*నాన్నలందరికీ అంకితం* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁 బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.
“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు.
“అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను.
దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు.
“మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా
“అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా.
మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను.
అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసి, అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. “మీ నాన్నగారు రా!” అంటూ అమ్మ తన కంటి చూపు తో ఆయన్ని పరిచయం చేసింది.
బ్రహ్మాదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు. తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని. మరి నాన్న అంటే ఎవరు? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి.ఆ దేవుడినే అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా.
“ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు. అప్పుడే నన్ను గుర్తుచేసుకున్నావేమిటి?” అని అడిగాడు. అమ్మ గురించి చెప్పారు గాని, నాన్న గురించి ఏమీ చెప్పలేదెంటని అడిగా.
“నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది” అని ముక్తసరిగా బదులిచ్చి, “అర్ధమైందా?” అని ప్రశ్నించాడు.
“పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాస తో బదులిస్తే ఎలా అర్ధం అవుతుంది స్వామి” అని సమాధానం చెప్పాను.
ఒక అర్ధం లేని చిరునవ్వు నవ్వి, “నీకూ మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు” అని క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్ధమైంది నా బుజ్జి బుర్రకి, నా కష్టం తీర్చేది అమ్మ అని. మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని.
ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. “ఏం, నేనంటే ప్రేమ లేదా” అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ. “నీ మీద ప్రేమ ఉంది కాబట్టే, రోజు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తున్నాడు” అని బదులిచ్చాడు బ్రహ్మా. అర్ధం కాలేదని చెప్పాను. కొన్నేళ్లకు నీకే అర్ధం అవుతుందిలే అన్నాడు.
ఈయన అన్నీ తల తిక్క సమాధానాలే చెబుతాడులే అనుకుని, నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూసా. మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా. మా నాన్న ముఖం లోని నీరసం మాయమైంది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది. ఆ దేవ దేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా! అని గర్వపడటం మొదలుపెట్టా.
మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతి సారి, మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి.
కొన్నాళ్ళకి, నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందామని ప్రయత్నించా. కానీ ఫలితం లేదు. పదే పదే పడిపోతూనే ఉన్నా. ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు. నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడనుకున్నా! “నా వేలు పట్టుకుని నిల్చో నాన్నా” అన్నారు.
నిలబడగలిగాను కానీ, నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహా శివుణ్ణి, మనసులో ప్రార్దించడం మొదలుపెట్టా. తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను. ఆ ఢమరుక నాదపు సడిలో, వడి వడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా. ఆ మహా శివుడికి నా మొర వినిపించలేదేమో! నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు. నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుక నాదం లేకపోతేనేం!, నా గుండే చప్పుడుని నీ అరికాళ్ళతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు. ఏం మాయో తెలీదు. నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా. నడక రాని నేను నాన్న గుండెల మీద యధేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా.
నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి. నడవటం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక, అటూ ఇటూ చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహా విష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా, మరి నాకు భయమెందుకు. ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా. ఆయన కనిపించలేదు గాని వినిపించాడు. “ఏమైంది బాలకా” అని అన్నాడు. “భయం వేసింది స్వామి. అందుకే పిలిచా” అన్నా నేను.
“భయం ఎందుకు? నీవు నడుస్తుంది మీ నాన్న నీడ లోనేగా” అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూసా. అవును నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్చనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా, నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయ్యింది. అప్రయత్నంగానే నా పెదవులు ‘నాన్న’ అని పలకటం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ, నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది.
నాకు ఏ అవసరం వచ్చినా, ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు, మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది. దేవుడు వచ్చేవాడో, రాడో తెలీదు గాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ, నేను చెప్పక ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు. కొన్నాళ్ళకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి.
ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను.
“నీ జీవిత మజిలీ ఎలా సాగింది?” అని ప్రశ్నించారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు.
“మీరు నాకు ఏ మంత్రమూ భోదించకపోయినప్పటికీ, నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు.” అని సమాధానం చెప్పాను గర్వంగా.
“అదేంటి అలా అంటావ్! మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తుండటం ఉండటం మేము గమనిస్తూనే ఉన్నాం” అన్నారు మూకుమ్మడిగా.
“నాకు ఏం అర్ధం కావట్లేదు స్వామి” అని బదులిచ్చా నేను. బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్ష్యమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్ష్యమైంది. అప్పుడు గానీ అర్ధం కాలేదు ఈ మనిషి బుర్రకి, (మట్టి బుర్రకి). “అమ్మ ఆ దేవుడి అంశ అని” “నాన్న సాక్ష్యాత్ దేవుడని”. మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి. అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను.
ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి, నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో. క్షమిస్తా, కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవ దేవుడు. ఏమిటది స్వామీ! అని అడిగా ఆశ్చర్యంగా. నన్ను ఆఖరుసారిగా ‘నాన్న’ అని సంభోదించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు. ఆ మహా మంత్రాన్ని ఇంకోసారి జపించడానికి, నిముషం కూడా ఆలస్యం చేయలేదు నేను. నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా.
“అమ్మ దేవుడి అశ అయితే, నాన్న సాక్ష్యాత్ దేవుడే”🙏 🙏🙏🙏🙏🙏🙏
క్షమ’ అనే పదంలో ఉన్న రెండు అక్షరాలు చాలా ప్రాధాన్యం కలవి. అందులో క్ష అనే అక్షరం దృఢత్వాన్ని, మ అనే అక్షరం రమ్యతను తెలియజేస్తుంది. మనిషన్నవానికి గుండె గట్టిగా, మనస్సు మెత్తగా ఉండాలన్నది ఈ క్షమ చెబుతుంది. ఇక్కడ గుండె అంటే గుండెధైర్యం ధర్మాన్ని కాపాడుతాను, శరణు అన్నవారిని రక్షించగలను. నా దేశాన్ని నేను నా శాయశక్తులా రక్షించగలను అనే ధైర్యం ఉండాలి. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ల మధ్య, తల్లిదండ్రుల పైన ప్రేమ సౌభాతృత్వమూ ఉండాలి. తల్లిదండ్రులపైన అనురాగము, గురువులపైన గౌరవమూ, పెద్దలంటే ఆదరమూ చూపించాలని కూడా ఈ క్షమలోని అంతరార్థం. అంతేకాక క్షమ అనేది మనిషిలో ఉండాల్సిన ఉత్తమ గుణం. పరిస్థితుల దృష్ట్యా ఎదుటివారిపైన కోపం కలుగవచ్చు. మహాత్ముల కోపం తాటాకు మంటవంటిది అంటారు. అటువంటి కోపం ఎవరి మీద అయినా ఉండవచ్చు. కానీ ఆ కోపం క్రోధంగా, ద్వేషంగా మారి ఎదుటిమనిషి ప్రాణం తీయడానికో లేక తీవ్రమైన నష్టం కలిగించడానికో పూనుకొనే కోపం ఎవరిలోను ఉండకూడదు. అట్లా ఎదుటి వారు తప్పు చేసినప్పటికీ ఆ తప్పును తెలుసుకొనేట్లు చేసి వారిలో పశ్చాత్తాపం కలిగేలా ప్రవర్తించాలి. అంతేకాని వారిపైన కసిని, ద్వేషాన్ని రగిలించుకోకూడదు. వాళ్లు తప్పు చేశామనే పశ్చాత్తాపంతో ఉన్నపుడు క్షమించగలగాలి. వారిని మంచివారిగానే చూడగలగాలి. క్షమ ఉండేవారిలో భూదేవి మొట్టమొదటిగా చెప్తారు. భూదేవి తన్ను గునపాలతో తవ్వినా, ఇంకే యంత్రాలతో తవ్వినా, అసభ్యకరాలను భూమిపై వేసినా కూడా భూమి మనిషికి మంచే చేస్తుంది కానీ కీడు చేయదు. అందుకే భూమి అంతటి క్షమాగుణం మనిషిలోను ఉండితీరాలని పెద్దలు అంటారు. రావణుడు తప్పు చేసి సీతమ్మవారిని తీసుకొని వెళ్లి రామునితో యుద్ధానికి తలపడినపుడు ఆ యుద్ధంలో నిరాయుధుడైతే రాముడు ఇప్పటికైనా నీ తప్పును నీవు తెలుసుకొంటే నిన్ను నేను క్షమిస్తాను అని చెప్తాడు. పైగా నీవు నిరాయుధుడివి అయ్యావు కనుక వెళ్లి తిరిగి ఆయుధపాణివై రమ్ము నీతో పోరాడుతాను అని చెప్పి పంపించేస్తాడు. అది రామునిలోని క్షమాగుణం. సమాజం పట్ల, సమాజంలోని జీవుల పట్ల , సమాజ వ్యవహారాల పట్ల ప్రతి వారు క్షమను కలిగి ఉండాలని రామాయణం చెబుతుంది. పూర్వం మునులు దానవులు చేసిన తప్పులను క్షమించేవారు. ఒకవేళ దానవులను శపించినా తిరిగి ఆ శాపాలకు విముక్తిమార్గాన్ని కూడా చూపేవారు. అందుకే వారిని మహాత్ములు మనం నేటికీ గుర్తుపెట్టుకుంటున్నాము. . క్షమిస్తున్నారని, లేక క్షమిస్తారే అనే ఆలోచనతో తప్పులు చేయకూడదు. తప్పు చేసిన వారికి కఠినమైన శిక్ష ఉండితీరాలి. కాని ఆ తప్పును తెలుసుకొని వారిలో పశ్చాత్తాప గుణం కలిగితే మాత్రం వారిని క్షమించడం ఉత్తముల లక్షణం అని చెప్పవచ్చు. అందుకే ప్రతివారిలో ధర్మాగ్రహం ఉండి తీరాలి. క్షమించేగుణమూ అలవర్చుకోవాలి.
నాని : నాన్నా! ఈ నెల తాతయ్య మన ఇంటికి రాలేదేంటి? తల్లి: మీ నాన్న వెళ్ళి మీ తాతయ్యను తీసుకుని రాకపోయినా మీ పెద్దనాన్న ఇక్కడికి వచ్చి మీ తాతయ్యను దింపివెళతారులేరా!( ఎగతాళిగా) అనుకున్నట్లుగానే ఫోను రింగ్ అయింది..... తల్లి: నేను చెప్పాను కదా! మీ అన్నయ్యగారే అయిఉంటారు......మీ నాన్నగారిని తీసుకెళ్ళమని చెప్పడానికే! (భర్తను ఉద్దేశించి) తండ్రి: అవును . అన్నయ్యనే కాల్ చేస్తున్నాడు. అంటూ ఫోను తీసుకుని ఇలా మాట్లాడాడు....... పెద్దనాన్న: ఏరా! ఎలా ఉన్నారు.......ఏంటి ఇంకా నాన్నగారిని తీసుకుని వెళ్ళలేదు . ప్రొద్ధుటి నుండి నాన్నగారు కలవరిస్తున్నారు చిన్న కొడుకు రాలేదని! త్వరగా వచ్చి తీసుకుని వెళ్ళు/ తండ్రి: ఇదుగో వచ్చేస్తున్నాను అన్నయ్యా! ఆఫీసులో కాస్త పని ఒత్తిడి వల్ల సాయంకాలం తీసుకుని వొద్దామనుకుంటుండగా నీవు కాల్ చేశావు. అంటూ ఫోను పెట్టేసి నసుగుతూ.........బయలుదేరాడు....... ఇదంతా గమనిస్తున్న నానీ ( మనవడు) నాన్నగారిని ఇలా అడిగాడు. నాని: నాన్నా! నాకో డౌటు.......తీరుస్తారా???????? తండ్రి: ఇప్పుడేం డౌటు రా! ముందు మీ తాతయ్యను తీసుకుని రానివ్వు. తరువాత నీ డౌటు తీరుస్తాను...... నాని: ఇప్పుడే చెప్పండి. నాన్నా! తాతయ్యకు ఇద్దరు కొడుకులు.. ఒక నెల మీరు...........ఒక నెల పెద్దనాన్న ....ఇలా మార్చి మార్చి తాతయ్యను చూసుకుంటున్నారుకదా! మరి మీకు నేను ఒక్కడినే కొడుకును కదా! నేను పెద్దయ్యాక ఒక నెల మా ఇంట్లో ఉంటారు. మరి మరుసటి నెల ఎక్కడికి పోతారో చెప్పండి నాన్నా! ఎవరో చాచి చెంపదెబ్బ కొట్టినట్లు ఉలిక్కిపడ్డాడు ఆ తండ్రి.......... కన్నవారిని పంచుకోకండి....వారు మీకు ప్రేమను పంచినవారు........ వారి కంట కన్నీరు బిడ్డలమైన మనకు మంచిదికాదు.......దయచేసి తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోకపోయినా,,, భారంగా తలచి.... చివరిదశలో వారిని అలక్ష్యం చేయకండి..రేపు మనమూ పెద్దవారము అవుతాము మన పిల్లలు అలా చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించిండి.......పెద్దలను గౌరవించండి.......🙏🙏
మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు.దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరకు వెళ్ళి"దాహంగా ఉంది,నీళ్లు ఇవ్వండి"అని అడుగుతాడు.... గుడిస లోపల నుండి ఓ ముసలావిడ బయటకు వచ్చి ‘మీరెవరు?ఎక్కడనుండి వస్తున్నారు?'అంటుంది.... కాళిదాసు"నేను ఎవరో తెలియకపోవడం ఏంటి?నేను ఓ పెద్ద పండితుడను.ఎవరిని అడిగినా చెబుతారు"అని అంటాడు.... ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి..'మీరు అసత్యమాడుతున్నారు.మీరంత గొప్పవారైతే ప్రపంచంలో ఇద్దరు బలవంతులెవరో చెప్పండి’అంటుంది.... కాళిదాసు కాసేపు ఆలోచించి"నాకు తెలియదు.గొంతు ఎండి పోతుంది,ముందు నీళ్లు ఇవ్వండి"అని బతిమాలుకుంటాడు... "ఆ ఇద్దరు బలవంతులు ఆకలి, దాహం.ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?"అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ.... ఈసారి ‘నేను బాటసారి’ని అంటాడు కాళిదాసు.... అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరూ అంటూ ప్రశ్నిస్తుంది ముసలావిడ.... తెల్ల ముఖం పెట్టి మాతా!"నీళ్ళు ఇవ్వండి.లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను" అంటూ ప్రాదేయపడతాడు కాళీదాసు.... వాళ్ళు సూర్యచంద్రులు’అని తెలిపి"మరి మీరెవరో సెలవివ్వండి.నీళ్లిస్తాను" అంటుంది ముసలావిడ.... కాళిదాసు దీనంగా"నేను అతిథిని"అని బదులిస్తాడు.... "మీరు మళ్ళీ అసత్యం చెబుతున్నారు.ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే.ఒకటి ధనం, రెండోది యవ్వనం.అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు"అంటుంది ముసలావిడ.... కాళిదాసు"నా సహన పరీక్ష తరువాత చేద్దురు.ముందు నీళ్లు ఇవ్వండి"అని వేడుకుంటాడు.... "ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు.వారెవరో శెలవివ్వ గలరా" అంటూ...బిక్కమొహం వేసిన కాళీదాసుతో"ఒకటి భూమి,రెండోది వృక్షం"అని భోద పరచి"ఇప్పుడు నిజం చెప్పండి మీరెవరు?"అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ.... ఓపిక నశించిన కాళిదాసు"నేను మూర్ఖుడను.ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్లివ్వండి"అని సాగిల పడతాడు.... ఆ అవ్వ నవ్వుతూ"ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు"అని అంటుంది.... ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది.ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు.... ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది.‘నాయనా! విద్యతో వినయం వృద్ధి చెందాలి,అహంకారం కాదు.కీర్తి,ప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరి చేయటానికే ఈ పరీక్ష’ అని మంచినీరు అందించి దాహం తీరుస్తుంది. *విద్య, అధికారం, ధన బలము తో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి*. 👍👍శుభోదయం
💐 *స్టీవ్ జాబ్స్.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు:* 📘✍️📘✍️📘✍️📘✍️👍 *పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం.. కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే.*
*రోగంతో లేవలేని స్థితిలో.. నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది.*
*నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ.. నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒక ఆరోగ్యాన్ని పోగొట్టుకొన్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే " జీవితం ''.*
*"మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది.''*
*"30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది.''*
*"మన జేబులో 30 డాలర్లున్నా, 300 డాలర్లున్నా.. అందులో తేడా ఏమీ వుండదు.''*
*"ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కారైనా.. ప్రయాణించే దూరం, బాట ఒకటే, చివరికి అదే గమ్యం చేరుతాం.''*
*"మనం వుండే ఇల్లు మూడొందల గజాలైనా, మూడువేల గజాలైనా నీ ఒంటరితనం నీదే. నీలోని మనిషికి సంతోషం.. నీ బాహ్యప్రపంచ వస్తువులతో రాదు.''*
*"నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసినా, ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసినా.. విమానం కూలినప్పుడు దాంతోపాటు నువ్వు కూడా పోతావు.''*
*💐అందుకే, మాట్లాడటానికి నీకు స్నేహితులు, బంధువులు వుంటే.. అదే నిజమైన సంతోషం.💐*
*👌🍎జీవితంలో ఐదు విషయాలు గుర్తుంచుకోండి:🧭☔*
*👉(1). మీ పిల్లలకు ధనవంతులుగా కంటే సంతోషంగా మరియు ఆరోగ్యాంగా వుండటం నేర్పండి. దానివల్ల, పెరిగి పెద్దయిన తర్వాత.. వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది.* *👉(2). ఆహారమే ఔషధం. ఆహారాన్ని ఔషధంగా వాడండి.. లేకపోతే ఔషధమే ఆహారమౌతుంది.* *👉(3). వంద కారణాలు చూపినా, నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు. నీతో వుండటానికి ఇంకొక్క కారణం చూపిస్తారు.* *👉(4). మనిషికి, మానవత్వంగల మనిషికి తేడా వుంది.* *👉(5). వేగంగా వెళ్లాలంటే.. ఒంటరిగా వెళ్లు. కానీ, దూరం వెళ్లాలంటే.. కలిసి వెళ్లు.*
*📗🌅చివరగా, వీటిని గుర్తుంచుకో: వెలుతురు, ఆహారం, విశ్రాంతి, వ్యాయామం, స్నేహితులు మరియు నీపైన నీకు విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి !*
*నీ జీవితంలోని ప్రతి మలుపులో వీటిని గుర్తుంచుకోవాలని తెలియచేస్తూ మీ శ్రేయోభిలాషి
telugumitra
*నాన్నలందరికీ అంకితం*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.
“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు.
“అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను.
దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు.
“మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా
“అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా.
మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను.
అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసి, అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. “మీ నాన్నగారు రా!” అంటూ అమ్మ తన కంటి చూపు తో ఆయన్ని పరిచయం చేసింది.
బ్రహ్మాదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు. తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని. మరి నాన్న అంటే ఎవరు? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి.ఆ దేవుడినే అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా.
“ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు. అప్పుడే నన్ను గుర్తుచేసుకున్నావేమిటి?” అని అడిగాడు. అమ్మ గురించి చెప్పారు గాని, నాన్న గురించి ఏమీ చెప్పలేదెంటని అడిగా.
“నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది” అని ముక్తసరిగా బదులిచ్చి, “అర్ధమైందా?” అని ప్రశ్నించాడు.
“పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాస తో బదులిస్తే ఎలా అర్ధం అవుతుంది స్వామి” అని సమాధానం చెప్పాను.
ఒక అర్ధం లేని చిరునవ్వు నవ్వి, “నీకూ మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు” అని క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్ధమైంది నా బుజ్జి బుర్రకి, నా కష్టం తీర్చేది అమ్మ అని. మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని.
ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. “ఏం, నేనంటే ప్రేమ లేదా” అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ. “నీ మీద ప్రేమ ఉంది కాబట్టే, రోజు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తున్నాడు” అని బదులిచ్చాడు బ్రహ్మా. అర్ధం కాలేదని చెప్పాను. కొన్నేళ్లకు నీకే అర్ధం అవుతుందిలే అన్నాడు.
ఈయన అన్నీ తల తిక్క సమాధానాలే చెబుతాడులే అనుకుని, నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూసా. మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా. మా నాన్న ముఖం లోని నీరసం మాయమైంది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది. ఆ దేవ దేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా! అని గర్వపడటం మొదలుపెట్టా.
మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతి సారి, మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి.
కొన్నాళ్ళకి, నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందామని ప్రయత్నించా. కానీ ఫలితం లేదు. పదే పదే పడిపోతూనే ఉన్నా. ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు. నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడనుకున్నా! “నా వేలు పట్టుకుని నిల్చో నాన్నా” అన్నారు.
నిలబడగలిగాను కానీ, నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహా శివుణ్ణి, మనసులో ప్రార్దించడం మొదలుపెట్టా. తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను. ఆ ఢమరుక నాదపు సడిలో, వడి వడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా. ఆ మహా శివుడికి నా మొర వినిపించలేదేమో! నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు. నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుక నాదం లేకపోతేనేం!, నా గుండే చప్పుడుని నీ అరికాళ్ళతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు. ఏం మాయో తెలీదు. నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా. నడక రాని నేను నాన్న గుండెల మీద యధేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా.
నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి. నడవటం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక, అటూ ఇటూ చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహా విష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా, మరి నాకు భయమెందుకు. ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా. ఆయన కనిపించలేదు గాని వినిపించాడు. “ఏమైంది బాలకా” అని అన్నాడు. “భయం వేసింది స్వామి. అందుకే పిలిచా” అన్నా నేను.
“భయం ఎందుకు? నీవు నడుస్తుంది మీ నాన్న నీడ లోనేగా” అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూసా. అవును నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్చనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా, నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయ్యింది. అప్రయత్నంగానే నా పెదవులు ‘నాన్న’ అని పలకటం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ, నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది.
నాకు ఏ అవసరం వచ్చినా, ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు, మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది. దేవుడు వచ్చేవాడో, రాడో తెలీదు గాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ, నేను చెప్పక ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు. కొన్నాళ్ళకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి.
ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను.
“నీ జీవిత మజిలీ ఎలా సాగింది?” అని ప్రశ్నించారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు.
“మీరు నాకు ఏ మంత్రమూ భోదించకపోయినప్పటికీ, నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు.” అని సమాధానం చెప్పాను గర్వంగా.
“అదేంటి అలా అంటావ్! మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తుండటం ఉండటం మేము గమనిస్తూనే ఉన్నాం” అన్నారు మూకుమ్మడిగా.
“నాకు ఏం అర్ధం కావట్లేదు స్వామి” అని బదులిచ్చా నేను. బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్ష్యమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్ష్యమైంది. అప్పుడు గానీ అర్ధం కాలేదు ఈ మనిషి బుర్రకి, (మట్టి బుర్రకి). “అమ్మ ఆ దేవుడి అంశ అని” “నాన్న సాక్ష్యాత్ దేవుడని”. మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి. అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను.
ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి, నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో. క్షమిస్తా, కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవ దేవుడు. ఏమిటది స్వామీ! అని అడిగా ఆశ్చర్యంగా. నన్ను ఆఖరుసారిగా ‘నాన్న’ అని సంభోదించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు. ఆ మహా మంత్రాన్ని ఇంకోసారి జపించడానికి, నిముషం కూడా ఆలస్యం చేయలేదు నేను. నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా.
“అమ్మ దేవుడి అశ అయితే,
నాన్న సాక్ష్యాత్ దేవుడే”🙏
🙏🙏🙏🙏🙏🙏
5 years ago | [YT] | 0
View 0 replies
telugumitra
*క్షమ.*
క్షమ’ అనే పదంలో ఉన్న రెండు అక్షరాలు చాలా ప్రాధాన్యం కలవి. అందులో క్ష అనే అక్షరం దృఢత్వాన్ని, మ అనే అక్షరం రమ్యతను తెలియజేస్తుంది. మనిషన్నవానికి గుండె గట్టిగా, మనస్సు మెత్తగా ఉండాలన్నది ఈ క్షమ చెబుతుంది.
ఇక్కడ గుండె అంటే గుండెధైర్యం ధర్మాన్ని కాపాడుతాను, శరణు అన్నవారిని రక్షించగలను. నా దేశాన్ని నేను నా శాయశక్తులా రక్షించగలను అనే ధైర్యం ఉండాలి. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ల మధ్య, తల్లిదండ్రుల పైన ప్రేమ సౌభాతృత్వమూ ఉండాలి. తల్లిదండ్రులపైన అనురాగము, గురువులపైన గౌరవమూ, పెద్దలంటే ఆదరమూ చూపించాలని కూడా ఈ క్షమలోని అంతరార్థం.
అంతేకాక క్షమ అనేది మనిషిలో ఉండాల్సిన ఉత్తమ గుణం. పరిస్థితుల దృష్ట్యా ఎదుటివారిపైన కోపం కలుగవచ్చు. మహాత్ముల కోపం తాటాకు మంటవంటిది అంటారు. అటువంటి కోపం ఎవరి మీద అయినా ఉండవచ్చు. కానీ ఆ కోపం క్రోధంగా, ద్వేషంగా మారి ఎదుటిమనిషి ప్రాణం తీయడానికో లేక తీవ్రమైన నష్టం కలిగించడానికో పూనుకొనే కోపం ఎవరిలోను ఉండకూడదు. అట్లా ఎదుటి వారు తప్పు చేసినప్పటికీ ఆ తప్పును తెలుసుకొనేట్లు చేసి వారిలో పశ్చాత్తాపం కలిగేలా ప్రవర్తించాలి. అంతేకాని వారిపైన కసిని, ద్వేషాన్ని రగిలించుకోకూడదు. వాళ్లు తప్పు చేశామనే పశ్చాత్తాపంతో ఉన్నపుడు క్షమించగలగాలి. వారిని మంచివారిగానే చూడగలగాలి.
క్షమ ఉండేవారిలో భూదేవి మొట్టమొదటిగా చెప్తారు. భూదేవి తన్ను గునపాలతో తవ్వినా, ఇంకే యంత్రాలతో తవ్వినా, అసభ్యకరాలను భూమిపై వేసినా కూడా భూమి మనిషికి మంచే చేస్తుంది కానీ కీడు చేయదు. అందుకే భూమి అంతటి క్షమాగుణం మనిషిలోను ఉండితీరాలని పెద్దలు అంటారు. రావణుడు తప్పు చేసి సీతమ్మవారిని తీసుకొని వెళ్లి రామునితో యుద్ధానికి తలపడినపుడు ఆ యుద్ధంలో నిరాయుధుడైతే రాముడు ఇప్పటికైనా నీ తప్పును నీవు తెలుసుకొంటే నిన్ను నేను క్షమిస్తాను అని చెప్తాడు. పైగా నీవు నిరాయుధుడివి అయ్యావు కనుక వెళ్లి తిరిగి ఆయుధపాణివై రమ్ము నీతో పోరాడుతాను అని చెప్పి పంపించేస్తాడు. అది రామునిలోని క్షమాగుణం.
సమాజం పట్ల, సమాజంలోని జీవుల పట్ల , సమాజ వ్యవహారాల పట్ల ప్రతి వారు క్షమను కలిగి ఉండాలని రామాయణం చెబుతుంది. పూర్వం మునులు దానవులు చేసిన తప్పులను క్షమించేవారు. ఒకవేళ దానవులను శపించినా తిరిగి ఆ శాపాలకు విముక్తిమార్గాన్ని కూడా చూపేవారు. అందుకే వారిని మహాత్ములు మనం నేటికీ గుర్తుపెట్టుకుంటున్నాము.
. క్షమిస్తున్నారని, లేక క్షమిస్తారే అనే ఆలోచనతో తప్పులు చేయకూడదు. తప్పు చేసిన వారికి కఠినమైన శిక్ష ఉండితీరాలి. కాని ఆ తప్పును తెలుసుకొని వారిలో పశ్చాత్తాప గుణం కలిగితే మాత్రం వారిని క్షమించడం ఉత్తముల లక్షణం అని చెప్పవచ్చు. అందుకే ప్రతివారిలో ధర్మాగ్రహం ఉండి తీరాలి.
క్షమించేగుణమూ అలవర్చుకోవాలి.
5 years ago | [YT] | 0
View 0 replies
telugumitra
*ఓ తండ్రి.........ఓ కొడుకు*
నాని : నాన్నా! ఈ నెల తాతయ్య మన ఇంటికి రాలేదేంటి?
తల్లి: మీ నాన్న వెళ్ళి మీ తాతయ్యను తీసుకుని రాకపోయినా మీ పెద్దనాన్న
ఇక్కడికి వచ్చి మీ తాతయ్యను దింపివెళతారులేరా!( ఎగతాళిగా)
అనుకున్నట్లుగానే ఫోను రింగ్ అయింది.....
తల్లి: నేను చెప్పాను కదా! మీ అన్నయ్యగారే అయిఉంటారు......మీ నాన్నగారిని
తీసుకెళ్ళమని చెప్పడానికే! (భర్తను ఉద్దేశించి)
తండ్రి: అవును . అన్నయ్యనే కాల్ చేస్తున్నాడు.
అంటూ ఫోను తీసుకుని ఇలా మాట్లాడాడు.......
పెద్దనాన్న: ఏరా! ఎలా ఉన్నారు.......ఏంటి ఇంకా నాన్నగారిని తీసుకుని
వెళ్ళలేదు . ప్రొద్ధుటి నుండి నాన్నగారు కలవరిస్తున్నారు
చిన్న కొడుకు రాలేదని! త్వరగా వచ్చి తీసుకుని వెళ్ళు/
తండ్రి: ఇదుగో వచ్చేస్తున్నాను అన్నయ్యా! ఆఫీసులో కాస్త పని ఒత్తిడి వల్ల
సాయంకాలం తీసుకుని వొద్దామనుకుంటుండగా నీవు కాల్ చేశావు.
అంటూ ఫోను పెట్టేసి నసుగుతూ.........బయలుదేరాడు.......
ఇదంతా గమనిస్తున్న నానీ ( మనవడు) నాన్నగారిని ఇలా అడిగాడు.
నాని: నాన్నా! నాకో డౌటు.......తీరుస్తారా????????
తండ్రి: ఇప్పుడేం డౌటు రా! ముందు మీ తాతయ్యను తీసుకుని రానివ్వు.
తరువాత నీ డౌటు తీరుస్తాను......
నాని: ఇప్పుడే చెప్పండి. నాన్నా! తాతయ్యకు ఇద్దరు కొడుకులు..
ఒక నెల మీరు...........ఒక నెల పెద్దనాన్న ....ఇలా మార్చి మార్చి
తాతయ్యను చూసుకుంటున్నారుకదా! మరి మీకు నేను ఒక్కడినే
కొడుకును కదా! నేను పెద్దయ్యాక ఒక నెల మా ఇంట్లో ఉంటారు.
మరి మరుసటి నెల ఎక్కడికి పోతారో చెప్పండి నాన్నా!
ఎవరో చాచి చెంపదెబ్బ కొట్టినట్లు ఉలిక్కిపడ్డాడు ఆ తండ్రి..........
కన్నవారిని పంచుకోకండి....వారు మీకు ప్రేమను పంచినవారు........
వారి కంట కన్నీరు బిడ్డలమైన మనకు మంచిదికాదు.......దయచేసి
తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోకపోయినా,,, భారంగా తలచి....
చివరిదశలో వారిని అలక్ష్యం చేయకండి..రేపు మనమూ పెద్దవారము
అవుతాము మన పిల్లలు అలా చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి
ఆలోచించిండి.......పెద్దలను గౌరవించండి.......🙏🙏
5 years ago | [YT] | 1
View 0 replies
telugumitra
🙏🙏🙏🙏🙏🙏🙏🌹
మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు.దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరకు వెళ్ళి"దాహంగా ఉంది,నీళ్లు ఇవ్వండి"అని అడుగుతాడు....
గుడిస లోపల నుండి ఓ ముసలావిడ బయటకు వచ్చి ‘మీరెవరు?ఎక్కడనుండి వస్తున్నారు?'అంటుంది....
కాళిదాసు"నేను ఎవరో తెలియకపోవడం ఏంటి?నేను ఓ పెద్ద పండితుడను.ఎవరిని అడిగినా చెబుతారు"అని అంటాడు....
ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి..'మీరు అసత్యమాడుతున్నారు.మీరంత గొప్పవారైతే ప్రపంచంలో ఇద్దరు బలవంతులెవరో చెప్పండి’అంటుంది....
కాళిదాసు కాసేపు ఆలోచించి"నాకు తెలియదు.గొంతు ఎండి పోతుంది,ముందు నీళ్లు ఇవ్వండి"అని బతిమాలుకుంటాడు...
"ఆ ఇద్దరు బలవంతులు ఆకలి, దాహం.ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?"అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....
ఈసారి ‘నేను బాటసారి’ని అంటాడు కాళిదాసు....
అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరూ అంటూ ప్రశ్నిస్తుంది ముసలావిడ....
తెల్ల ముఖం పెట్టి మాతా!"నీళ్ళు ఇవ్వండి.లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను" అంటూ ప్రాదేయపడతాడు కాళీదాసు....
వాళ్ళు సూర్యచంద్రులు’అని తెలిపి"మరి మీరెవరో సెలవివ్వండి.నీళ్లిస్తాను" అంటుంది ముసలావిడ....
కాళిదాసు దీనంగా"నేను అతిథిని"అని బదులిస్తాడు....
"మీరు మళ్ళీ అసత్యం చెబుతున్నారు.ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే.ఒకటి ధనం, రెండోది యవ్వనం.అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు"అంటుంది ముసలావిడ....
కాళిదాసు"నా సహన పరీక్ష తరువాత చేద్దురు.ముందు నీళ్లు ఇవ్వండి"అని వేడుకుంటాడు....
"ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు.వారెవరో శెలవివ్వ గలరా" అంటూ...బిక్కమొహం వేసిన కాళీదాసుతో"ఒకటి భూమి,రెండోది వృక్షం"అని భోద పరచి"ఇప్పుడు నిజం చెప్పండి మీరెవరు?"అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....
ఓపిక నశించిన కాళిదాసు"నేను మూర్ఖుడను.ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్లివ్వండి"అని సాగిల పడతాడు....
ఆ అవ్వ నవ్వుతూ"ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు"అని అంటుంది....
ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది.ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు....
ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది.‘నాయనా! విద్యతో వినయం వృద్ధి చెందాలి,అహంకారం కాదు.కీర్తి,ప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరి చేయటానికే ఈ పరీక్ష’ అని మంచినీరు అందించి దాహం తీరుస్తుంది.
*విద్య, అధికారం, ధన బలము తో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి*. 👍👍శుభోదయం
5 years ago | [YT] | 1
View 0 replies
telugumitra
💐 *స్టీవ్ జాబ్స్.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు:*
📘✍️📘✍️📘✍️📘✍️👍
*పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం.. కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే.*
*రోగంతో లేవలేని స్థితిలో.. నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది.*
*నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ.. నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒక ఆరోగ్యాన్ని పోగొట్టుకొన్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే " జీవితం ''.*
*🏵️🏵️అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు.🌈🌈*
*"మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది.''*
*"30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది.''*
*"మన జేబులో 30 డాలర్లున్నా, 300 డాలర్లున్నా.. అందులో తేడా ఏమీ వుండదు.''*
*"ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కారైనా.. ప్రయాణించే దూరం, బాట ఒకటే, చివరికి అదే గమ్యం చేరుతాం.''*
*"మనం వుండే ఇల్లు మూడొందల గజాలైనా, మూడువేల గజాలైనా నీ ఒంటరితనం నీదే. నీలోని మనిషికి సంతోషం.. నీ బాహ్యప్రపంచ వస్తువులతో రాదు.''*
*"నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసినా, ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసినా.. విమానం కూలినప్పుడు దాంతోపాటు నువ్వు కూడా పోతావు.''*
*💐అందుకే, మాట్లాడటానికి నీకు స్నేహితులు, బంధువులు వుంటే.. అదే నిజమైన సంతోషం.💐*
*👌🍎జీవితంలో ఐదు విషయాలు గుర్తుంచుకోండి:🧭☔*
*👉(1). మీ పిల్లలకు ధనవంతులుగా కంటే సంతోషంగా మరియు ఆరోగ్యాంగా వుండటం నేర్పండి. దానివల్ల, పెరిగి పెద్దయిన తర్వాత.. వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది.*
*👉(2). ఆహారమే ఔషధం. ఆహారాన్ని ఔషధంగా వాడండి.. లేకపోతే ఔషధమే ఆహారమౌతుంది.*
*👉(3). వంద కారణాలు చూపినా, నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు. నీతో వుండటానికి ఇంకొక్క కారణం చూపిస్తారు.*
*👉(4). మనిషికి, మానవత్వంగల మనిషికి తేడా వుంది.*
*👉(5). వేగంగా వెళ్లాలంటే.. ఒంటరిగా వెళ్లు. కానీ, దూరం వెళ్లాలంటే.. కలిసి వెళ్లు.*
*📗🌅చివరగా, వీటిని గుర్తుంచుకో: వెలుతురు, ఆహారం, విశ్రాంతి, వ్యాయామం, స్నేహితులు మరియు నీపైన నీకు విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి !*
*నీ జీవితంలోని ప్రతి మలుపులో వీటిని గుర్తుంచుకోవాలని తెలియచేస్తూ మీ శ్రేయోభిలాషి
📘💐🙏📘💐🙏📘💐🙏
5 years ago | [YT] | 1
View 0 replies