సంగం" బృందం!

"ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ " కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర నుంచి విచ్చేసిన "యువ సంగం" విద్యార్ధి బృందం ప్రజారాజధాని అమరావతి- రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయాన్ని సోమవారం 2026 మే 18న సందర్శించింది. ఈ బృందం గ్రౌండ్ ఫ్లోర్‌లోని "అమరావతి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(AICCC)ను సందర్శించింది.

APCRDA అధికారులు.. రాజధాని అమరావతిని రైతుల భాగస్వామ్యంతో ఏ విధంగా ప్రణాళికాయుతంగా నిర్మిస్తున్నామో AICCCలోని భారీ స్క్రీన్‌పై బృందానికి వివరించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో భాగంగా నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్, హైకోర్టు, అసెంబ్లీ తదితర నిర్మాణాల గురించి, అలాగే రిజర్వాయర్లు, బ్లూ గ్రీన్ కాన్సెప్ట్‌తో నిర్మిస్తున్న ట్రంక్ ఇన్‌ఫ్రా సదుపాయాల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం "యువ సంగం" బృందంతో కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్ గారు మాట్లాడారు. ప్రజారాజధాని అమరావతి నిర్మాణంపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ప్రజారాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా APCRDA సమగ్ర ప్రణాళికతో, నూతన సాంకేతిక విధానాలు అమలు చేస్తూ పని చేస్తోందని తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ మేరకు, రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డా. పొంగూరు నారాయణ గారి మార్గదర్శకత్వంలో రాజధాని పనులు ప్రణాళికాయుతంగా, ప్రపంచస్థాయి మౌలిక వసతులను కల్పించేందుకు అనుగుణంగా జరుగుతున్నాయని కమిషనర్ గారు బృందానికి వివరించారు.
#YuvaSangam #EkBharatShreshthaBharat #EBSB #Amaravati #PeoplesCapital #PrajaRajadhani #APCRDA #AICCC #AndhraPradesh #UrbanDevelopment #InfrastructureDevelopment #PlannedDevelopment #SmartInfrastructure #WorldClassCapital #StudentEngagement #UnityInDiversity #IndiaTogether

1 week ago | [YT] | 256

Amaravati Prajarajadhani

ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో "గ్రీవెన్స్ డే" నిర్వహణ

ప్రజారాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం 2026 మే 18న "గ్రీవెన్స్ డే" నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్, రిటర్నబుల్ ప్లాట్ల రీ అలాట్మెంట్, నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ(NSP) అమలు తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను కమిషనర్ వి.విజయరామరాజు IAS, అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ IAS, కొల్లాబత్తుల కార్తీక్ IAS గార్లకు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వారు తెలియజేశారు. అలాగే కొన్ని సమస్యల పరిష్కారం ప్రభుత్వ నిర్ణయానుసారం ఉంటుందన్నారు. రైతులు, స్థానికుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో సిటిజన్ గ్రీవెన్స్ సెంటర్(సీజీసీ) వద్ద ప్రతి రోజూ పనివేళలలో CRDA సిబ్బంది అర్జీలు స్వీకరిస్తారని..ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాయపూడిలో APCRDA ప్రధాన కార్యాలయంలో "గ్రీవెన్స్ డే" జరుగుతుందన్నారు. నేడు నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 74 ఫిర్యాదులు వచ్చాయన్నారు.

గ్రీవెన్స్ డేలో డిప్యూటీ కలెక్టర్ & APCRDA గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మేనేజ్‌మెంట్(GRM) నోడల్ అధికారి పి.జయశ్రీ, సర్వే విభాగ డిప్యూటీ డైరెక్టర్ జి.పాండురంగ రామకృష్ణన్, అడిషనల్ డైరెక్టర్(లీగల్) ఎం.వెంకటేశ్వరరావు, డైరెక్టర్- ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) ఎన్. వసంతరాయుడు, ప్లానింగ్ విభాగ డైరెక్టర్ బి. సురేష్ కుమార్, డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగ డైరెక్టర్ వి.సునీత, HR విభాగ డైరెక్టర్ బి.మల్లిఖార్జున రెడ్డి, ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జుబిన్ రాయ్, IT విభాగ అడిషనల్ డైరెక్టర్ కుశ్వంత్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జి.రవీందర్, ఎం.శేషిరెడ్డి, కె.ఎస్.భాగ్యరేఖ, పి. పద్మావతి, బి. సాయి శ్రీనివాస నాయక్, జి. వెంకటేష్, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

#FarmersFirst #Amaravati #PeoplesCapital #PrajaRajadhani #APCRDA #APCRDAInitiatives #GrievanceDay #AndhraPradesh #LPS #LandPooling

1 week ago | [YT] | 157

Amaravati Prajarajadhani

రైతుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలతో ప్రజారాజధాని అమరావతి నిర్మాణం!

గ్రామ సభల ద్వారా ప్రతి గ్రామానికి చేరుకుంటూ, రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల అభిప్రాయాలను గౌరవిస్తూ, వారి సమస్యలకు వేగంగా పరిష్కారాలు అందించే దిశగా APCRDA నిరంతరం కృషి చేస్తోంది.
#Amaravati #PeoplesCapital #PrajaRajadhani #APCRDA #APCRDAInitiatives #AndhraPradesh #UrbanDevelopment #InfrastructureDevelopment #LandPooling #LandAcquisition #PublicConsultation #GramaSabha #SustainableDevelopment #GovernmentOfAndhraPradesh #AmaravatiUnstoppable

1 week ago | [YT] | 179

Amaravati Prajarajadhani

APCRDA and ADCL organised specialised health camps for workers involved in Amaravati development works. Around 160 Megha Engineering personnel underwent health screening, reinforcing the focus on worker welfare and safe working conditions.

#Amaravati #APCRDA #WorkerWelfare

1 week ago | [YT] | 96

Amaravati Prajarajadhani

ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలకై అబ్బరాజుపాలెంలో APCRDA ఆధ్వర్యంలో గురువారం 2026 మే 14న గ్రామసభ జరిగింది. గ్రామసభలో కమిషనర్ వి.విజయరామరాజు ఐఏఎస్ గారు, అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ ఐఏఎస్, కె.కార్తీక్ ఐఏఎస్ గార్లు హాజరయ్యారు.

రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, LPS జోన్లు, తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్- LPS) చేపట్టామని.. సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే ఇటీవల భూసేకరణ ప్రక్రియకై నోటిఫికేషన్ విడుదల చేశామని కమిషనర్ గారు గ్రామస్తులకు వివరించారు. భూసమీకరణలో పాల్గొనేందుకు రైతులకు ఇప్పటికీ అవకాశం ఉందని, భూసేకరణ ప్రకటనలో పేర్లు ఉన్నప్పటికీ సంబంధిత రైతులు నిర్ణీత గడువులోపు భూసమీకరణలో పాల్గొనేందుకు అవకాశముందని కమిషనర్ గారు గ్రామసభలో స్పష్టం చేశారు. గ్రామస్తులు పలు సమస్యలను కమిషనర్ గారి దృష్టికి తీసుకురాగా.. ప్రాధాన్యత క్రమంలో, ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామకంఠాలతో పాటు ఆయా సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీ(NSP) అమలులో భాగంగా అబ్బరాజుపాలెం గ్రామానికి సంబంధించి ఇల్లు, స్థలాలు కోల్పోయేవారికి అందజేసే లేఅవుట్లను త్వరితగతిన సిద్ధం చేయాలని కమిషనర్ గారు, CRDA ప్లానింగ్ విభాగ అధికారులను గ్రామసభలో ఆదేశించారు. అలాగే రాజధాని గ్రామాలలో రహదారుల నిర్మాణానికి సైతం ప్రణాళికలు సిద్ధం చేశామని కమిషనర్ గారు పేర్కొన్నారు.

రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నందున, రాజధాని గ్రామాల రైతులు APCRDA అధికారులకు సహకరించాలన్నారు. అలాగే రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు స్థానికంగా అందుబాటులో ఉండే కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు. గ్రామసభలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.ఎస్.భాగ్యరేఖ, పి.మధుసూధనరావు, తహసీల్దార్లు పి.సతీష్, జి.మురళీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. #Amaravati #PeoplesCapital #PrajaRajadhani #APCRDA #APCRDAInitiatives #AndhraPradesh #UrbanDevelopment #InfrastructureDevelopment #LandPooling #LandAcquisition #PublicConsultation #GramaSabha #SustainableDevelopment #GovernmentOfAndhraPradesh #Abbarajupalem

1 week ago | [YT] | 112