My Channel Tirupati


Welcome to My Channel Tirupati.

I Give Information regarding Tirumala Darshan tickets and Rooms.
By Following My channel- I will Guide you regarding:
1.How to get Tirumala Different types of Darshan tickets and rooms
2. All latest news press updates released by TTD
3.How to manage your Tirumala darshan safely

Tirumala Tirupati Devasthanam update
I Dedicate my success to my father - Late Appa Rao.K

Please encourage me friends

For bussiness contact/promotion/collaboration-
7govinda107@gmail.com
Mobile no - 9440153407(whatsuponly)


My Channel Tirupati

Tirumala

2 hours ago | [YT] | 78

My Channel Tirupati

గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుపతి..

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి రథోత్సవం

భక్తి పారవశ్యంలో రథాన్ని లాగిన వేలాది మంది భక్తులు

ఆత్మతత్వాన్ని చాటిన దివ్య రథయాత్ర

తిరుపతి, 2026 మే 30: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలతో తిరువీధులు మార్మోగగా, వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు.

ఉదయం 5.40 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. మార్గమంతా భక్తులు టెంకాయలు కొట్టి, కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారికి మంగళారతులు అర్పించారు.

రథోత్సవం వెనుక ఆధ్యాత్మిక సందేశం

రథోత్సవం కేవలం ఉత్సవం మాత్రమే కాదు, ఆత్మజ్ఞానాన్ని బోధించే మహత్తర తాత్త్విక సందేశం కూడా. ఆత్మను రథికుడిగా, శరీరాన్ని రథంగా, బుద్ధిని సారథిగా, మనసును పగ్గంగా, ఇంద్రియాలను గుర్రాలుగా, విషయాలను వీధులుగా భావించడం ద్వారా ఆత్మ–అనాత్మ వివేకాన్ని ఈ ఉత్సవం భక్తులకు బోధిస్తుంది.

వేడుకగా స్నపన తిరుమంజనం

రథోత్సవం అనంతరం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి, నమ్మాళ్వార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ పండ్లరసాలతో విశేష అభిషేకం చేశారు.

నేడు అశ్వవాహనంపై గోవిందుడి దివ్య దర్శనం

సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ జరగనుంది. అనంతరం రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

రథోత్సవంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జి. భానుప్రకాశ్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఆలయ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, పోలీసు అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మే 31న కపిలతీర్థంలో చక్రస్నానం

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 31, ఆదివారం ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు కపిలతీర్థం (ఆళ్వార్ తీర్థం)లో చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఉదయం 6 గంటలకు స్వామివారు, అమ్మవార్లు తిరుచ్చిపై, చక్రతాళ్వార్ పల్లకీలో కపిలతీర్థానికి ఊరేగింపుగా బయలుదేరనున్నారు.

చక్రస్నానం అనంతరం పీఆర్‌ తోటకు వేంచేపు చేసి, సాయంత్రం 6 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

3 hours ago | [YT] | 80

My Channel Tirupati

🙏 Om Namo Venkatesaya 🙏
29-05-2026
Total pilgrims - 78,389
Tonsures: 45,283
Hundi kanukalu : 4.07Cr
Annaprasadam: 2.94 lac
Medical treatment: 3,556
Waiting Compartments..all vaukuntam que compartments full and line outside at krishna teja circle
Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens)...20-24hrs
(SSD)Time slot Sarvadarshan... 4 to 6 H
Rs 300 Special Darshan Approx. Time... 3 to 4 H
Tq.
--

aratt.ai/@mychanneltirupathi_ttd_updates -Aratti channel

whatsapp.com/channel/0029VaUMDRl5Ejy14QQzOv1G -WHATSUP

t.me/My_Channel_Tirupathi  - Telegram link 1

t.me/Mychanneltirupathi - telegram link 2

----------------------------------------
👉 🔗 Tirumala Shop offersTelegram Channel: t.me/Tirumalashopoffers

👉 🔗 Tirumala Shop offers WhatsApp Channel:
whatsapp.com/channel/0029VbCJzsr6mYPTqlmxnw1Mvvvvv…

10 hours ago | [YT] | 399

My Channel Tirupati

పత్రికా ప్రకటన
తిరుమల, 2026 మే 25

శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు

భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం రోజుకు 1500 శ్రీవాణి టికెట్లను టీటీడీ ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంచడం జరిగింది.
వీటిలో 500 దర్శన టికెట్లను మూడు నెలల ముందుగా ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ కింద అందుబాటులో ఉంచడం జరిగింది.

అదేవిధంగా మరో 200 శ్రీవాణి దర్శన టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీ చేయడం జరుగుతోంది.

ప్రస్తుతం రోజువారీ కరెంట్ బుకింగ్ కోటాలో అందుబాటులో ఉన్న 800 శ్రీ‌వాణి దర్శన టికెట్లలో ఇప్పటికే రూ.10 వేలు విరాళం చెల్లించి దర్శన టికెట్ కోసం వేచి ఉన్న దాతలకు ప్రతిరోజూ 300 టికెట్లు ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయించడం జరిగింది.

ఈ సదుపాయం 2025 మే 1 నుండి విరాళం చెల్లించిన అర్హులైన దాతలకు వర్తించనుంది. ఈ టికెట్లు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విడుదల చేయబడతాయి. మధ్యాహ్నం 1 గంటలోపు బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కల్పించబడుతుంది.

కాగా ఈ విధానం జూన్ 10వ తేది నుండి అమలులోకి రానుంది. ఈ కోటాలో బుకింగ్ కాని టికెట్లను తిరిగి కరెంట్ బుకింగ్ కోటాలో కలపబడతాయి. ఈ విధానం 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది.
-------------------
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

1 day ago | [YT] | 630

My Channel Tirupati



సూర్యకిరణాల తేజస్సులో భక్తులను కటాక్షించిన శ్రీ గోవిందరాజస్వామి

సూర్యప్రభ వాహనంపై దివ్య మంగళ విహారం

 రాత్రి చంద్రప్రభ వాహనసేవ

30న రథోత్సవం

తిరుపతి, 2026 మే 29: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు. సూర్యభగవానుని తేజస్సును ప్రతిబింబించే ఈ వాహనసేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది.

ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు తిరుమల నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్‌, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ గోవిందనామస్మరణతో వీధులను మార్మోగించారు.

సూర్యుడు తేజోమయుడు, సకలరోగ నివారకుడు, జగత్తుకు చైతన్యప్రదాతగా పురాణాలు వర్ణిస్తున్నాయి. వర్షాలు, పంటలు, ఓషధులు, జీవజాలం అన్నీ సూర్యుని కరుణాకటాక్షంతోనే అభివృద్ధి చెందుతాయని వేదాలు తెలియజేస్తున్నాయి.

 అటువంటి సూర్యతేజస్సు స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు సూర్యప్రభ వాహనంపై దర్శనమివ్వడం విశేష ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది.

అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకం చేశారు.

సాయంత్రం 5.30 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. అనంతరం స్వామివారు కల్యాణకట్ట మండపానికి వేంచేసి, అక్కడ తేరుచూపు అనంతరం తిరిగి వాహనమండపానికి చేరుకుంటారు.

రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

మే 30న రథోత్సవం

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవోపేతమైన రథోత్సవం మే 30వ తేదీ శనివారం ఉదయం 5.40 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ నారాయణ చౌదరి, ఏవీఎస్వో శ్రీ శ్రీనివాస రావు, సూపరింటెండెంట్లు శ్రీ చిరంజీవి, శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ, శ్రీ రంజిత్, తదితర అధికారులు, ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది

1 day ago | [YT] | 154

My Channel Tirupati

🙏 Om Namo Venkatesaya 🙏
29-05-2026
Total pilgrims - 74,569
Tonsures: 46,292
Hundi kanukalu : 3.80Cr
Waiting Compartments..all vaukuntam que compartments full and line outside at krishna teja circle
Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens)...20-24hrs
(SSD)Time slot Sarvadarshan... 4 to 6 H
Rs 300 Special Darshan Approx. Time... 3 to 4 H
Tq.
--

aratt.ai/@mychanneltirupathi_ttd_updates -Aratti channel

whatsapp.com/channel/0029VaUMDRl5Ejy14QQzOv1G -WHATSUP

t.me/My_Channel_Tirupathi  - Telegram link 1

t.me/Mychanneltirupathi - telegram link 2

----------------------------------------
👉 🔗 Tirumala Shop offersTelegram Channel: t.me/Tirumalashopoffers

👉 🔗 Tirumala Shop offers WhatsApp Channel:
whatsapp.com/channel/0029VbCJzsr6mYPTqlmxnw1Mvvvvv…

1 day ago | [YT] | 691

My Channel Tirupati

 గజవాహనంపై శ్రీ గోవిందరాజస్వామి దివ్య విహారం

కర్మ విముక్తిని ప్రసాదించే గజవాహన సేవ

మంగళవాయిద్యాలు, కోలాటాలతో మారుమోగిన మాడవీధులు

భక్తులకు అభయప్రదానం చేసిన గోవిందుడు

తిరుపతి, 2026 మే 28: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు గురువారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారు గజవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుకు సాగుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయప్రదానం చేశారు. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పించి గోవింద నామస్మరణతో స్వామివారిని సేవించుకున్నారు.

గజవాహనం ఐశ్వర్యానికి, మంగళానికి ప్రతీకగా భావించబడుతుంది. ఏనుగు ఓంకారస్వరూపానికి, విశ్వతత్త్వానికి సంకేతమని పురాణాలు వివరిస్తాయి. స్వామివారు గజరాజుపై విహరించడం ద్వారా అహంకారాన్ని విడిచి భగవంతుని శరణు చేరితే కర్మవిముక్తి కలుగుతుందనే సందేశాన్ని భక్తులకు అందించారు.

ఏడవ రోజు శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, విజివో శ్రీ గిరిధర్, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎవ్వో శ్రీ శ్రీనివాసరావు, అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

1 day ago | [YT] | 202